AP EAPCET-2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. http://cets.apsche.ap.gov.in/లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 12 నుంచి 15 వరకు, 18న ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్, 19, 20న అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు.
ఇండియన్ బ్యాంకులో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. IT, అకౌంట్స్, క్రెడిట్, ఫైనాన్స్, రిస్క్ మేనేజ్మెంట్, HR, మార్కెటింగ్, సెక్యూరిటీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వయసు 22-37 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టును బట్టి అర్హత BE, BTech, CA, MBA. పూర్తి వివరాలకు https://ibpsreg.ibps.inను సంప్రదించాలి.
TG: ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను మే 5 నుంచి మే 10 మధ్యలో విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఆశించిన మార్కులు రాని లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మే 13 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల దృష్ట్యా విద్యార్థుల్లో గందరగోళం తగ్గించేందుకు ముందుగానే ఈ ఫలితాలను విడుదల చేయనుంది.
TG: తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం నిర్వహించే TGRJC CET 2026 హాల్టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన విద్యార్థులు ఇప్పుడు ఆన్లైన్లో తమ హాల్టికెట్లు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా, మే 3న పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఒక ఫొటో ఐడీ ఫ్రూఫ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
TG: డిగ్రీ నూతన కోర్సుల రాక కాస్త ఆలస్యంకానుందా..? దోస్త్ మొదటి విడుత తర్వాతే ఇవి అందుబాటులోకి రానున్నాయా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే దోస్త్ మొదటి విడత కౌన్సెలింగ్లోపు ఈ కోర్సులు అందుబాటులోకి రావడం కష్టంగానే కనిపిస్తున్నది. కాగా, 220 డిగ్రీ కాలేజీలు పలు కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు NEET(UG)-2026కు సమయం ఆసన్నమైంది. లక్షలాది మంది విద్యార్థులు ఎంతో కలలు కనే డాక్టర్ వృత్తికి ఈ పరీక్షే తొలి మెట్టు. అయితే విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా.. పరీక్షకు ముందు రోజు కనీసం 7-8 గంటల ప్రశాంతమైన నిద్ర తీసుకోండి. తేలికపాటి ఆహారం తినండి. కాగా, మే 3న పరీక్ష జరగనుంది.
AP: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీ పొడిగించారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ 27 చివరి తేదీ కాగా.. గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఏప్రిల్ 30 తర్వాత గడువు తేదీ పొడిగించబోమని స్పష్టం చేశారు.
TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2026 ఒకటో విడత)కు దరఖాస్తు గడువు ఈనెల 30వ తేదీతో ముగియనుంది. 27వ తేదీ వరకు 85,426 మంది దరఖాస్తు చేశారు. పేపర్-1కు 19,933, పేపర్-2కు 54,059 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ గాజర్ల రమేష్ వెల్లడించారు. దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని సూచించారు.
విండోస్ 11 అప్డేట్ కష్టాలకు మైక్రోసాఫ్ట్ చెక్ పెట్టింది. యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా అప్డేట్కు సంబంధించి కీలక మార్పులు చేసింది. గతంలో అప్డేట్లను గరిష్ఠంగా 35 రోజుల వరకు మాత్రమే ఆపడానికి అవకాశం ఉండేది. ఇకపై ప్రతి 35 రోజులకోసారి పొడిగించుకుంటూ మీకు నచ్చినన్ని రోజులు అప్డేట్ను వాయిదా వేసుకునే వెసులుబాటు కల్పించింది.
ఫ్లిప్కార్ట్కు చెందిన క్లియర్ ట్రిప్.. ట్రైన్ టికెట్ బుకింగ్ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు IRCTCతో జత కట్టింది. క్లియర్ ట్రిప్ యూజర్లు సాధారణ, తత్కాల్ కోటా టికెట్లను బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇందులో రియల్టైమ్ సీట్ అందుబాటు, ఫేర్ వివరాలు, PNR స్టేటస్ ట్రాకింగ్, డిజిటల్ పేమెంట్స్ వంటి సేవలు లభిస్తాయని తెలిపింది.
దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో తక్కువ ధర ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. రూ.50 లక్షల లోపు ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 23 శాతం క్షీణించాయి. కొత్త ఇళ్ల నిర్మాణం తగ్గడమే దీనికి ప్రధాన కారణమని నివేదికలు చెబుతున్నాయి. సామాన్యులు కొనే ఇళ్ల సంఖ్య తగ్గిపోవడంతో, మొత్తం 16,273 ఇళ్లు మాత్రమే అమ్ముడైనట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది.
RBI పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడంతో పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు ఇవాళ ట్రేడింగ్ లో 8 శాతం కుప్పకూలాయి. NSEలో రూ.1,051.10 కనిష్టానికి చేరినప్పటికీ, తర్వాత పుంజుకుని 1 శాతం నష్టానికి పరిమితమయ్యాయి. ఈ నిర్ణయం తమ ఆర్ధిక స్థితిపై ప్రభావం చూపబోదని కంపెనీ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం షేరు రూ.1,127 వద్ద కొనసాగుతోంది.
NEET అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు neet.nta.nic.in లేదా exams.nta.ac.in/NEET ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా MAY 3న మ.2 నుంచి సా.5 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.380 పెరిగి రూ.1,54,420కి చేరింది. అలాగే, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.350 పెరిగి రూ.1,41,550గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2,70,000గా ఉంది.
అమెరికాకు చెందిన హెల్త్కేర్ సంస్థ ఆర్గానన్ అండ్ కోను కొనుగోలు చేయనున్నట్లు సన్ ఫార్మా ప్రకటించింది. ఒక్కో షేరుకు 14 డాలర్ల చొప్పున పూర్తిగా నగదు రూపంలో కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ కొనుగోలు ఒప్పందం విలువ 11.75 బిలియన్ డాలర్లు (రూ.లక్ష కోట్లు)గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం ప్రపంచంలోని టాప్ 25 ఫార్మా కంపెనీల్లో ఒకటిగా సన్ఫార్మా నిలవనుంది.