• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »టెక్

WhatsAppకు పోటీగా స్వదేశీ యాప్

ప్రధాని మోదీ స్వదేశీ SM ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. దీంతో తమిళనాడుకు చెందిన ‘అరట్టై(Arattai)’ మెసేజింగ్ యాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ‘అరట్టై’ అంటే ‘సాధారణ చాట్’ అని అర్థం. ఈ యాప్‌కు రోజుకు 3 లక్షల మంది కొత్త యూజర్లు వస్తున్నారు. భవిష్యత్తులో ఈ స్వదేశీ యాప్ WhatsAppకు గట్టి పోటీ ఇస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

September 29, 2025 / 10:01 AM IST

రూ.49,999కే ఓలా స్కూటర్లు

దసరా పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. నవరాత్రుల సందర్భంగా ఓలా మూరత్ మహోత్సవ్ కింద ఎస్1 స్కూటర్లు, రోడ్‌స్టర్ ఎక్స్ మోటర్‌సైకిళ్ల ప్రారంభ ధరను రూ.49,999గా నిర్ణయించింది. ఈ తొమ్మిది రోజులపాటు ఈ ధరలు అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.

September 24, 2025 / 07:23 AM IST

తగ్గనున్న కార్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంతంటే? 

కార్ల అగ్రగామి సంస్థ మారుతి సుజుకి కొత్త GST రేట్ల నేపథ్యంలో ధరలను తగ్గించింది. S-ప్రెస్సోపై రూ.1,29,600, ALTO K10 రూ.1,07,600, సెలేరియో రూ.94,100, డిజైర్ రూ.87,700, వ్యాగన్-R రూ.79,600, ఇగ్నిస్ రూ.71,300, స్విప్ట్ రూ.84,600, బాలెనో రూ.86,100, ఫ్రాంక్స్ రూ.1,12,600, బ్రెజ్జా రూ.1,12,700, గ్రాండ్ విటారా రూ.1,07,000, జిమ్నీ రూ.51,900, ఎర్టిగాపై రూ.46,400 మేర ధరలు తగ్గించింది.

September 19, 2025 / 06:59 AM IST

తక్కువ ధరలో ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి అందుబాటు ధరలో తీసుకురావాలనే లక్ష్యంతో ఫోక్స్‌వ్యాగన్ కొత్త ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV ‘ఐడీ. క్రాస్’ నమూనాను ఆవిష్కరించింది. అంతర్జాతీయంగా ఈ కారును 2026 వేసవిలో విడుదల చేసే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.25-27Lగా ఉండవచ్చని అంచనా. చైనా కంపెనీల నుంచి వస్తున్న పోటీని ఎదుర్కోవడానికి ఈ మోడల్ సహాయపడుతుందని ఫోక్స్‌వ్యాగన్ భావిస్తోంది.

September 8, 2025 / 11:32 AM IST

టెస్లాపై ఇంట్రెస్ట్ చూపని భారతీయులు

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ భారత్‌లో జూలై 15 నుంచి తన టెస్లా కార్ల అమ్మకాలను ప్రారంభించారు. Y మోడల్ కార్లకు 600 ఆర్డర్లు వచ్చినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ మోడల్ ఈవీ ధర రూ.59 లక్షల నుంచి రూ.68 లక్షల వరకు ఉంది. కేవలం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల లోపే భారత కంపెనీలు హైఎండ్ ఈవీ అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులు టెస్లా వైపు ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది.

September 2, 2025 / 05:48 PM IST

‘రెనాల్ట్’ కార్లపై బంపర్ ఆఫర్

భారత మార్కెట్లో గుర్తింపు పొందిన రెనాల్ట్ కార్ల కంపెనీ కొత్త సంవత్సరంలో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ వాహనాలపై 3 సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ ప్లాన్ తీసుకొచ్చింది. కస్టమర్లు తమ వారంటీని 4, 5, 6 లేదా ఏడేళ్లపాటు పొడిగించుకోవచ్చు. ఇది లక్ష కి.మీ., 1.20, 1.40 కి.మీ. లేదా అపరిమిత కిలోమీటర్ల వరకు అందుబాటులో ఉంటుంది. క్విడ్, కైగర్, ట్రైబర్ మోడళ్లను విక్రయిస్తోంది.

January 3, 2025 / 12:40 PM IST

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్​ డౌన్

ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సేవల్లో ఇవాళ అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో AIRTEL మొబైల్, ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్ సేవలు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వెళ్లగక్కారు. గుజరాత్‌లో వినియోగదారులు ఎక్కువగా ప్రభావితం అయినట్లు తెలుస్తోంది. మరి మీక్కూడా అంతరాయం ఏర్పడిందా..?

December 26, 2024 / 04:26 PM IST

ఈ-విటారా ఎలక్ట్రిక్ కారు లాంచ్.. ఎప్పుడంటే?

