పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. ఈ ఏడాది చివరికల్లా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1.85 లక్షలకు చేరవచ్చని యాక్సిస్ డైరెక్ట్ అంచనా వేసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న డిమాండే ఇందుకు ప్రధాన కారణాలు. గత ఏడాది అక్షయ తృతీయ నుంచి ఇప్పటివరకు ధరలు 60% పెరగడం గమనార్హం. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ కంటే బంగారంపై పెట్టుబడే సురక్షితమని ఈ నివేదిక స్పష్టం చేసింది.