SRD: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ అన్నారు. ఖేడ్ మండలం జుక్కల్ రైతు వేదికలో నేడు ఎరువుల డీలర్లకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. రానున్న వానకాలం సీజన్లో వర్షపాతం తక్కువగా ఉంటుందని అందుకు అనుగుణంగా తక్కువ నీటితో స్వల్పకాలిక రకాల పంటల విత్తనాలను అందుబాటులో ఉంచి రైతులకు అమ్మాలన్నారు.