• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

భారీగా పెరగనున్న మెడిసిన్ ధరలు

పశ్చిమాసియా యుద్ధం వల్ల ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో వాటి ధరలు 200-300% పెరిగాయి. దీంతో మెడిసిన్ రేట్లు గరిష్ఠంగా 180% పెరుగుతాయని తెలుస్తోంది. ప్రజలకు త్వరలోనే ఈ బ్యాడ్‌న్యూస్ చెప్పేందుకు ఫార్మా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. పారాసెటమాల్, పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, బీపీ టాబ్లెట్స్ ధరలకు రెక్కలు రానున్నాయి.

April 3, 2026 / 09:37 AM IST

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్‌ సర్కార్‌ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. లీటర్‌ పెట్రోల్‌ రూ.458.40, డీజిల్ రూ.520.35కి చేరింది. డీజిల్‌పై 54.9%, పెట్రోల్‌పై 42.7% పెంపు విధించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇవాళ్టి నుంచే ధరలు అమల్లోకి వచ్చాయి. నెల రోజుల వ్యవధిలో పాక్‌లో పెట్రోల్‌ ధరలు పెరగడం ఇది రెండోసారి.

April 3, 2026 / 09:15 AM IST

POLYCET 2026.. అప్లై చేశారా?

ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026కు దరఖాస్తు ప్రక్రియ రేపటి(ఏప్రిల్ 4)తో ముగియనుంది. టెన్త్ పాసై, పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్స్ చేయాలనుకునేవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు OC, BC అభ్యర్థులకు రూ.400. SC/STలకు రూ.200. పరీక్ష ఈ నెల 25న నిర్వహించనున్నారు.

April 3, 2026 / 06:43 AM IST

సంక్షేమం, రైతు సమస్యలపై సీపీఐ డిమాండ్

NDL: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు కోరారు. ఖరీఫ్‌లో రైతులు పండించిన మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇవాళ సూచించారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అయినా కొత్త పెన్షన్లు అమలు కాలేదని విమర్శించారు.

April 2, 2026 / 09:06 PM IST

లాభాల్లో టెక్ మహీంద్రా, HCL, TCS

దేశీయ స్టాక్ మార్కెట్‌లో సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 1526 పాయింట్ల నష్టం నుంచి సెన్సెక్స్ కోలుకోవడం గమనార్హం. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, HCL టెక్నాలజీస్‌, TCS, HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ఏషియన్ పెయింట్స్, NTPC, సన్ ఫార్మా, ఎటర్నల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్ నష్టాలు చవిచూశాయి.

April 2, 2026 / 05:15 PM IST

స్కూళ్లకు సెలవులు ఎన్ని రోజులంటే?

TG: రాష్ట్రంలో స్కూళ్లకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మొత్తం 48 రోజుల పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. వేసవి సెలవుల తర్వాత జూన్ 12వ తేదీన మళ్లీ స్కూళ్లు ప్రారంభమవుతాయి. ఈ మేరకు విద్యాశాఖ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

April 2, 2026 / 04:58 PM IST

ALERT: అడ్మిట్ కార్డులు విడుదల

జేఈఈ మెయిన్ 2026 సెషన్-2కు సంబంధించి మిగిలిన పరీక్ష తేదీల అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. ఏప్రిల్ 5, 6, 7, 8 తేదీల్లో పరీక్షలు రాయనున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసిన కార్డుపై క్యూఆర్ కోడ్ & బార్‌కోడ్ స్పష్టంగా ఉన్నాయో లేదో చూసుకోవాలని అధికారులు సూచించారు.

April 2, 2026 / 04:20 PM IST

టెన్త్ పరీక్షలు.. 2,008 మంది గైర్హాజరు

TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఫిజికల్ సైన్స్ పరీక్ష జరగగా.. దీనికి 5,22,556 మంది హాజరయ్యారు. 2,008 మంది గైర్హాజరు అయ్యారు. మొత్తం 99.62 శాతం మంది విద్యార్థులు పరీక్ష రాశారు. కాగా ఎగ్జామ్స్ ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి.

