HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్(NIRDPR)లో 9 పోస్టలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ రోజు. వీడియో ఎడిటర్, వీడియోగ్రాఫర్, ట్రైనింగ్ మేనేజర్ తదితర పోస్టులు ఉండగా.. డిగ్రీ, PG, PhD ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు సైట్:
దేశంలోని RBI కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి ఇవాళ్టితో గడువు ముగియనుంది. కేంద్రాల వారీగా హైదరాబాద్లో 11 పోస్టులు ఉండగా.. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వర్డ్ ప్రాసెసింగ్, స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. APR 4న, జూన్ 7న మెయిన్స్ నిర్వహించే ఛాన్స్ ఉంది. ఎంపికైనవారికి నెలకు రూ.58,514(+అలవెన్సులు) జీతం చెల్లిస్తారు.
TG: గత ప్రభుత్వం తీసుకొచ్చిన GO 317 వల్ల వేల సంఖ్యలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగ జేఏసీ నాయకులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. వారికి న్యాయం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బాధితులకు పరిష్కారం అందించాలని మంత్రులు దామోదర, పొన్నం ప్రభాకర్ను కలిశారు. బాధితులకు పరిష్కారం చేస్తామని భరోసా కల్పించారు.
బ్యాంక్ వివరాలు, కేవైసీ(KYC) లేదా ఆధార్ లింక్ చేయడంలో తప్పులు ఉండటం వల్లే పీఎఫ్ క్లెయిమ్ పదేపదే తిరస్కరణకు గురవుతుంది. మీ పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు సరిపోలకపోయినా రిజెక్ట్ అవుతోంది. క్లెయిమ్ రిజెక్ట్ అయితే కారణాన్ని తెలుసుకుని, తప్పులను సరిచేసి మళ్లీ దరఖాస్తు చేయాలి. అవసరమైతే EPFiGMS పోర్టల్లో ఫిర్యాదు చేసి తమ సొమ్మును సులభంగా పొందవచ్చు
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ మీషోకు ఆదాయ పన్ను శాఖ రూ.1500కోట్ల పన్ను నోటీసులు పంపింది. 2023-25 మదింపు గానూ ఈ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన మీషో.. న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ నోటీసు.. తమ సంస్థ ఆర్థిక కార్యకలాపాలు, ఫైనాన్షియల్ పొజిషన్పై ప్రతికూల ప్రభావాన్ని చూపదని పేర్కొంది.
HDFC బ్యాంక్ తన రుణగ్రహీతలకు తీపి కబురు అందించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో గృహ, వ్యక్తిగత రుణాలపై EMI భారం తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640కి చేరింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.2,300 పెరిగి రూ.1,50,000 మార్కును తాకింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,90,000 వద్దే కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
NIPERలో 2 అసిస్టెంట్ ప్రొఫెసర్, 1 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. PhD, MBBS, M.Pharm, BTech, MTechలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల 40 ఏళ్ల లోపువారు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.1000. SC/ST/PwBDలకు ఫీజుల లేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.78,000.. ఆఫీసర్కు రూ.56,100 జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం సైట్: www.niper.gov.in
ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్లో 29 టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ రోజు. గ్రాడ్యుయేట్ టీచర్, PG టీచర్, ఇన్స్ట్రక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉండగా.. డిగ్రీ, BEd, MCom, MSc, BLiSc, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఈ నెల 29న ఆన్లైన్ పరీక్ష నిర్వహించి.. అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. గృహవినియోగ LPG సిలిండర్ ధర రూ.60, కమర్షియల్ వాణిజ్య సిలిండర్ ధర రూ.115 పెరిగింది. హైదరాబాద్లో LPG సిలిండర్ ధర రూ.965కు చేరింది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఉజ్వల పథకం ద్వారా అందించే సిలిండర్ ధరలు యథాతథం.
TG: ప్రజాసేవ చేసే అదృష్టం కలగడం గొప్ప అదృష్టమని, నిజాయితీగా ప్రజాసేవ చేస్తేనే గుర్తింపు వస్తుందని మల్కాజ్గిరి GJP ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల్లో ప్రజల మద్ధతుతో గెలిచిన అభ్యర్థులు హూందాగా వ్యవహరించాలని, గెలుపు గర్వం తలకెక్కించుకోకుండా నిజాయితీగా ప్రజాసేవ చేయాలని సూచించారు. లేదంటే రాజకీయ భవిష్యత్ ఉండదన్నారు. అధికార మదంతో BRS ఒకప్పుడు విర్రవీగిందన్నారు.
TG: విజయవాడ దుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. కుంభాభిషేకానికి వచ్చిన హైదరాబాద్ భక్తురాలి బ్యాగులోంచి రూ. 50 లక్షల బంగారాన్ని దుండగులు అపహరించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆలయ సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
AP: విద్యార్థులకు RTC గుడ్ న్యూస్ చెప్పింది. పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లేందుకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. హాల్ టికెట్ చూపించిన ప్రతీ విద్యార్థి ఫ్రీగా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.
ఇవాళ విడుదలైన సివిల్స్ ఫలితాల్లో రాజస్థాన్కు చెందిన అనూజ్ అగ్నిహోత్రి మొదటి ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఇతడు జోధ్పుర్ ఎయిమ్స్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 2023లో యూనియన్ టెరిటరీస్ సివిల్ సర్వీసెస్ సాధించాడు. ప్రస్తుతం ఢిల్లీలో ఎస్డీఎంగా ప్రొబేషన్లో ఉన్నాడు. మూడో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించినట్లు తెలిపాడు.