నైట్ ఫ్రాంక్ సర్వే ప్రకారం 2031 నాటికి భారత బిలియనీర్ల సంఖ్య 51 శాతం పెరగనుంది. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య 313కి చేరుతుందని అంచనా. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండటంతో ప్రతిరోజూ సగటున 89 మంది అల్ట్రా రిచ్ జాబితాలో చేరుతున్నారు. ఇది మన దేశంలో పెరుగుతున్న సంపద సృష్టికి, ఆర్థిక బలానికి నిదర్శనంగా నిలుస్తోంది.