AP: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జరిగిన ఏపీ ఎస్సెట్ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’ షెడ్యూల్ ప్రకారం ఈరోజు విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈనెల 25న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. ప్రిలిమినరీ కీతో పాటు విద్యార్థుల రెస్పాన్స్ షీట్స్ను అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. SSC సీజీఎల్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 12,256 గెజిటెడ్ & నాన్ గెజిటెడ్ గ్రూప్-బీ, సీ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్, డిగ్రీ అర్హత గల అభ్యర్థులు జూన్ 22 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
ఎక్స్ఛేంజీ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. రూపాయి విలువ అనేక అంతర్జాతీయ అంశాలు, మార్కెట్లపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడూ ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అయితేయ.. రెండు, మూడు రోజులుగా చూస్తే రూపాయి బలపడుతుండటాన్ని గమనించవచ్చని అన్నారు.
రేపు దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను UPSC నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ ఈ-అడ్మిట్ కార్డులో పేర్కొన్న సూచనలను పాటించాలని అధికారులు సూచించారు. అడ్మిట్ కార్డ్లోని పేరు, ఫొటో వంటి వివరాలను సరిచూసుకోవడం మంచిది. గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ప్రతి సెషన్ ప్రారంభానికి 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు.
TG: వ్యాయామ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ పీఈసెట్-2026 హాల్టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్లను పొందుపరిచింది. మే 31 నుంచి జూన్ 3 వరకు ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ స్కిల్ టెస్టులను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా రెండేళ్ల వ్యవధిగల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ NCHM జేఈఈ-2026 పరీక్ష ఫలితాలను NTA ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్ & పాస్వర్డ్ ద్వారా అధికారిక వెబ్సైట్లో స్కోర్ కార్డ్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 25న దేశ వ్యాప్తంగా 103 నగరాల్లో CBT విధానంలో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
AP: రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే AP EAPCET ప్రాథమిక కీ ఈరోజు విడుదల కానుంది. కీతో పాటు రెస్పాన్స్షీట్స్, మాస్టర్ ప్రశ్నపత్రం అందుబాటులో ఉంచనున్నారు. దీనిపై అభ్యంతరాలను 25 వరకు స్వీకరిస్తారు. ఫలితాలు జూన్ 1న విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,55,803 మంది దరఖాస్తు చేయగా 3,29,474 మంది పరీక్షలకు హాజరయ్యారు.
నీట్ యూజీ-2026 పరీక్ష ఫీజు రీఫండ్ కోసం NTA దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://neet.nta.nic.in/ ను సందర్శించి రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించేందుకు మే 27ను చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో రీఫండ్ లింక్పై క్లిక్ చేసి బ్యాంక్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకుడు జాక్ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధతో మానవాళికి పొంచి ఉన్న ముప్పు పూర్తిగా కొట్టిపారేయలేమని అన్నారు. ఏఐ పురోగతిని ఇంకా చాలా మంది అర్థం చేసుకోలేక పోతున్నారని తెలిపారు. ఏఐకి సిద్ధం కాకపోవడం అంటే..ఓ పెద్ద మహమ్మారిని విస్మరించినట్లేనని చెప్పారు. మనుషులను మించిన సామర్థ్యం ఉండే ఈ సాంకేతికత నుంచి ముప్పు ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు.
✦ చెల్లించాల్సిన బిల్లులో కనీస మొత్తం చెల్లింపు. దీని వల్ల మిగిలిన మొత్తంపై 42 శాతం వార్షిక వడ్డీ పడుతుంది✦ నిర్దిష్ట ప్రయోజనానికి సంబంధించిన కార్డు మరో ప్రయోజనానికి వినియోగించడం✦ జమ అయిన పాయింట్లను వాడుకోకపోవడం. దీంతో అవి మురిగిపోతాయి✦ కార్డుతో వచ్చే వెల్కమ్ ప్రయోజనాలను విస్మరించడం✦ కార్డుపై నగదు తీసుకోవడం
కామారెడ్డి జిల్లాకు కేటాయించిన 12,090 ఇందిరమ్మ ఇండ్లలో 11,592 మంజూరు కాగా 9,121 ఇండ్లు పురోగతిలో ఉన్నాయని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో జిల్లా 10వ స్థానంలో నిలిచిందని, ఇప్పటివరకు లబ్ధిదారులకు రూ.210.57 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న 1,532 ఇండ్ల నిర్మాణాలను అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
AP: ఈఏపీసెట్ రాసిన అభ్యర్థులకు కీలక అప్డేట్. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షల ప్రాథమిక కీ ఇవాళ విడుదల కానుంది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ cets.apsche.ap.gov.inలో కీని చూసుకోవచ్చు. సమాధానాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే రూ.300 ఫీజు చెల్లించి మే 25 వరకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. కాగా, మే 12 నుంచి 20 వరకు ఈ ఎగ్జామ్స్ జరిగాయి.
TG: రాష్ట్రంలో పాలీసెట్-2026 ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు శనివారం ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్సైట్లో ఫలితాలను, ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వానికి RBI గుడ్న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.2.87 లక్షల కోట్లు డివిడెండ్ రూపంలో చెల్లించనున్నట్లు ప్రకటించింది. RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో RBI సెంట్రల్ బోర్డు డైరెక్టర్లు నిర్వహించిన సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు RBI తెలిపింది.
సెన్సెక్స్ 30 సూచీలో ట్రెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఐటీసీ, సన్ఫార్మా, బీఈఎల్, భారతీ ఎయిర్టెల్, పవర్గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 105.07 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్సు 4532 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.