SRCL: గ్రామ వార్డు సభలను విజయవంతంగా నిర్వహించాలని సిరిసిల్ల కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మార్వోలు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు మండల వ్యవసాయ అధికారులు ఎంపీఓలతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఘన వ్యర్థాల నిర్వహణపై స్పష్టంగా వివరించాలన్నారు.