E.G: ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. నగరపాలక సంస్థ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పబ్లిక్ హెల్త్ అధికారులు, సిబ్బందితో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఉదయం 7 గంటలకల్లా రోడ్లను ఊడ్చి.. చెత్త కుప్పలను ఎత్తివేయాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు.