ముంబైలోని LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఏదైనా ఒక నగరంలోని ఖాళీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అభ్యర్థులు 1996 ఏప్రిల్ 2 కంటే ముందు, 2005 ఏప్రిల్ 1 తరువాత జన్మించి ఉండకూడదు.
ఐపీఎంలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (JIPMAT) – 2026 నోటిఫికేషన్ను NTA విడుదల చేసింది. ఇంటర్తో ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఐదేళ్ల ఇండిగ్రేటెడ్ MBA కోర్సులో చేరవచ్చు. అభ్యర్థులు మే 11వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. జూన్ 7న పరీక్ష నిర్వహిస్తారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 122.56 పాయింట్ల నష్టంతో 77,988.68 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34.55 పాయింట్ల నష్టంతో 24,196.75 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.22గా ఉంది.
డిజిటల్ ప్రకటనల ప్రపంచంలో గూగుల్ ఆధిపత్యానికి మెటా చెక్ పెట్టనుంది. 2026 నాటికి ప్రకటనల ఆదాయంలో మార్క్ జుకర్బర్గ్ సంస్థ గూగుల్ను అధిగమించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. మెటా ఆదాయం 243.46 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. గతంలో గూగుల్ భారీ ఆధిక్యంలో ఉండగా.. ఇప్పుడు మెటా వేగంగా దూసుకుపోతూ నంబర్ వన్ స్థానానికి పోటీ పడుతోంది.
పంజాబ్ & సింధ్ బ్యాంక్(PSB)లో 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20తో ముగియనుంది. రాష్ట్రాల వారీగా తెలంగాణలో 30 పోస్టులు ఉండగా.. డిగ్రీతో పాటు కనీసం 18 నెలల అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.48,480-85,920 జీతం ఉంటుంది. UR/EWS/OBCలకు దరఖాస్తు ఫీజు రూ.850. SC/ST/PwBDలకు రూ.100. సైట్: https://punjabandsind.bank.in/content/recruitment
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(NFC)లో 18 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఎల్లుండి(మార్చి 18)తో ముగియనుంది. నర్స్, ఫార్మసిస్ట్, సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు ఉండగా.. అర్హత గల 18-35 ఏళ్ల వయసువారు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను బట్టి దరఖాస్తు ఫీజు రూ.100-500 వరకు ఉంది. SC/ST/PwBD/మహిళలకు ఫీజు లేదు. సైట్: https://www.nfc.gov.in/recruitment.html
బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 104 డిప్యూటీ మేనేజర్/అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. UR/OBC/EWSలకు దరఖాస్తు ఫీజు రూ.850. SC/ST/PwBD/ESM/మహిళలకు ఫీజు రూ.175. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్(ALIMCO) 162 పోస్టులకు అప్లికేషన్లు కోరుతోంది. మార్కెటింగ్, IT, మెటీరియల్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. డిగ్రీ, బీటెక్, బీఈ, ఎంఈడీ, ఎంసీఏ, డిప్లొమా, స్పెషలైజ్డ్ డిగ్రీలో ఉత్తీర్ణత గల వారు వచ్చే నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
TG: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TG TET) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రోజే భారీ స్పందన లభించింది. నిన్న సాయంత్రం 7:30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,797 మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఈనెల 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
ప్రభుత్వ బీమా సంస్థ LIC పాలసీదారులు, మార్కెటింగ్ ఏజెంట్ల కోసం రెండు యాప్లను తీసుకొచ్చింది. వినియోగదారులకు MyLIC, ఏజెంట్లకు సూపర్ సేల్స్ సారథిని ప్రారంభించింది. యూజర్లు MyLICలోనే బీమా పోర్టుఫోలియోను చెక్ చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లించవచ్చు. E-KYC పూర్తి చేయొచ్చు. పాలసీ నుంచి రుణం తీసుకోవచ్చు. కొత్త పాలసీల సమాచారం తెలుసుకోవచ్చు.
నేషనల్ హైడ్రోఎలక్ట్రానిక్ పవర్ కార్పొరేషన్(NHPC) 182 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ITI, డిప్లొమా, గ్రాడ్యుయెట్ అప్రెంటిస్లు అందుబాటులో ఉండగా.. అర్హత గలవారు వచ్చే నెల 6న సా.5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా NATS/NAPSలో రిజస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC) 173 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ తదితర పోస్టులు ఉండగా.. సంబంధిత విభాగంలో MD/MS/DNB ఉత్తీర్ణులైనవారు ఈ నెల 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.500. SC/ST/PwB/మహిళలకు ఫీజు లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
NDL: ఆత్మకూరులోని కస్తూరిబా గాంధీ బాలికల కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం సాధించారు. సెకండ్ ఇయర్లో 97% ఫలితాలతో జిల్లా ద్వితీయ స్థానం సాధించారు. మౌనిక 973 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా, స్వీటీ గ్లోరీ సుజిత, కళ్యాణి తదుపరి స్థానాలు పొందారు. ఉత్తమ ఫలితాలపై ఇవాళ ప్రిన్సిపల్ శ్యామల ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు.
మరో రెండు రోజుల్లో అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి శాంతి చర్చలు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో సూచీలు ఈరోజు భారీగా లాభపడ్డాయి. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.10 లక్షల కోట్ల మేర పెరిగింది.