TG: TG EdCET 2026 ఎంట్రన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదలయింది. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 15 వరకు అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉంది. మే 12న రెండు సెషన్లలో ఆన్లైన్ విధానంలో ఎంట్రన్స్ పరీక్ష, మే 30న ఫలితాలు రానున్నాయి.
బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దేశంలో బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవని వెల్లడించారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతోనే బంగారానికి రెక్కలు వచ్చినట్లు చెప్పారు. ఈ పరిణామాలను RBI ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు నిర్మలమ్మ పేర్కొన్నారు.
స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాక IDFC ఫస్ట్ బ్యాంక్ పేర్లు పతనమయ్యాయి. ఒకనొకదశలో 20 శాతం పతనాన్ని చవిచూశాయి. చండీగఢ్ బ్రాంచ్లో రూ.590 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు బ్యాంక్ ప్రకటించింది. గవర్నమెంట్ ఖాతాల నిర్వహణలో ఈ మోసాన్ని గుర్తించినట్లు చెప్పింది. దీంతో ఇన్వెస్టర్ల ఆందోళనకు గురవ్వడంతో షేర్లు పతనానికి లోనయ్యాయి. ప్రస్తుతం ఒక్కో షేర్ రూ.70.75 వద్ద కొనసాగుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 పెరిగి రూ.1,61,350కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,900 పెరిగి రూ.1,47,900 పలుకుతోంది. ఇక, కిలో వెండి ధర రూ.10,000 పెరిగి రూ.3 లక్షలకు చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 83,340.08 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లకు పైగా లాభంతో 25728.85 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.73గా ఉంది.
AP: ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్ పరీక్షలు ఒక మైలురాయి. ఈ పరీక్షలు భవిష్యత్ విద్యా, వృత్తి అవకాశాలకు మార్గం సుగమం చేస్తాయి. కాబట్టి విద్యార్థులు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రశ్నలను జాగ్రత్తగా చదివి సమాధానాలు రాయాలి. మీ కష్టానికి తగిన ఫలితాలు రావాలని కోరుకుంటూ.. హిట్ టీవీ తరఫున ALL THE BEST
కోనసీమ: అమలాపురం ఉపాధి కార్యాలయంలో ఈనెల 26న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమో విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.
చండీగఢ్లోని IDFC ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్లో రూ.590 కోట్ల భారీ మోసం జరిగింది. హర్యానా ప్రభుత్వ విభాగాలకు చెందిన ఖాతాలో ఈ గోల్మాల్ చోటుచేసుకుంది. ఒక శాఖ తన ఖాతా క్లోజ్ చేయాలని కోరగా బ్యాలెన్స్లో తేడాలు రావడంతో విషయం బయటపడింది. దీంతో హర్యానా ప్రభుత్వం ఆ బ్యాంకును బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఇది కేవలం ప్రభుత్వ ఖాతాలకు మాత్రమే పరిమితమని సమాచారం.
ATP: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ శైలజా తెలిపారు. పేటీఎం సంస్థ అనంతపురంలోని పంగల్ రోడ్డులోని టీటీడీసీ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోందన్నారు. పదవ తరగతి నుంచి పైచదువులు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
AP: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 24 వరకు జరగనున్న ఈ పరీక్షలకు 10,57,899 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. రాష్ట్రవ్యాప్తంగా 1.537 కేంద్రాలు ఏర్పాటుచేశారు. పరీక్ష ఉ.9-మ.12 గంటల మధ్య జరగనుండగా.. విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ALL THE BEST STUDENTS!
TG: హైదరాబాద్లోని Wolves4You Private Limited సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.8,40,000 వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు తక్షణమే విధుల్లో చేరాల్సి ఉంటుంది. మార్చి 22 లోపు దరఖాస్తు చేసుకోండి.
BHPL: పలిమెల మండలం పంకెన గ్రామ శివారులోని గోదావరి నది తీరంలో అర్ధరాత్రి వేళ భారీ యంత్రాలతో రహస్య తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరుగుతుండటంతో గ్రామస్తుల్లో కలకలం రేపుతోంది. ఇది ఇసుక అక్రమ రవాణా కోసమా లేక నిధి అన్వేషణ కోసమా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
కోనసీమ: రామచంద్రపురంలో ఆదివారం మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 26 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ఉపాధి ప్రాజెక్టు డైరెక్టర్ రామ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు రామచంద్రపురం పట్టణంలో 36 జాబ్ మేళాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మంత్రి, కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అభినందనలు తెలిపారు.
ఐటీ శాఖ ‘ఆదాయ పన్ను ముసాయిదా నిబంధనలు 2026’ను ప్రతిపాదించింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం, ఏడాదిలో రూ.10L దాటిన క్రెడిట్ కార్డ్ లావాదేవీల వివరాలు నేరుగా ఐటీ శాఖకు వెళ్తాయి. ఆఫీస్ కార్డులను వ్యక్తిగత అవసరాలకు వాడితే పన్ను పడుతుంది. అయితే, సిసి స్టేట్మెంట్ను అడ్రస్ ప్రూఫ్గా వాడొచ్చు. ఇకపై క్రెడిట్ కార్డు దరఖాస్తుకు పాన్ తప్పనిసరి.
ఆదాయ పన్ను ముసాయిదా నిబంధనలు-2026 పేరిట ఐటీ శాఖ కీలక ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఈ ముసాయిదా ప్రకారం.. ఒక ఆర్థిక ఏడాదిలో క్రెడిట్ కార్డు ద్వారా రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలు చేస్తే.. ఆ వివరాలను బ్యాంకులు ఐటీ శాఖకు నివేదిస్తాయి. అలాగే రూ.లక్ష, అంత కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేసినా వివరాలు అందిస్తాయి. దీందో ఖర్చుచేసే వారిపై ఐటీ శాఖ నిఘా పెరుగుతుంది.