TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఫిజికల్ సైన్స్ పరీక్ష జరగగా.. దీనికి 5,22,556 మంది హాజరయ్యారు. 2,008 మంది గైర్హాజరు అయ్యారు. మొత్తం 99.62 శాతం మంది విద్యార్థులు పరీక్ష రాశారు. కాగా ఎగ్జామ్స్ ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ ఫార్మా రంగానికి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే కొన్ని రకాల ఔషధాలపై ఏకంగా 100 శాతం టారిఫ్లు విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో భారత ఫార్మా రంగ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, బయోకాన్ వంటి ప్రధాన కంపెనీల షేర్లు పడిపోయాయి.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) 109 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. 1 డైరెక్టర్-లీగల్, 108 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు ఉండగా.. లా డిగ్రీ, CA, BE/BTech, CS, PhD ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగానుభవం గలవారు ఈ నెల 15 వరకు అప్లై చేసుకోవచ్చు. డైరెక్టర్కు నెలకు రూ.2,05,400-2,24,400.. ఎగ్జిక్యూటివ్కు రూ.56,100-1,77,500 మధ్య వేతనం ఉంటుంది.
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో విదేశీ మదుపరులు(FII) పెద్దఎత్తున షేర్లను విక్రయించడంతో మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనమైంది. దాదాపు 2 శాతం మేర నష్టాలు నమోదు కావడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది.
AP: రాష్ట్రంలోని కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయా(KGBV)ల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 11 తరగతుల్లో ప్రవేశాలు.. 7,8,9,10,12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గడువు నిన్నటితో ముగిసింది. అయితే విద్యార్థులు, పేరెంట్స్ అభ్యర్థన మేరకు గడువు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు.
చలామణీలో ఉన్న రూ.2 వేల నోట్లు 98.45 శాతం తిరిగి బ్యాంకులకు చేరాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇంకా రూ. 5,501 కోట్ల విలువ పెద్ద నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. రూ.2,000 నోట్ల ఉపసంహరణ చేసిన నాటికి వ్యవస్థలో మొత్తం రూ.3.56లక్షల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. ఇప్పటికీ ఎవరి వద్దనైనా పెద్ద నోట్లు ఉంటే ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.
విమాన ప్రయాణికులపై గురువారం నుంచి ఇండిగో సంస్థ ఇంధన ఛార్జీలు వడ్డించనుంది. దేశీయ సర్వీసులపై రూ.275 నుంచి రూ.950 వరకు ఇంధన ఛార్జీలు ఉండనున్నాయి. అంతర్జాతీయ సర్వీసులపై రూ.900 నుంచి రూ.10 వేల వరకు ఉండనున్నాయి. ఇటీవల విమాన ఇంధనం ధరలు రెట్టింపు కావడంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
డిజిటల్ లావాదేవీలు మరింత భద్రం కానున్నాయి. RBI మార్గదర్శకాలు అనుసరించి ఇవాళ్టి నుంచి అన్ని డిజిటల్ లావాదేవీలకు టు-ఫ్యాక్టర్ అథంటికేషన్ అందుబాటులోకి వచ్చింది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, వాలెట్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతో ఇకపై లావాదేవీ పూర్తి చేయాలంటే రెండు వెరిఫికేషన్ అంచెలను పూర్తి చేయాలి. దీంతో ఎవరైనా మీ పిన్ తెలుసుకున్నా మీకు తెలీకుండా లావాదేవీ పూర్తి చేయడం సాధ్యం కాదు.
ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్కు చెందిన ‘క్లాడ్ కోడ్’ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోడ్ ఆన్లైన్లో లీక్ అయ్యింది. అందులో క్లాడ్ కోడ్ ఎలా పనిచేస్తుంది? దాని ఆర్కిటెక్చర్ ఏంటి అనే వివరాలు ఉన్నాయి. లీక్ను ఆంథ్రోపిక్ కూడా ధ్రువీకరించింది. మానవ తప్పిదం వల్ల జరిగిందని వివరణ ఇచ్చింది. భవిష్యత్లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
బ్లింకిట్తో అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ చేతులు కలిపింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇన్ టెర్మినల్ క్విక్ కామర్స్ సర్వీస్ను తీసుకొచ్చింది. ఈ సేవలు ఇప్పుడు టెర్మినల్ 2, డొమెస్టిక్ డిపార్చర్స్లో అందుబాటులోకి వచ్చాయి. బ్లింకిట్ యాప్ ద్వారా విమానాశ్రయంలోని ప్రయాణికులు అవసరమైన వస్తువుల్ని ఆర్డర్ చేసుకోవచ్చు.
అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ ఒకేసారి 30 వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఇందులో 12 వేల మంది భారత్లో పనిచేస్తున్నవారే కావడం గమనార్హం. ఇంకా మేనేజింగ్ హోదాలో ఉన్నవారినే ఎక్కువగా తొలగించినట్లు తెలుస్తోంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వారి రోల్స్ ఇక అవసరం లేదని సదరు ఉద్యోగులకు మెయిల్లో తెలిపినట్లు సమాచారం. మరోసారి లేఆఫ్స్ ఉంటాయనే వార్తలూ వినిపిస్తున్నాయి.
నార్త్ ఇండియా టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ 100 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు ఈ నెల 8 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.55,932 వేతనం ఉంటుంది. UR, OBC అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.885. SC/ST/PwBDలకు రూ.531
గ్యాస్ వినియోగదారులకు షాక్. కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. సిలిండర్పై రూ.195 పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 7న రూ.115 పెంచగా.. మూడు వారాల్లో రెండోసారి ధరలను పెంచాయి. దీంతో హైదరాబాద్లో రూ.215 వరకు పెరగనుండటంతో సిలిండర్ ధర రూ.2321కి చేరనుంది. డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇవాళ్టి నుంచి ఒంటిపూట తరగతులు ప్రారంభం కానున్నాయి. ఉ.8 నుంచి మ.12:30 వరకు బోధన ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇంటికి పంపుతారు. APR 23 వరకు తరగతులు కొనసాగుతాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. JUNE 1 నుంచి కాలేజీలు పునఃప్రారంభమవుతాయి.
తెలంగాణలోని లా కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించే TG LAWCET(డిగ్రీ), TG PGLCET(మాస్టర్స్)కు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అర్హులైనవారు ఎలాంటి రుసుము లేకుండా ఇవాళ అప్లై చేసుకోవచ్చు. మే 18న పరీక్ష జరగనుంది. లాసెట్ దరఖాస్తు ఫీజు రూ.900. SC/ST/PwBDలకు రూ.600. అలాగే PGLCET ఫీజు రూ.1100. SC/ST/PwBDలకు రూ.900. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.