సిరిసిల్ల పట్టణం శాంతినగర్ 2వ వార్డులో మహిళా సమైక్య సంఘాల సభ్యులకు వార్డు కౌన్సిలర్ వేముల రాములు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. మహిళల సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో సమైక్య సంఘాల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్పీలు గడ్డం జయ, మెరుగు చంద్రకళ, కొక్కుల అర్చనతో పాటు సమైక్య మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
TG: ఇంటర్ బోర్డు ఫస్టియర్ సబ్జెక్టుల్లో రిపీటయిన పాఠాలను తొలగించింది. వీడియో, ఆడియో రూపంలో లెసన్స్ వినేలా పుస్తకాల్లో QR కోడ్లను పొందుపరిచింది. తెలుగులో రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించే పాఠ్యాంశాలు, Mathsలో ‘Do you know’ బాక్సులు, Physicsలో AI ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంశాన్ని ప్రవేశపెట్టింది. సైన్స్ సబ్జెక్టులను NCERT సిలబస్కు అనుగుణంగా మార్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 88.05 పాయింట్లు నష్టపోయి 75921.65 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 25.85 పాయింట్ల నష్టంతో 23887.85 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.68గా ఉంది.
AP EAPCET ఫలితాలను జూన్ 10 తర్వాత రిలీజ్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈసారి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకూ బెటర్మెంట్కు అవకాశం ఇవ్వగా, ఆ పరీక్షలు జూన్ 5న ముగియనున్నాయి. EAPCETలో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉండటంతో పరీక్షలు పూర్తయ్యే వరకు ఆగాల్సి ఉంది. వచ్చే అకడమిక్ ఇయర్కు EAPCETలో ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించాలని విద్యాశాఖ యోచిస్తున్నట్లు సమాచారం.
వర్క్ ఫ్రమ్ హోమ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఆ దిశగా అడుగులు వేసింది. ఆన్ ఫీల్డ్లో పనిచేయాల్సిన అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. వ్యాపార అవసరాలకు మాత్రమే విదేశీ పర్యటనలను పరిమితం చేయాలని.. ఆన్లైన్ సమావేశాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించింది.
మెటా తన యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్రయోగాలు చేస్తోంది. తాజాగా రెడ్డిట్ తరహాలో ఫోరమ్ అనే స్టాండలోన్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫేస్బుక్ గ్రూపులు, కమ్యూనిటీ యూజర్లే లక్ష్యంగా దీన్ని ప్రత్యేకంగా రూపొందించింది. నచ్చిన అంశాలపై చర్చించేందుకు ఈ యాప్ వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఫోరమ్ యాప్లోనూ లాగిన్ అవ్వొచ్చు.
పెట్రోల్ ధరలు ఈనెల 15 నుంచి ఇప్పటివరకు లీటరుకు రూ.7.50 వరకు పెరిగాయి. దీంతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీల నష్టాలు రోజుకు రూ.1,000 కోట్ల నుంచి రూ.600 కోట్లకు దిగొచ్చాయని పెట్రోలియం, సహజ వాయువు సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. దేశీయంగా వంటగ్యాస్ విక్రయాల్లో కలుగుతున్న నష్టాలు కూడా ఇందులో కలిసే ఉన్నాయని చెప్పారు.
పలు పాలనాపరమైన అంశాలపై చర్చించేందుకు టాటా ట్రస్ట్స్ జూన్ 8న సమావేశం కానుంది. టాటా సన్స్ బోర్డులో నామినీ డైరెక్టరుగా వేణు శ్రీనివాసన్ భవితవ్యంపై కూడా ఇందులో చర్చకు రావొచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 16న ఈ సమావేశం జరగాల్సి ఉండగా అది వాయిదా పడింది.
టాటా సన్స్ బోర్డు సమావేశం కొనసాగుతోంది. గ్రూపులో నష్టాలు చవిచూస్తున్న కంపెనీల పనితీరు అంశంపై చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ కంపెనీలు విడివిడిగా తమ వ్యాపార స్థితి, భవిష్యత్ ప్రణాళికలపై ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. నష్టాల్లోని కంపెనీలపై చర్చించేందుకు గత వారం చివర్లో టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా భేటీ అయినట్లు సమాచారం.
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ LIC రెండు కొత్త పాలసీలను తీసుకొచ్చింది. భార్యాభర్తలిద్దరికీ బీమా అందించేలా న్యూ జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం పేరిట రెండు ఉమ్మడి జీవిత బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. జూన్ 1 నుంచి ఈ పాలసీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పాలసీ ద్వారా దంపతులిద్దరికీ ఒకే పాలసీ కింద ఆర్థిక భద్రతతో పాటు, పొదుపు ప్రయోజనాలు లభిస్తాయి.
BSNL వార్షికాదాయం రూ.25,000 కోట్లకు చేరినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని వెల్లడించారు. సంస్థ ఆదాయం 2024-25లో రూ.23,427 కోట్లు కాగా, 2025-26లో రూ.25,000 కోట్లు మించిందని చెప్పారు. ఇదే సమయంలో ఎబిటా రూ.50 కోట్ల నుంచి రూ.7,000 కోట్లకు సమీపించినట్లు తెలిపారు. నెట్వర్క్ను బలోపేతం చేయడం, ఇతర సంస్థల కంటే తక్కువ టారిఫ్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన సినిస్టెర్రా, డేవ్ వాంగ్ అనే ఇద్దరు ‘వాల్స్ట్రీట్ ప్రాంప్ట్’ సంస్థ ద్వారా అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. ఏఐ ప్లానింగ్లో US బ్యాంకర్లు ఎక్కడ వెనకబడ్డారో చెప్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఒక్క క్లాస్ తీసుకుంటే రూ.23 లక్షలు వసూలు చేస్తున్నారు. ChatGPT, ఆంథ్రోపిక్ క్లాడ్తో ఆర్థిక కార్యకలాపాలను సులభంగా పూర్తిచేయడంలో శిక్షణ ఇస్తున్నారు.
అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు సృష్టించింది. గుజరాత్లోని ఖవ్డాలో 3.37 గిగావాట్ అవర్ బ్యాటరీ సామర్థ్యంతో ఎనర్జీ స్టోరేజ్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. దీంతో దాదాపు 10 లక్షల ఇళ్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ తెలిపారు. ఈ ప్రాజెక్టును కేవలం 10 నెలల్లోనే అదానీ గ్రీన్ ఎనర్జీ పూర్తి చేయడం విశేషం.
ఏఐ యుగంలో కంపెనీలకు ఐబీఎం ఇండియా అధిపతి సందీప్ పటేల్ కీలక సూచన చేశారు. లక్షల మంది ఉద్యోగులను కాపాడుకోవడం భారత్కు అసలైన సవాలు అని వెల్లడించారు. భారీ స్థాయిలో ఉద్యోగుల నైపుణ్యాలకు పదును పెడితేనే భారత్ ప్రపంచంలో ఏఐ లీడర్గా ఎదుగుతుందని చెప్పారు. ఈ మేరకు ఉద్యోగుల నైపుణ్యాలకు ఐటీ కంపెనీలు తిరిగి పదును పెట్టాలని సూచించారు.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)లో 899 ఉద్యోగాలకు జూలై 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టోర్ కీపర్ టెక్నికల్, ఆపరేటర్ కమ్యూనికేషన్, ఎలక్ట్రీషియన్, ఆపరేటర్ ఎక్స్కవేటింగ్ మెషినరీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, ITI ఉత్తీర్ణత, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్, వయసు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://bro.gov.in/