IPL వేళ క్రికెట్ ఫ్యాన్స్కు జియో బిగ్ షాకిచ్చింది. తన పాపులర్ రూ.195 క్రికెట్ డేటా ప్యాక్ వ్యాలిడిటీని భారీగా తగ్గించింది. గతంలో 90 రోజులుగా ఉన్న చెల్లుబాటును ఇప్పుడు కేవలం 30 రోజులకు కుదించింది. 15GB డేటా, జియోహాట్స్టార్ ప్రయోజనాలు మారనప్పటికీ, వ్యాలిడిటీ తగ్గడం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడనుంది. తక్కువ ధరలో ఎక్కువ రోజులు వాడాలనుకునే వారికి ఇది చేదు వార్త.
SRCL: గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ విశ్వాసాన్ని ప్రతిబింబించేలా “రన్ ఫర్ ఏ జీసస్” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని వేములవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వాసులు, యువత పెద్దఎత్తున పాల్గొని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ తీశారు. ప్రార్థనలు, కీర్తనలు చేస్తూ యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ ముందుకు సాగారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,930గా ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,38,350 వద్ద కొనసాగుతోంది. అటు కిలో వెండి ధరలో కూడా ఎలాంటి మార్పు లేకుండా రూ.2,55,000 వద్దే నిలకడగా ఉంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.
సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గ పునర్విభజనపై వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పందించారు. నియోజకవర్గం విడిపోతుందని కొందరు అనవసర ఆవేదన పొందుతున్నారన్నారు. అయితే ఎన్ని భాగాలుగా విడిపోయినా గెలుపును ప్రభావితం చేసే శక్తి కేతిరెడ్డికే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి కార్యకర్తలే అసలైన మూలస్తంభాలని స్పష్టం చేశారు.
తెలంగాణలోని ఇంజినీరింగ్, ఆగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG EAPCET-2026కు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇంటర్ పాసైనవారు అప్లై చేసుకోవచ్చు. మే 4-5 తేదీల్లో అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్ష జరగనుండగా.. అదే నెల 9-11 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్ష ఉంటుంది. అప్లికేషన్ ఫీజు, రుసుముతో దరఖాస్తు గడువు, తదితర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గల్ఫ్ యుద్ధ ప్రభావం భారత మార్కెట్లపై తీవ్రంగా పడుతోంది. వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని నెలల క్రితం రూ.150 ఉన్న లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్.. ఇప్పుడు బ్రాండ్ను బట్టి రూ.190 నుంచి రూ.202 వరకు పలుకుతోంది. వేరుశనగ నూనె లీటర్ రూ.220కి చేరగా, పామాయిల్ రూ.150, ఆవనూనె రూ.190కి పెరిగింది. దీనికి తోడు రూపాయి విలువ పతనం కావడం కూడా ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తోంది.
తెలంగాణలోని లా కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించే TG LAWCET(డిగ్రీ), TG PGLCET(మాస్టర్స్) దరఖాస్తు గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. దీంతో అర్హులైనవారు ఎలాంటి రుసుము లేకుండా ఈ నెల 10 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 18న పరీక్ష జరగనుంది. అర్హత, దరఖాస్తు ఫీజు తదితర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఖాతాదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబరును సులభంగా మార్చుకునేందుకు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ విధానాన్ని యాక్సిస్ బ్యాంక్ ప్రారంభించింది. దేశంలోనే ఈ సదుపాయం తెచ్చిన తొలి బ్యాంక్ ఇది. దీనివల్ల బ్యాంక్కు వెళ్లే పనిలేకుండా, మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా సురక్షితంగా నంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. కొత్త నంబర్ మార్చిన 24 గంటలు లావాదేవీలపై పరిమితులు ఉంటాయని బ్యాంక్ తెలిపింది.
NGKL: సోమశిల నుంచి సంగమేశ్వరం వెళ్లే పర్యాటకులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని జిల్లా పర్యాటక అధికారి కల్వరాల నరసింహ ఆదేశించారు. శుక్రవారం సర్పంచ్తో కలిసి బోట్లను పరిశీలించిన ఆయన, జాకెట్లు లేని వారిని అనుమతించవద్దని నిర్వాహకులకు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే బోట్ల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ASF: కాగజ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నుపై 5% రాయితీ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు పన్ను చెల్లించే వారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముందస్తుగా చెల్లించి రాయితీ పొందడంతో పాటు జరిమానాలను తప్పించుకోవాలని సూచించారు. బిల్ కలెక్టర్లు లేదా మున్సిపల్ కార్యాలయంలో పన్ను చెల్లించాలని కోరారు.
CBSE కొత్త పాఠ్య ప్రణాళికను విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి నుంచి విద్యార్థులకు త్రిభాషా విధానం ప్రవేశపెట్టనుంది. నూతన జాతీయ విద్యా విధానం మార్గదర్శకాల్లో భాగంగా త్రిభాషా విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో విద్యార్థులు చదివే మూడు భాషల్లో.. రెండు భారతదేశానికి చెందినవిగా ఉండాలి. విద్యార్థులకు బహుభాషలపై అవగాహన కల్పించేందుకు దీనికి శ్రీకారం చుట్టారు.
అనీల్ అంబానీ భార్య, ఒకప్పటి బాలీవుడ్ నటి టీనా అంబానీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె పెద్ద సోదరి ‘జన్హా’ కన్నుమూశారు. తన అక్కతో ఉన్న అనుబంధాన్ని టీనా అంబానీ గుర్తుచేసుకున్నారు. ‘నా పెద్దక్క జన్హా నాకు రెండో తల్లి లాంటిది. నా పెళ్లి సమయంలో ఆమె స్వయంగా కన్యాదానం చేసి, నన్ను మెట్టినింటికి సాగనంపింది. మా కుటుంబం మొత్తానికి ఆమె ముఖ్యమైన వ్యక్తి’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
టెక్ దిగ్గజం యాపిల్ 50వ వార్షికోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.1,49,900 విలువైన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ను రూ.1,02,900కే కొనుగోలు చేయొచ్చు. ఇన్స్టంట్ డిస్కౌంట్, HDFC కార్డులపై లభించే క్యాష్బ్యాక్, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్పై ఇచ్చే బోనస్ వంటివన్నీ కలిపి ఈ తగ్గింపును అందిస్తున్నట్లు ఇమేజిన్ స్టోర్ తెలిపింది. ఈ ఆఫర్లు పరిమిత కాలం పాటు మాత్రమే.
వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి మొబైల్ మెసేజింగ్ యాప్లను తప్పనిసరిగా సిమ్తో అనుసంధానం చేసేందుకు విధించిన గడువును కేంద్రం డిసెంబర్ 31 వరకు పొడిగించింది. కంపెనీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సిమ్ బైండింగ్ నిబంధన ప్రకారం మొబైల్లో సిమ్ యాక్టివ్గా ఉంటేనే మెసేజింగ్ ప్లాట్ఫామ్లు సర్వీసులు అందిస్తాయి.
AP: మార్చి 16 నుంచి మొదలైన పదో తరగతి పరీక్షలు నిన్నటితో ముగిశాయి. దీంతో ఈ నెల 6 నుంచి 15 వరకు పరీక్షా పేపర్ల వాల్యుయేషన్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 3415 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షలకకు 99% అటెండెన్స్ నమోదైంది. అలాగే 6,22,152 మంది రెగ్యులర్ విద్యార్థులు.. 19,568 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్ష రాశారు.