న్యూయార్క్, షికాగో, నెవార్క్ నుంచి ముంబై, ఢిల్లీకి వచ్చే విమాన టికెట్ల ధరలు పెరిగాయి. న్యూయార్క్ (జేఎఫ్కే విమానాశ్రయం) నుంచి ఢిల్లీకి వచ్చే విమానాల్లో ప్రస్తుతం రూ.1.34 లక్షల నుంచి రూ.2.25 లక్షల వరకు ఉన్నాయి. సాధారణ రోజుల్లో రూ.45 వేల నుంచి రూ.లక్ష మధ్య ఉంటాయి. షికాగో-ముంబై రూట్లో టికెట్ ధరలు ఏకంగా 150 శాతం పెరిగి రూ.1.9 లక్షల నుంచి రూ.2.8 లక్షల వరకు చేరాయి.
కోణార్క్ రైల్వే కార్పొరేషన్ లిమిటేడ్లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తం 190 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 21లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు konkanrailway.comను సంప్రదించండి.
ఫిన్టెక్ సంస్థ ఫోన్పే, రాబోయే తొలి పబ్లిక్ ఆఫర్ కోసం సంస్థ విలువను దాదాపు రూ.81,000-94,500 కోట్లుగా పరిగణించాలని ఆశిస్తోంది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.10,000 కోట్లకు పైగా సమీకరించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2023లో ఫోన్పే 12 బిలియన్ డాలర్ల విలువ వద్ద, 100 మిలియన్ డాలర్లు సమీకరించింది.
చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ రియల్మీ బడ్జెట్ సెగ్మెంట్లో మరో బిగ్ బ్యాటరీ ఫోన్ను లాంచ్ చేసింది. కొన్ని వారాల క్రితం రియల్మీ పీ4 పవర్ పేరిట 10,001mAh భారీ బ్యాటరీతో ఓ ఫోన్ తీసుకొచ్చింది. ఇప్పుడు అంతే బ్యాటరీ సామర్థ్యంతో నార్జో సిరీస్లో నార్జో పవర్ 5G పేరిట కొత్త ఫోన్ విడుదల చేసింది.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఉదయంతో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.650 తగ్గి రూ.1,62,880కు చేరగా.. ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.600 తగ్గి రూ.1,49,300గా పలుకుతోంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,95,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
JGL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాయికల్ ఎంపీడీఓ చిరంజీవి పేర్కొన్నారు. మార్చి 6–15 మధ్య నిర్వహించనున్న కార్యక్రమంపై మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు గురువారం అవగాహన కల్పించారు. తహశీల్దార్ నాగార్జున, ఎంపీఓ సుష్మ, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 899.71 పాయింట్లు లాభపడి 80015.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 285.40 పాయింట్ల లాభంతో 24765.90 దగ్గర ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.59గా ఉంది.
సోషల్ మీడియాలో వచ్చే సిబిల్ స్కోరు పెంచుతామనే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ స్కోరు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని వారు డబ్బు వసూలు చేస్తారు. నిజానికి సిబిల్ స్కోరు మీ ఆర్థిక క్రమశిక్షణపైనే ఆధారపడి ఉంటుంది. పాత బాకీలు, ఈఎంఐలను సకాలంలో చెల్లిస్తేనే స్కోరు పెరుగుతుంది తప్ప, ఎవరూ డబ్బుతో స్కోరును పెంచలేరని గ్రహించి అప్రమత్తంగా ఉండాలి.
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్లో లేఆఫ్లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 16 వేల మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా రోబోటిక్స్ విభాగంలోని సుమారు 100 మంది ఉద్యోగులపై వేటు పడింది. ఈ మేరకు ‘రాయిటర్స్’ తన కథనంలో పేర్కొంది.
AP: పదో తరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తమ అధికారిక సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు మనమిత్ర వాట్సాప్ నంబర్(9552300009) లేదా లీప్(LEAP) ద్వారా కూడా పొందవచ్చు. కాగా పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.980 తగ్గి రూ.1,63,530కు చేరగా.. ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.900 తగ్గి రూ.1,49,900గా పలుకుతోంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,95,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNLలో 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మరో 2 రోజుల్లో(మార్చి 7) ముగియనుంది. BE/BTech, CA/CMA ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గల 21-30 ఏళ్ల వారు అప్లై చేసుకోవచ్చు. జనరల్, OBC,EWSలకు పరీక్ష ఫీజు రూ.2,500. SC/ST/PwBDలకు రూ.1,250. రాత పరీక్ష(మార్చి 29) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
భారత ఎన్నికల సంఘం(ECI)లో 10 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే ఆఖరి రోజు. డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు MS Excelలో ప్రావిణ్యం గలవారు BECIL సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ టైపింగ్లో నిమిషానికి 35 పదాల వేగం తప్పనిసరి కాగా స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సైట్: becil.com
TG: రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు సంబంధించి అధికారులు ‘సెట్-ఏ’ (Set-A) ప్రశ్నాపత్రాన్ని ఖరారు చేశారు. ఇవాళ మ్యాథ్స్ పేపర్-1B, జూవాలజీ-1, హిస్టరీ-1 పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఈ అప్డేట్ను గమనించగలరు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్నాయి.
బొకారో పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్(BPSCL)లో 15 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. BE/BTechలో ఉత్తీర్ణత గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 ఏళ్లు కాగా రిజర్వేషన్ బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.50,000-1,60,000 వరకు జీతం చెల్లిస్తారు. సైట్: bpscl.com