AP: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ పాలిసెట్-2026 ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉ.11:00 గంటల నుంచి మ.1:00 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్లను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
నాలుగో త్రైమాసికంలో రూ.16,971 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.19,407 కోట్లతో పోలిస్తే లాభంలో 12.5 శాతం క్షీణత నమోదు కావటం గమనార్హం. 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.80,775 కోట్ల నికర లాభం వచ్చినట్లు తెలిపింది. దీంతో ఒక్కో షేరుకు రూ.6 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు అంగీకరించింది.
పేటీఎంకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇవాళ్టితో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ముగించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆ బ్యాంక్ బ్యాంకింగ్ వ్యాపారంపై నిషేధం విధించినట్లు వెల్లడించింది.
మారుతి సుజుకి సరికొత్త రికార్డు సృష్టించింది. సగటున ప్రతి 14 నిమిషాలకు ఒక కారును తయారు చేస్తూ, ఏడాదికి ఏకంగా 23.4 లక్షల కార్లను తయారు చేసింది. భారత ఆటోమొబైల్ చరిత్రలో ఇదే అత్యధికం. స్విఫ్ట్, డిజైర్ వంటి మోడల్స్ భారీగా అమ్ముడయ్యాయి. భవిష్యత్తులో ఈ సంఖ్యను 40 లక్షలకు పెంచి, మన దేశాన్ని ప్రపంచ కార్ల తయారీ కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది.
ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ భారత స్టాక్ మార్కెట్ రేటింగ్ను ‘ఓవర్ వెయిట్’ నుంచి ‘న్యూట్రల్’కు తగ్గించింది. మార్కెట్లో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. బేరిష్ ట్రెండ్ కొనసాగితే నిఫ్టీ-50 20,500 పాయింట్లకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుత స్థాయిల నుంచి సుమారు 15 శాతం క్షీణించొచ్చని పేర్కొంది.
రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) టెక్నికల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ repcohome.comను సందర్శించండి.
AP: రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఉ.10 నుంచి మ.12 గంటల మధ్య ఫలితాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్తో పాటు మీ HIT TV యాప్లో చూసుకోవచ్చు. కాగా, టెన్త్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగాయి.
TG: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెండు రోజుల పాటు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆర్టీసీ బస్సుల బంద్ దృష్ట్యా ఇవాళ, రేపు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.
దేశంలో ఐదేళ్లలో అత్యంత సంపన్న వ్యక్తుల (UHNWI) సంఖ్య 25,217కు, బిలియనీర్ల సంఖ్య 313కు పెరగొచ్చని స్థిరాస్తి కన్సల్టెంట్ నైట్ఫ్రాంక్ అంచనా వేసింది. 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.270 కోట్లు), అంతకంటే ఎక్కువ నికర ఆస్తి కలిగిన వారిని UHNWIలుగా, రూ.9300 కోట్ల కంటే అధిక సంపద కలిగిన వారిని బిలియనీర్గా పరిగణిస్తారు. దేశంలో 19,877 మంది UHNWIలు, 207 మంది బిలియనీర్లు ఉన్నారు.
IT దిగ్గజం ఇన్ఫోసిస్ ఫ్రెషర్లకు శుభవార్త చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలో ఉన్నట్లు ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(CFO) జయేష్ సంఘ్రాజ్కా తెలిపారు. మరోవైపు 2025-26 చివరి త్రైమాసికం(Q4)లో రూ.8,501 కోట్లతో 20.8% వృద్ధి సాధించినట్లు నిన్న ఇన్ఫోసిస్ ప్రకటించింది. దీంతో 2025-26లో కంపెనీ నికర లాభం రూ.29,440 కోట్లుగా నమోదైంది.
బీకాడీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ శివ్ రతన్ అగర్వాల్ ఇవాళ కన్నుమూశారు. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజీలకు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. అయితే మరణానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. రతన్ చదివింది 8వ తరగతి అయినా.. తన అద్భుత వ్యాపార వ్యూహాలతో బీకాడీ ఫుడ్స్ను రూ.13 వేల కోట్ల విలువైన కంపెనీగా మలిచారు.
MNCL: భూభారతి రెవెన్యూ సదస్సులలో ప్రజలు అందించిన దరఖాస్తుల పరిష్కారం ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
నైట్ ఫ్రాంక్ సర్వే ప్రకారం 2031 నాటికి భారత బిలియనీర్ల సంఖ్య 51 శాతం పెరగనుంది. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య 313కి చేరుతుందని అంచనా. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండటంతో ప్రతిరోజూ సగటున 89 మంది అల్ట్రా రిచ్ జాబితాలో చేరుతున్నారు. ఇది మన దేశంలో పెరుగుతున్న సంపద సృష్టికి, ఆర్థిక బలానికి నిదర్శనంగా నిలుస్తోంది.
భారత్లోని తమ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్ను తీసుకువచ్చింది. పేయూ భాగస్వామ్యంతో మొబైల్ రీఛార్జ్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నేరుగా ఈ మెసేజింగ్ యాప్లోనే ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్లను చేసుకునే వెసులుబాటును కల్పించింది. దశలవారీగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది.