TG: HYDలో ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ సర్వీసెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న సివిల్స్ & గ్రూప్స్ జనరల్ స్టడీస్ మాక్ గ్రాండ్ టెస్ట్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. అభ్యర్థులు 9AMకల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 9:15 గంటలకు ప్రశ్నాపత్ర కోడ్ను విడుదల చేయనున్నారు.
TG: ఇంటర్ ఫలితాలు రేపు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ విడుదల చేయనుంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ సారి 9.97 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. అయితే అత్యంత వేగంగా, సులభంగా HIT TV యాప్లో మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోండి. SHARE IT
న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ మెడికల్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 55 ఉండగా.. దరఖాస్తు ఫీజు రూ. 500గా ఉంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 23లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
TG: ఇంటర్ ఫలితాలను విద్యార్థులు తమ మొబైల్లోనే పొందే వెసులుబాటును ప్రభుత్వం తెచ్చింది. వాట్సాప్ నంబర్ 8096958096కు హాయ్ అని మెసేజ్ పంపాలి. BIE Exam Result అని టైప్ చేసి, ‘Open Service’ ఆప్షన్ నొక్కాలి. అక్కడ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి, సంవత్సరం (1st/2nd Year), స్ట్రీమ్ (General/Vocational) ఎంచుకోవాలి. వివరాలు సమర్పించిన వెంటనే మీ ఫలితం ప్రత్యక్షమవుతుంది.
వచ్చే వారం CBSE పదో తరగతి(సెషన్-1) ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. దేశవ్యాప్తంగా పరీక్షలకు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, ఈ ఏడాది నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించాలని CBSE నిర్ణయించింది. మొదటి సెషన్ కంపల్సరీ కాగా పర్ఫార్మెన్స్ పెంచుకునేందుకు రెండో సెషన్ రాయొచ్చు. MAY 15 నుంచి JUNE 1 వరకు 2వ సెషన్ పరీక్షలు జరగనున్నాయి.
ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లోని కోల్ ఇండియా లిమిటెట్ అనుబంధ సంస్థ SECL 1,055 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మైనింగ్ సర్ధార్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్మన్ (ఎలక్ట్రికల్) పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్ 15వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు SECL వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది.
TG: రాష్ట్రంలో మరోసారి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహణకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఈనెల 13న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో TET నిర్వహించారు. రెండో నోటిఫికేషన్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జూన్ రెండో వారంలో పరీక్షలు జరిగే అవకాశం ఉంది.
AP: రాష్ట్రంలోని 352 KGBVల్లో చేరేందుకు దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు SPD శ్రీనివాసరావు తెలిపారు. నిన్నటితో గడువు ముగియగా పేరెంట్స్ వినతి మేరకు ఈనెల 20 వరకు పొడిగించామన్నారు. 6, 11 తరగతుల్లో ప్రవేశాలతో పాటు మిగతా తరగతుల్లో మిగిలిపోయిన అడ్మిషన్లకు అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 32,079 సీట్లకు గానూ 69,362 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.
TG: ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విద్యార్థులు వేగంగా న్యూస్ అందిస్తున్న హిట్ టీవీ యాప్లో కూడా పొందవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్క్రీన్లో మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నంబర్ ఎంటర్ చేయగానే వేగంగా ఫలితాలను పొందుతారు. ఈ ఫలితాలను వాట్సాప్ సహా ఇతర ప్లాట్ఫాంలకు షేర్ చేసుకోవచ్చు.
తెలంగాణ పదో తరగతి ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెల 16న పరీక్షలు ముగియనుండగా, ఏప్రిల్ 23లోపు మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ప్రధాన సబ్జెక్టుల పేపర్ల దిద్దుబాటు ప్రారంభమైంది. జూన్ నుండి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఫలితాల ప్రక్రియను వేగవంతం చేసింది.
BPT: అద్దంకి మండలంలోని కొణిదేన గ్రామంలో రీసర్వే కార్యక్రమానికి సంబంధించిన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు రీసర్వే విధానం, చేపట్టే చర్యలపై అధికారులు వివరించారు. గ్రామంలో భూ రికార్డుల పునఃసర్వే ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. భూముల సరిహద్దులు, పట్టాదారుల వివరాలు ఖచ్చితంగా నమోదు చేసే దిశగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఐటీ దిగ్గజం TCS తన అర్హులైన ఉద్యోగులందరికీ జీతాల పెంపును ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ప్రతిభ కనబరిచిన వారికి రెండంకెల స్థాయిలో పెంపు ఉంటుందని సంస్థ తెలిపింది. మరోవైపు, కంపెనీ లాభం 12 శాతం పెరిగి రూ.13,718 కోట్లకు చేరింది. ఆర్థికంగా దూసుకుపోతున్న తరుణంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
TG: ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేయనుంది. ఫలితాల ప్రక్రియను మరింత కచ్చితంగా నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశాలతో అధికారులు ఈసారి ‘డబుల్ చెక్’ విధానాన్ని అమలు చేశారు.
ఓపెన్ టెన్త్ అభ్యర్థులకు సులభతరమైన డిజిటల్ సేవను TG ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఓపెన్ స్కూల్ పరీక్షల హాల్ టికెట్లను మీ సేవ అధికారిక వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. APR 10 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం విద్యార్థులు లేదా తల్లి దండ్రులు మీ సేవ అధికారిక వాట్సాప్ నంబర్ 8096958096ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
ఎలాన్ మస్క్, పావెల్ చేసిన ఆరోపణలను వాట్సాప్ తిప్పికొట్టింది. అమెరికా కోర్టులు వేసిన దావా నిరాధారమైనదని పేర్కొంది. వాట్సాప్లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ మేసేజ్ పంపేవారు.. అందుకునేవారు మాత్రమే వాటిని చదవగలరని స్పష్టం చేసింది. ఎన్క్రిప్షన్ కీ వినియోగదారుల పరికరాల్లోనే ఉంటుంది కాబట్టి వాటిని డీక్రిప్ట్ చేయడం ఇతరులకు సాధ్యం కాదని వెల్లడించింది.