• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం 4.6 శాతం: RBI

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. యుద్ధం, వాతావరణ పరిస్థితుల వల్ల వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని RBI గవర్నర్ హెచ్చరించారు. ఫిబ్రవరి నాటికి టోకు ద్రవ్యోల్బణం కూడా 3.2 శాతానికి పెరిగిందని అన్నారు. ధరల పెరుగుదల అంచనాలతో సామాన్య ప్రజల బడ్జెట్‌పై అదనపు భారం పడే సూచనలు కనిపిస్తున్నాయని RBI స్పష్టం చేసింది.

April 8, 2026 / 04:13 PM IST

అమెజాన్‌లో మరోసారి భారీ లేఆఫ్స్

ప్రముఖ కంపెనీ అమెజాన్‌ మరోసారి భారీ లే ఆఫ్స్‌కు సిద్దమైంది. ఈ ఏడాది మే నాటికి ప్రపంచవ్యాప్తంగా 14వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. AIలో భారీ పెట్టుబడులు పెడుతుండటంతో ఖర్చులను తగ్గించుకోవడం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా AWS, రిటైల్, HR విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనవరిలో 16వేల మందిని అమెజాన్ తొలగించింది.

April 8, 2026 / 03:00 PM IST

NITలో 86 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

NIT-తిరుచిరాపల్లి 86 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆర్కిటెక్చర్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. విద్యార్హత, ఉద్యోగానుభవంతో పాటు గేట్/ నెట్/ సెట్/ CSIR నెట్ ఉత్తీర్ణత గలవారు ఈ నెల 16 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35 ఏళ్లు. UR/EWS/OBCలకు దరఖాస్తు ఫీజు రూ.2500. SC/ST/దివ్యాంగ అభ్యర్థులకు రూ.1250.

April 8, 2026 / 01:18 PM IST

ఫలితాలపై ఇంటర్ విద్యార్థులకు BIG ALERT

TG: ఇంటర్ ఫలితాలను తొలుత ఏప్రిల్ 10 లేదా 12 తేదీలలో ప్రకటించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫలితాల ప్రక్రియను మరింత కచ్చితంగా నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశాలతో అధికారులు ‘డబుల్ చెక్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. మార్కుల లెక్కింపులో ఎలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

April 8, 2026 / 12:50 PM IST

UCSLలో 15 సూపర్‌వైజర్‌ పోస్టులు

ఉడుపి కేంద్రంగా పనిచేస్తున్న Udupi Cochin Shipyard Limited (UCSL) నుంచి కొత్త ఉద్యోగావకాశాలు విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 15 సూపర్‌వైజర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఐటీఐ, డిగ్రీ  పూర్తి చేసిన వారు ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. జీతం రూ. 40,650 ఉంటుంది. వివరాలకు https://udupicsl.comను సంప్రదించండి.

April 8, 2026 / 12:05 PM IST

రూ.10,000 పెరిగిన వెండి ధర

బంగారం ధరతో పాటు వెండి ధర భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కిలో వెండి ఏకంగా రూ.10,000 ఎగబాకింది. దీంతో ప్రస్తుతం సిల్వర్ రేటు రూ.2,65,000కు చేరింది. కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,980 పెరగగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,650 పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

April 8, 2026 / 10:56 AM IST

ఆర్‌బీఐ వడ్డీరేట్లలో మార్పుల్లేవ్‌

రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా(RBI) కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపనతి విధాన సమీక్ష నిర్ణయాలను RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని, 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 2026-27 ఆర్థిక ఏడాదిలో RBI నిర్వహించిన తొలి ద్వైమాసిక సమీక్ష. ఫిబ్రవరిలో జరిగిన సమీక్షలో యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే.

April 8, 2026 / 10:24 AM IST

ALERT: ఎడిట్ ఆప్షన్‌కు నేడే లాస్ట్ డేట్!

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల కోసం రాసే EAPCET అప్లికేషన్లలో తప్పులుంటే సరిచేసుకోవడానికి ఇచ్చిన టైమ్ ఇవాళ్టితో ముగియనుంది. చాలా మంది అప్లికేషన్లలో తప్పులు రావడంతో అధికారులు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. పేరు, పుట్టిన తేదీ, ఇంటర్ హాల్‌టికెట్ నంబర్ వంటివి ఆన్‌లైన్‌లో మారవు. మిగతా వివరాలను మాత్రం ఆన్‌లైన్‌లోనే వెంటనే మార్చుకోవచ్చు.

April 8, 2026 / 10:23 AM IST

తగ్గిన క్రూడాయిల్ ధర.. బలపడిన రూపీ

ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణతో క్రూడాయిల్ ధరలు 8% శాతం తగ్గిన సంగతి తెలిసిందే. బ్యారెల్ క్రూడాయిల్ ధర 117 డాలర్ల నుంచి 103కు చేరింది. దీంతో డారల్‌తో రూపాయి విలువ బలపడింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 50 పైసలు పెరిగి 92.56 వద్ద ట్రేడవుతోంది.

April 8, 2026 / 09:27 AM IST

భారీ జీతంలో AIIMSలో 142 ఉద్యోగాలు

AIIMS-దేవ్‌గఢ్ 142 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు  కోరుతోంది. జనరల్ సర్జరీ, ఫోరెన్సిక్ మెడిసిన్, మెడికల్ ఆంకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. MD/MS/DNB/MDSలో ఉత్తీర్ణత గలవారు ఈ నెల 25 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.67,700 వేతనం ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.3000. OBC/EWSలకు రూ.1000. SC/ST/PwBD/ మహిళలకు ఫీజు లేదు.

April 8, 2026 / 08:43 AM IST

పదో తరగతి ఫలితాలపై కీలక అప్‌డేట్!

TG: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మే మొదటి వారంలో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. మే 4 లేదా 5న ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకనం ఈనెల 1న ప్రారంభమైంది. ఈనెల 23వ తేదీతో ముగుస్తుంది. ఫలితాలు క్రోడీకరించి మే మొదటి వారంలో రిజల్ట్ విడుదల చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

April 8, 2026 / 08:20 AM IST

NITCONలో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్

నార్త్ ఇండియా టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్(NITCON)లో 100 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.55,932 వేతనం ఉంటుంది. UR, OBC అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.885. SC/ST/PwBDలకు రూ.531.

April 8, 2026 / 07:09 AM IST

సీఏ పరీక్షలపై ICAI కీలక నిర్ణయం

సీఏ ఫైనల్ పరీక్షలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు జరుగుతాయని ఐసీఏఐ తెలిపింది. మే సెషన్ నుంచే ఈ కొత్త విధానం ప్రారంభమవుతుందని పేర్కొంది. ఈ పరీక్షలు ప్రస్తుతం ఏడాదిలో మూడు సార్లు జరుగుతుండగా.. ఇకపై మే, నవంబరులో మాత్రమే జరుగుతాయని వెల్లడించింది. విద్యార్థుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఏఐ జాయింట్‌ డైరెక్టర్ ఆనంద్ కుమార్ తెలిపారు.

April 7, 2026 / 04:50 PM IST

ALERT: పరీక్షలు రీషెడ్యూల్

సీఏ ఇంటర్ పరీక్షల నిర్వహణపై ICAI కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా మే 3 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా.. మే 5న రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది. కొత్త షెడ్యూల్ ప్రకారం మే 5 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఇవి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని వెల్లడించింది. అయితే.. ఫౌండేషన్, ఫైనల్, పీక్యూసీ పరీక్షల తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.

April 7, 2026 / 04:27 PM IST

యుద్ధం.. 10 వేలకుపైగా విమానాలు రద్దు

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నుంచి పలు దేశాలకు వెళ్లే అనేక విమాన సర్వీసులను దేశీయ విమానయాన సంస్థలు రద్దు చేశాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 10 వేలకు పైగా విమాన సర్వీసులను రద్దయ్యాయి. ప్రయాణికులు భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది. 

April 7, 2026 / 04:25 PM IST