WGL: ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ గ్రామంలోని విషాదం చోటు చేసుకుంది. గోవిందు తండాలో తండావాసులు బోనాల పండుగ జరుపుకుంటుండగా మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే బాధితులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.