SRPT: ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెండెం వెంకటరమణ సూచించారు. శుక్రవారం అంబేద్కర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కింద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలు నిపుణులైన వైద్య సేవలు, ఉచిత పరీక్షలు మరియు మందులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.