వాట్సాప్ గ్రూపుల్లో కొత్తగా చేరే వారికి పాత సంభాషణలు తెలిసేలా ‘హిస్టరీ షేరింగ్’ ఫీచర్ను మెటా పరిచయం చేసింది. అడ్మిన్లు గత 25 నుండి 100 మెసేజ్లను కొత్త సభ్యులతో షేర్ చేయవచ్చు. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో ఇది పూర్తి సురక్షితం. హిస్టరీ షేర్ చేసినప్పుడు గ్రూప్ సభ్యులందరికీ సమాచారం అందుతుంది. అవసరమైతే అడ్మిన్లు ఈ ఫీచర్ను ఎప్పుడైనా నిలిపివేయవచ్చు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 316.57 పాయింట్లు లాభపడి 82814.71 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 116.90 పాయింట్ల లాభంతో 25571.25 దగ్గర ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91గా ఉంది.
రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో 674 ఉద్యోగాలున్నాయి. ఈ నెలాఖరులో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. టెన్త్, ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణత, 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. సీబీటీ 1, సీబీటీ 2, సీబీఏటీ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
AIతో కంపెనీల్లో పని సంస్కృతి మారుతోంది. తాజాగా యాక్సెంచర్ కూడా తమ సీనియర్ ఉద్యోగులు ఏఐ టూల్స్ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని సూచించింది. వాటి వినియోగం ఆధారంగానే లీడర్షిప్ రోల్స్ అందుకుంటారని, లేకపోతే ప్రమోషన్లు ఉండవని సంకేతాలు ఇచ్చింది. కాగా, ఇటీవల యాక్సెంచర్ 11వేల మందికి లేఆఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 320 తగ్గి రూ.1,56,170కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.300 పెరిగి రూ.1,43,150 పలుకుతోంది. అటు వెండి ధరలో నిన్నటితో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. కిలో వెండిధర రూ.2,70,000ల వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 258.21 పాయింట్లు నష్టపోయి 82239.93 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 68.80 పాయింట్ల నష్టంతో 25385.55 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.98గా ఉంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలికట్(NITC)లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. ఆర్ట్స్ ఆఫ్ సోషల్ సైన్సెస్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. PhD ఉత్తీర్ణత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 45-50 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
TG: ఎప్సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజే ఇంజినీరింగ్ విభాగానికి 1,950 మంది, అగ్రికల్చర్కు 1,430, రెండింటికి కలిపి ఐదుగురు.. మొత్తంగా 3,385 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామని ఎప్సెట్ కన్వీనర్ ఆచార్య విజయకుమార్ రెడ్డి వెల్లడించారు. విద్యార్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
TG: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) పరిధిలోని పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు నిర్వహిస్తామని టాస్ సంచాలకుడు పీవీ శ్రీహరి తెలిపారు. ఉదయం, సాయంత్రం పరీక్షలు ఉంటాయని అన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు నిర్వహిస్తామని చెప్పారు.
1. బాగ్లిహార్ ఆనకట్ట ఏ నదిపై ఉంది?ANS: చీనాబ్2. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?ANS: జనవరి 253. భారత ‘ఎయిర్ఫోర్స్ డే’ ఎప్పుడు నిర్వహిస్తారు?ANS: అక్టోబరు 84. ఈశాన్య భారత సరిహద్దుల్లో తొలి వాణిజ్య బొగ్గు గని ఏది?ANS: నమ్చిక్-నమ్ఫుక్
చాట్జీపీటీ, జియోహాట్స్టార్ జతకలిశాయి. ఇకపై చాట్ జీపీటీలో వినోదాత్మక కంటెంట్ గురించి సెర్చ్ చేసే వారికి జియో హాట్స్టార్ స్ట్రీమింగ్ లింక్లు కనిపించనున్నాయి. మరోవైపు జియోహాట్ స్టార్, ఓపెన్ ఏఐ కలిసి చాట్జీపీటీ పవర్డ్ వాయిస్ డిస్కవరీ ఫీచర్ను కూడా తీసుకువచ్చాయి. ఇది వ్యూయర్స్ అడిగిన దాన్ని బట్టి వినోదాత్మక కంటెంట్ను సజెస్ట్ చేయనుంది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సులభతర విధానాన్ని పరిచయం చేసింది. డెత్ క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం ఆన్లైన్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. బ్యాంకు ఖాతాదారులు మరణించిన సందర్భాల్లో కుటుంబసభ్యులు, వారి వారసులు బ్యాంకును సందర్శించకుండానే ఈ డెత్క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.