April 2, 2026 / 03:37 PM IST

భారత ఫార్మాకు ట్రంప్ షాక్..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ ఫార్మా రంగానికి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే కొన్ని రకాల ఔషధాలపై ఏకంగా 100 శాతం టారిఫ్‌లు విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో భారత ఫార్మా రంగ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, బయోకాన్ వంటి ప్రధాన కంపెనీల షేర్లు పడిపోయాయి.

April 2, 2026 / 03:12 PM IST

భారీ జీతంతో ICAI ఉద్యోగాలు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) 109 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. 1 డైరెక్టర్-లీగల్, 108 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు ఉండగా.. లా డిగ్రీ, CA, BE/BTech, CS, PhD ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగానుభవం గలవారు ఈ నెల 15 వరకు అప్లై చేసుకోవచ్చు. డైరెక్టర్‌కు నెలకు రూ.2,05,400-2,24,400.. ఎగ్జిక్యూటివ్‌కు రూ.56,100-1,77,500 మధ్య వేతనం ఉంటుంది.

April 2, 2026 / 09:42 AM IST

భారీ నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో విదేశీ మదుపరులు(FII) పెద్దఎత్తున షేర్లను విక్రయించడంతో మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనమైంది. దాదాపు 2 శాతం మేర నష్టాలు నమోదు కావడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది.

April 2, 2026 / 09:42 AM IST

KGBVల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు

AP: రాష్ట్రంలోని కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయా(KGBV)ల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 11 తరగతుల్లో ప్రవేశాలు.. 7,8,9,10,12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గడువు నిన్నటితో ముగిసింది. అయితే విద్యార్థులు, పేరెంట్స్ అభ్యర్థన మేరకు గడువు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు.

April 2, 2026 / 07:03 AM IST

RBI కీలక ప్రకటన.. 98.45 శాతం నోట్లు వెనక్కి

చలామణీలో ఉన్న రూ.2 వేల నోట్లు 98.45 శాతం తిరిగి బ్యాంకులకు చేరాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇంకా రూ. 5,501 కోట్ల విలువ పెద్ద నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. రూ.2,000 నోట్ల ఉపసంహరణ చేసిన నాటికి వ్యవస్థలో మొత్తం రూ.3.56లక్షల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. ఇప్పటికీ ఎవరి వద్దనైనా పెద్ద నోట్లు ఉంటే ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.

April 2, 2026 / 06:40 AM IST

ప్రయాణికులపై ఇండిగో ఇంధన ఛార్జీల భారం

విమాన ప్రయాణికులపై గురువారం నుంచి ఇండిగో సంస్థ ఇంధన ఛార్జీలు వడ్డించనుంది. దేశీయ సర్వీసులపై రూ.275 నుంచి రూ.950 వరకు ఇంధన ఛార్జీలు ఉండనున్నాయి. అంతర్జాతీయ సర్వీసులపై రూ.900 నుంచి రూ.10 వేల వరకు ఉండనున్నాయి. ఇటీవల విమాన ఇంధనం ధరలు రెట్టింపు కావడంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

April 1, 2026 / 09:12 PM IST

మరింత భద్రంగా డిజిటల్‌ లావాదేవీలు

డిజిటల్ లావాదేవీలు మరింత భద్రం కానున్నాయి. RBI మార్గదర్శకాలు అనుసరించి ఇవాళ్టి నుంచి అన్ని డిజిటల్ లావాదేవీలకు టు-ఫ్యాక్టర్ అథంటికేషన్ అందుబాటులోకి వచ్చింది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, వాలెట్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతో ఇకపై లావాదేవీ పూర్తి చేయాలంటే రెండు వెరిఫికేషన్ అంచెలను పూర్తి చేయాలి. దీంతో ఎవరైనా మీ పిన్ తెలుసుకున్నా మీకు తెలీకుండా లావాదేవీ పూర్తి చేయడం సాధ్యం కాదు.

April 1, 2026 / 08:12 PM IST