NRPT: కృష్ణ మండలం గూడెబళ్లూరు గ్రామానికి చెందిన పలువురు యువకులు మంగళవారం జనసేన పార్టీలో చేరారు. మక్తల్ ఇంఛార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై వారు పార్టీ కండువా కప్పుకున్నారు. యువత అంతా కలిసి ప్రజా సమస్యలపై పోరాడి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా మణికంఠ గౌడ్ పిలుపునిచ్చారు.