కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లోని వివిధ పోస్టులకు SSC ఫేజ్-XIV నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిప్యూటీ రేంజర్, స్టెనోగ్రాఫర్, అకౌంటెంట్ తదితర పోస్టుల కోసం మొత్తం 3003 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ నిన్నే ప్రారంభం కాగా.. 10/ఇంటర్/డిగ్రీ అభ్యర్థులు మే 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TG: మార్చి 14న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు నిన్నటితో ముగిశాయి. మొత్తం 5.17 లక్షల రెగ్యులర్ విద్యార్థుల్లో సగటున 99% మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే 4 సబ్జెక్టుల మూల్యాంకనం, స్కానింగ్ ప్రక్రియ పూర్తయింది. మే తొలి వారంలో ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ నెల 15-16 తేదీల్లో ఓరియంటల్ పరీక్షలున్నా.. వాటిని కొద్ది మందే రాయనున్నారు.
MDCL: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ జాబ్ డ్రైవ్ విజయవంతంగా ముగిసింది. సినోక్యూల్ రీసెర్చ్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాలో 43 మంది విద్యార్థులు పాల్గొనగా.. 10 మంది ఎంపికయ్యారు. ఎంపికైన వారికి నెలకు రూ. 20,000 వేతనంతో నియామక పత్రాలు అందజేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు.
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఓలా ‘S1 X’ మోడల్ బైక్ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,29,999గా ప్రకటించింది. ఈ స్కూటర్లో శక్తివంతమైన 4.6 kWh బ్యాటరీ ప్యాక్ను అమర్చారు. ఇది సింగిల్ ఛార్జ్పై ఏకంగా 320 కి.మీ దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో ఇది అత్యుత్తమ రేంజ్ల్లో ఒకటి కావడం విశేషం.
ఖర్చు నియంత్రణ కోసం కొందరు క్రెడిట్ కార్డులను క్లోజ్ చేస్తుంటారు. కానీ ఇలా చేస్తే క్రెడిట్ స్కోర్ పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అత్యవసరంలో సాయపడే ఈ కార్డులను యాక్టివ్గానే ఉంచుకోవడం ఉత్తమమని.. ఖర్చు నియంత్రణకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. కావాలంటే ఫస్ట్ తీసుకున్న కార్డును కాకుండా తర్వాత తీసుకున్నవి క్లోజ్ చేయొచ్చంటున్నారు.
తెలంగాణలో 2026 సంవత్సరానికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగినవారు ఈ నెల 15 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 15-30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. దరఖాస్తు ఫీజు, అర్హతల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TG: రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ 2026-27 నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 15 నుంచి మే 7 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. ఈనెల 30 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానుండగా, మే 14న సీట్లను కేటాయిస్తారు. మే 15 నుంచి రెండో విడత, మే 31 నుంచి మూడో విడత ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు ఈ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
CBSE 10వ తరగతి సెషన్-1 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 25 లక్షల మంది విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఫలితాలు రేపు విడుదలయ్యే అవకాశం ఉండగా, దీనిపై బోర్డు ఈరోజు సాయంత్రం అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం. విద్యార్థులు cbse.gov.in వెబ్సైట్లో తమ మార్కులను చూసుకోవచ్చు. ఒకవేళ మార్కులు పెంచుకోవాలనుకుంటే, సెషన్-2 పరీక్షలు మే 15 నుంచి ప్రారంభం కానున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1566 పాయింట్లు నష్టపోయి 75,983 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 464 పాయింట్ల నష్టంతో 23,586 దగ్గర కొనసాగుతోంది. దీంతో కేవలం 8 నిమిషాల్లోనే దాదాపు రూ.8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.39 వద్ద ఉంది.
ఇండియా గవర్నమెంట్ మింట్(IGM) 94 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. సూపర్వైజర్, లాబ్ అసిస్టెంట్, Jr.టెక్నీషియన్ తదితర పోస్టులు ఉండగా.. ITI, డిప్లొమా, డిగ్రీ, BE/BTech ఉత్తీర్ణత గలవారు ఈ నెల నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇవ్వడంతో మళ్లీ చమురు ధరలు పెరిగాయి. యూఎస్ క్రూడ్(వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్) బ్యారెల్ ధర 8 శాతం మేర పెరిగి 104.24 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ 7 శాతం మేర పెరిగి 102.29 డాలర్లకు చేరింది. ఇటీవల శాంతి చర్చల వేళ చమురు 95 డాలర్లకు చేరిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ధరలు మరోసారి ఆకాశాన్ని తాకాయి.
పాట్నా-AIIMSలో 86 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుండగా.. MD/ML/MCh/MDలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు ఈ నెల 20తో ముగియనుంది. జీతం నెలకు రూ.1,01,500-1,68,900 మధ్య ఉంటుంది.
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC) 173 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ తదితర పోస్టులు ఉండగా.. సంబంధిత విభాగంలో MD/MS/DNB ఉత్తీర్ణులైనవారు ఈ నెల 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.500. SC/ST/PwB/మహిళలకు ఫీజు లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
TG: డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ను ఇవాళ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రకటించారు. మూడు విడతల్లో సీట్ల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎల్లుండి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వారం తర్వాత నుంచి వెబ్ ఆప్షన్లు ఉంటాయని వెల్లడించారు. కాగా నిన్న ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.