SRPT: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు అన్నారు. మంగళవారం తిరుమలగిరి మున్సిపాలిటీలోని 6వ వార్డులో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మురికి కాల్వలను పరిశుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించి మాట్లాడారు. పరిసర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులు దరిచేరవన్నారు.