భారత మార్కెట్‌లో మారుతి సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. ఈ-విటారా పేరుతో 2025 జనవరి 17న విడుదల కానుంది. దీని ధర ఇంకా ప్రకటించలేదు. కానీ, ఎక్స్‌షోరూమ్ ధర రూ.20 లక్షలు ఉండవచ్చని అంచనా. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రారంభించనున్నారు. ప్రయాణికుల భద్రతకు ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, అధునాతన భద్రతా ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

December 25, 2024 / 07:20 PM IST

బ్లూటూత్‌ కనెక్టివిటీతో హోండా ఎస్‌పీ 160

దేశీయ మార్కెట్‌లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా.. కొత్త ఎస్‌పీ160 బైక్‌ను లాంచ్ చేసింది. ఆ సంస్థ ఇటీవల ఎస్‌పీ 125ని లాంచ్ చేయగా.. తాజాగా ఎస్‌పీ160ని తీసుకొచ్చింది. దీని ధర రూ.1,21,951. హై ఎండ్ వేరియంట్ ధర రూ.1.27 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఎస్‌పీ 160లో 4.2 అంగుళాల టీఎఫ్‌టీ డిస్ ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది.

December 24, 2024 / 08:10 PM IST

న్యూ లుక్‌తో యాక్టివా 125 స్కూటర్

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ భారత్‌లో యాక్టివా 125ని న్యూ లుక్‌తో విడుదల చేసింది. ఈ స్కూటర్‌లో కస్టమర్లకు ఆధునిక ఫీచర్లు, కొత్త కలర్ ఆప్షన్లు ఇంకా డివైజ్‌లో అప్‌గ్రేడ్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. దీని ధర రూ.94,422 (ఎక్స్‌షోరూమ్). ఇందులో పర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మాట్ యాక్సిస్ గ్రే మేటలిక్, డీప్ గ్రౌండ్ గ్రే, సైరన్ బ్లూ, రెబెల్ రెడ్ మేటలిక్, పర్ల్ ప్రీషియస్ వైట...

December 22, 2024 / 11:15 AM IST

న్యూ లుక్‌తో ఆక్టివా 125 స్కూటర్

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ భారత్‌లో ఆక్టివా 125ని న్యూ లుక్‌తో విడుదల చేసింది. ఈ స్కూటర్‌లో కస్టమర్లకు ఆధునిక ఫీచర్లు, కొత్త కలర్ ఆప్షన్లు ఇంకా డివైజ్‌లో అప్‌గ్రేడ్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. దీని ధర రూ.94,422 (ఎక్స్‌షోరూమ్). ఇందులో పర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మాట్ యాక్సిస్ గ్రే మేటలిక్, డీప్ గ్రౌండ్ గ్రే, సైరన్ బ్లూ, రెబెల్ రెడ్ మేటలిక్, పర్ల్ ప్రీషియస్ వైట్...

December 22, 2024 / 11:15 AM IST

అడ్డమైన థంబ్‌నైల్స్‌కు అడ్డుకట్ట!

ఎక్కువ వ్యూస్ కోసం కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అడ్డమైన థంబ్‌నైల్స్ పెట్టేస్తుంటారు. థంబ్‌నైల్‌కు కంటెంట్‌కు ఏమాత్రం పొంతన ఉండదు. అలాంటి వారిని అరికట్టేందుకు యూట్యూబ్ కొత్త రూల్స్ తీసుకు రానున్నట్లు తెలిపింది. అలాగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. వీటిని పాటించేందుకు క్రియేటర్లకు తగిన సమయం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.

December 21, 2024 / 05:20 AM IST

బజాజ్‌ చేతక్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 153KM

బజాజ్ కొత్త చేతక్ EV మార్కెట్‌లోకి వచ్చేసింది. చేతక్‌ 35 సిరీస్‌లో 3501, 3502 పేరిట 2 వెర్షన్లను తీసుకొచ్చింది. 3501 ప్రీమియం మోడల్‌ ధర రూ.1.27 లక్షలు. 3502 ధరను రూ.1.20 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇదే సిరీస్‌లో 3503 మోడల్‌ను త్వరలో తీసుకురానున్నారు. ఇందులో 3.5 kWh బ్యాటరీ, 4kW మోటార్‌ను అమర్చారు. సింగిల్‌ ఛార్జ్‌తో 153 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని...

December 20, 2024 / 02:18 PM IST

కొత్త ఏడాదిలో కార్ల ధరలు పెంపు

ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా ఇండియా కార్ల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. అన్ని మోడళ్లపై 2% పెంపు ఉంటుందని, ఈ కొత్త ఏడాది నుంచి పెరిగిన ధరలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఉత్పత్తి వ్యయం, లాజిస్టిక్ ఖర్చులు పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్ వంటి కార్ల సంస్థలు కూడా 2025 నుంచి ధరలను పెంచుతున్నట్లు పేర్కొన్నాయి.

December 20, 2024 / 12:18 PM IST

యాపిల్‌ను అధిగమించిన హువావే

దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ ప్రపంచ టాప్ స్మార్ట్ వాచ్ బ్రాండ్ టైటిల్‌ను కోల్పోయింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(IDC) తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. 2024 మొదటి మూడు త్రైమాసికాలలో హువావే 23.6 మిలియన్ స్మార్ట్‌వాచ్‌లు, రిస్ట్‌బ్యాండ్‌లను షిప్పింగ్ చేసి యాపిల్‌ను అధిగమించి మొదటి స్థానంలోకి ఎగబాకింది. కాగా, 2వ స్థానంలో యాపిల్.. 3, 4 స్థానాల్లో షియామి, శామ్‌సంగ్...

December 19, 2024 / 03:05 PM IST