CBSE పదో తరగతి సెషన్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు మార్కులను తెలుసుకునేందుకు బోర్డు ప్రధాన వెబ్సైట్లు cbse.gov.in, results.cbse.nic.inలను అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరి 17 నుంచి మర్చి 11 మధ్య ఈ పరీక్షలు జరిగాయి. సుమారు 25 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు.
మెటా ఇండియా, గూగుల్, ఎక్స్, రెడిట్లకు గుజరాత్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏఐని దుర్వినియోగం చేసి సృష్టిస్తున్న డీప్ఫేక్ వీడియోలు, ఫొటోలను ఈ ప్లాట్ఫామ్ల్లో పలువురు వ్యాప్తి చేస్తున్నారని.. వీటిని అడ్డుకోవాలని పిల్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ కంటెంట్ను తొలగించడానికి ముందుకు రావాలని.. మే 8న విచారణకు రావాలని పేర్కొంది.
TG: రాష్ట్రంలోని 93 KGBVల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇంగ్లిష్ మీడియంలో MPC, BiPC, CEC గ్రూపుల్లో ప్రవేశాల కోసం ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. TGRJC CET-2026 ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఎయిరిండియా సంస్థకు 2026 ఆర్థిక ఏడాదికి సంబంధించి దాదాపు రూ.22,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. దీంతో వాటాదారులైన టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్లైన్స్ను ఎయిరిండియా ఆర్థిక సాయం కోరినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం, పశ్చిమాసియాలో యుద్ధం తమ నష్టాలకు కారణమని కంపెనీ తెలిపింది. గతంలో 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని అంచనా వేసినప్పటికీ భారీగా పెరిగింది.
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్ఫారమ్ ‘గ్రో’ మాతృసంస్థ.. బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేర్లు మార్కెట్లో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా’ ఈ స్టాక్కు అత్యధిక టార్గెట్ ధరను ప్రకటించడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
AP: ఇవాళ విడుదలైన ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులు సాధించారు. ఫస్టియర్లో MPC విద్యార్థి 470కి 469 మార్కులు సాధించాడు. BiPC-453/455, CEC-496/500, HEC-495/500 మార్కులు నమోదయ్యాయి. ఇక సెకండియర్లో 1000కి MPC-994, BiPC-993, CEC-983, HEC-983 మార్కులు టాప్గా నిలిచాయి. ఎక్కువ మార్కులు సాధించిన వారి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న CBSE 10వ తరగతి ఫలితాలు ఇవాళ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. బోర్డు ఇవాళ ఏ క్షణమైనా ఫలితాలను ప్రకటించే ఛాన్స్ ఉందని పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు మార్కులను తెలుసుకునేందుకు బోర్డు ప్రధాన వెబ్సైట్లు cbse.gov.in, results.cbse.nic.inలను అందుబాటులో ఉంచింది.
AP: ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా సత్తా చాటింది. ఫస్టియర్ (90%), సెకండియర్ (92%) ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గుంటూరు జిల్లా (88%) రెండో స్థానంలో నిలవగా.. ఫస్టియర్లో వైజాగ్ (85%), సెకండియర్లో ఎన్టీఆర్ జిల్లా (87%) మూడో స్థానంలో నిలిచాయి. కేవలం 62% ఉత్తీర్ణతతో అన్నమయ్య జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానానికి పరిమితమైంది.
AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను బోర్డు ప్రకటించింది. మే 21 నుంచి జూన్ 4 వరకు థియరీ పరీక్షలు ఉదయం (9-12), మధ్యాహ్నం (2:30-5:30) షిఫ్టుల్లో జరుగుతాయని చెప్పింది. జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయని పేర్కొంది. మార్కులపై సంతృప్తి లేని వారు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఏప్రిల్ 20 నుంచి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.
AP: ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఫస్టియర్ ఫలితాల్లో 77%, సెకండియర్లో 81% ఉత్తీర్ణత నమోదైంది. మొదటి ఏడాదిలో 3,61,526 మంది, రెండో ఏడాదిలో 3,59,816 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు. విద్యార్థులు తమ మార్కులను HIT TV యాప్లో సులభంగా చూసుకోవచ్చు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,420 పెరిగి రూ.1,55,350కి చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,300 పెరిగి రూ.1,42,400గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర ఏకంగా రూ.10,000 పెరిగి రూ.2,75,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
TG: విద్యార్థులు డిగ్రీ చదువుతూనే అప్రెంటిస్షిప్తో ఉద్యోగాలు తెచ్చుకునేలా విద్యాశాఖ మార్పులు చేస్తోంది. ఇందుకోసం అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ను విస్తరిస్తోంది. 2026-27 నుంచి కొత్తగా 11 కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే 15 ఉండగా, ఆ సంఖ్య 26కు చేరనుంది. డెయిరీ, ఫిషరీస్, యానిమేషన్, ఫుడ్ టెక్నాలజీ, ఈ మొబిలిటీ, MLT తదితర కోర్సులను చేర్చారు.
TG: గురుకుల విద్యాలయాల సంస్థ, కేజీబీవీల్లో ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు నిర్వహించే TGRJC సెట్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో ముగియనుందని ఆ సంస్థ కార్యదర్శి రమణకుమార్ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 60 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఆసక్తి గల వారు ఇవాళ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
TG: TET-2026 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అభ్యర్థులు ఇవాళ్టి నుంచి అప్లై చేసుకోవచ్చు. పరీక్షలు జూన్ 15-30 తేదీల్లో జరగనున్నాయి. ఫలితాలు జూలై 28-31 మధ్య వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. సర్వీసులో ఉన్న టీచర్లు కూడా టెట్ రాయాల్సి రాయాలని నిబంధనలు తీసుకురావడంతో దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
AP: ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను అధికారులు ఇవాళ విడుదల చేయనున్నారు. ఉదయం 10:31 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఏడాది ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 10.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కాగా వేగంగా, సులభంగా HIT TV యాప్లో మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.