దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో తక్కువ ధర ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. రూ.50 లక్షల లోపు ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 23 శాతం క్షీణించాయి. కొత్త ఇళ్ల నిర్మాణం తగ్గడమే దీనికి ప్రధాన కారణమని నివేదికలు చెబుతున్నాయి. సామాన్యులు కొనే ఇళ్ల సంఖ్య తగ్గిపోవడంతో, మొత్తం 16,273 ఇళ్లు మాత్రమే అమ్ముడైనట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది.