క్రియేటర్ల కోసం యూట్యూబ్.. మానిటైజేషన్ నిబంధనలను సవరించింది. 500 సబ్స్క్రైబర్లు, 3వేల గంటల వాచ్ టైమ్ ఉంటే సూపర్ థాంక్స్ వంటి ఫీచర్ల ద్వారా ఆదాయం పొందవచ్చు. అయితే, ప్రకటనల ద్వారా సంపాదించాలంటే పాత నిబంధనలే వర్తిస్తాయి. ముఖ్యంగా ఏఐ (AI) కంటెంట్ వాడితే తప్పనిసరిగా వెల్లడించాలి. కాపీ చేసిన లేదా కేవలం ఏఐతో సృష్టించిన వీడియోలకు ఇకపై మానిటైజేషన్ ఇవ్వదు.
క్రెడిట్ కార్డ్ అసురక్షిత రుణం కావడంతో, కార్డుదారుడు మరణిస్తే ఆ బకాయిలను చెల్లించాలని కుటుంబ సభ్యులను బ్యాంకులు ఒత్తిడి చేయకూడదు. అయితే, మరణించిన వ్యక్తి పేరిట ఉన్న ఆస్తులు లేదా డిపాజిట్ల నుంచి బ్యాంకులు బకాయిలు వసూలు చేసుకుంటాయి. వారసులపై వ్యక్తిగత ఆర్థిక భారం పడదు. RBI నిబంధనల ప్రకారం ఈ అప్పులు పూర్తిగా వారి ఎస్టేట్ బాధ్యతే.
దేశంలో మొబైల్ డేటా వినియోగం వేగంగా పెరుగుతోందని ప్రముఖ టెలికాం గేర్ తయారీ సంస్థ నోకియా వెల్లడించింది. 2025లో నెలవారీ సగటు వినియోగం 31జీబీగా ఉందని చెప్పింది. 2024లో మొబైల్ డేటా వినియోగం 27.5 జీబీ అని పేర్కొంది. దేశంలో 5జీ డేటా వినియోగం గతేడాదితో పోలిస్తే 70 శాతం పెరిగినట్లు వివరించింది. దేశంలో మొత్తం మొబైల్ బ్రాండ్ ట్రాఫిక్లో 5జీ వాటా 47 శాతంగా ఉందని నోకియా తెలిపింది.
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సీఈవోగా బ్రిటిష్ ఎయిర్వేస్ మాజీ చీఫ్ విలియం వాల్ష్ నియమితులయ్యారు. గత సీఈవో పీటర్ తన పదవికి రాజీనామా చేయడంతో విలియంను సంస్థ భర్తీ చేసింది. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విలియం మాట్లాడుతూ.. ఇండిగో వంటి బలమైన సంస్థకు నాయకత్వం వహించడం సంతోషంగా ఉందన్నారు. విమానయాన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థను ముందుకుతీసుకెళ్తానని చెప్పారు.
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(BARC-ముంబై)లో 105 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే చివరి రోజు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సెన్సెల్ విభాగాల్లో షెలోషిప్ అందించనుండగా.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైనవారికి తొలి రెండేళ్లు నెలకు రూ.37,000.. మూడో ఏడాది నుంచి రూ.42,000 స్టైఫండ్ లభిస్తుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
SRCL: చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామాల్లో ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి మొక్కజొన్న, నువ్వులు, మామిడి కాయలు నేల రాలిపోయాయి. చేతికి వచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.
కోనసీమ: 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశం కోసం కొత్తపేట మండలంలో మొదటి దఫా 44 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు కొత్తపేట MEO ఎం. హరిప్రసాద్ తెలిపారు. మొదటి దఫా ఎంపికైన విద్యార్థుల వివరాలను, ఆయా ప్రైవేటు పాఠశాలలకు పంపడం జరిగిందన్నారు. మండల విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేశామన్నారు.
TG: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నుంచి నేరుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి అడ్డుకట్ట పడనుంది.
TG: వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్ కాలేజీలను 224 పనిదినాలతోపాటు నడపాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. 2026-27 వార్షిక అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో 226 పనిదినాలుండగా, వచ్చే విద్యాసంవత్సరానికి 224 పనిదినాలు ఖరారు చేసింది. కాలేజీలు జూన్ 1న ప్రారంభమవుతాయని, ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు తరగతులు జరుగుతాయని వెల్లడించింది.
కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ బాలవాటిక, 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు అడ్మిషన్లకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2వ తేదీ రాత్రి 11:59 గంటలకు గడువు ముగుస్తుంది. ఇప్పటి వరకు అప్లై చేయని వారు చేసుకోవాలి. బాలవాటికల్లో ప్రీ-ప్రైమరీ, 6 ఏళ్లు నిండిన పిల్లలకు 1వ తరగతుల్లో అడ్మిషన్లు కేటాయిస్తారు.
ఏప్రిల్ నెలకు సంబంధించి ఆర్బీఐ బ్యాంకుల సెలవుల జాబితా విడుదల చేసింది. ఏప్రిల్ 1 వార్షిక ఖాతా ముగింపు, 2న మాండీ థర్స్ డే, 3న గుడ్ఫ్రైడే, 5, 12, 19, 26 ఆదివారాలు, 11, 25 రెండు, నాలుగో శనివారం, 13న బైసాఖి, 14న అంబేద్కర్ జయంతి అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉండనుంది. 15న తమిళ నూతన సంవత్సరం, 20న బసవ జయంతి సందర్బంగా కర్ణాటకలో మాత్రమే సెలవు ఉంటుంది.
HAL-ఇండస్ట్రియల్ హెల్త్ సెంటర్లో 5 విజిటింగ్ డాక్టర్స్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ వివరాలతో అప్లికేషన్ ఫామ్ను హైదరాబాద్లోని బాలానగర్ చిరునామాకు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. చిరునామా, వేతనం తదితర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TG: ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే TG EAPCET-2026 పరీక్షకు దరఖాస్తుల గడువు APR 4వ తేదీ వరకు ఉంది. పరీక్షలు MAYలో జరగనున్నాయి. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోలేని వారు APR 10 లోపు రూ.250తో, APR 15 లోపు రూ.500, 20వ తేదీ లోపు రూ.2,500, APR 24లోపు రూ.5 వేలు, MAY 2 వరకు రూ.5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ సంస్థ BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్లో 103 బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం 6 నెలల పని అనుభవం గలవారు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఆసక్తి గల వారు అప్లికేషన్ ఫామ్లో తమ వివరాలను నింపి careers@bobcaps.inకు మెయిల్ చేయాల్సి ఉంటుంది.
AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఉ.8 నుంచి మ.12:30 వరకు బోధన ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇంటికి పంపుతారు. APR 23 వరకు తరగతులు కొనసాగుతాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. JUNE 1 నుంచి కాలేజీలు పునఃప్రారంభమవుతాయి. కాగా, FEB 23 నుంచి MAR 24 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్, ఎగ్జామ్స్ జరిగిన విషయం తెలిసిందే.