ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, ‘బ్లాక్’ సీఈవో జాక్ డోర్సే కీలక ప్రకటన చేశారు. ఏఐ బూమ్ నేపథ్యంలో తమ కంపెనీలో 4000 మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఇది 40 శాతంగా ఉంది. ఈ నిర్ణయం చాలా కఠినమైనదని ఎక్స్లో పోస్ట్ చేశారు.
అమెరికా డిమాండ్స్కు ఆంథ్రోపిక్ నో చెప్పింది. ఏఐ టూల్ క్లాడ్ నుంచి రక్షణలను తొలగించమని ఆంథ్రోపిక్ సీఈవో వెల్లడించారు. యూఎస్ బెదిరింపులు తమ నిర్ణయాన్ని మార్చలేవని స్పష్టం చేశారు. కాగా, సైనిక ప్రయోజనాల కోసం ఎలాంటి షరతులు లేకుండా ఏఐ సాంకేతికతకు యాక్సెస్ ఇవ్వాలని అమెరికా రక్షణ మంత్రి గడువు విధించారు. లేకపోతే కాంట్రాక్ట్ నుంచి బయటకు వస్తామని హెచ్చరించారు.
AP: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్, తొమ్మిదో తరగతి విద్యార్థులకు SA-2 పరీక్షలు మార్చి 2 నుంచి నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను RJDలు, డీఈవోలు క్షేత్రస్థాయి సిబ్బందికి చేరవేయాలని ఆదేశించింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
సత్యసాయి: జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో కృష్ణప్ప తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఐదో తరగతి స్థాయిలోనే తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఈ పరీక్ష ఉంటుందని వివరించారు.
NLR: ASపేటలో ఉన్న ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో 2026-27 ఏడాది ప్రవేశానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గురువారం ప్రిన్సిపల్ కే. శ్రీదీప్ కోరారు. ప్రవేశ పరీక్ష కోసం ఓసీ, బీసీ రూ. 200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 125 ఆన్ లైన్లో రుసుము చెల్లించి దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తుకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఏపీ గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 5వ తరగతిలో ప్రవేశానికి, 6,7, 8 తరగతలలో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశానికి, ఇంటర్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. మార్చి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేయవచ్చని, ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పూర్తి వివరాలకు apcfss.inను సంప్రదించండి.
TG: నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాలని ప్రభుత్వానికి విద్యాకమిషన్ సూచనలు చేసింది. DEIED కోర్సు రద్దు చేయాలని.. బీఈడీ విద్యార్థులకు 150 రోజుల టీచింగ్ ట్రైనింగ్ ఉండాలని పేర్కొంది. మరోవైపు వచ్చే విద్యాసంవత్సరం నుంచి 100 నియోజకవర్గాల్లోని 200 ప్రభుత్వ పాఠశాలలను ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’గా అప్ గ్రేడ్ చేయనున్నట్లు CM రేవంత్ ప్రకటించారు.
ప్రముఖ ప్లాట్ఫామ్ బ్లైండ్ 2026 సంవత్సరానికి భారత్లో పనిచేసేందుకు ఉత్తమమైన టాప్ 10 కంపెనీల జాబితాను ప్రకటించింది. ఇందులో ఎన్విడియా (NVIDIA) అగ్రస్థానంలో నిలిచింది. గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సుమారు 40,686 మంది ఉద్యోగుల సమీక్షల ఆధారంగా ఈ ర్యాంకింగ్ను రూపొందించారు. ఈ కంపెనీలు మెరుగైన పని వాతావరణాన్ని అందిస్తున్నాయి.
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఈడీ ఎదుట హాజరయ్యారు. అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ నకు ప్రమేయం ఉన్న రూ.40 వేల కోట్ల బ్యాంకింగ్, కార్పొరేట్ మోసం కేసులో ఈడీ ఆయనను విచారిస్తోంది. కాగా, ఇటీవల ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.210 తగ్గి రూ.1,61,680కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,48,200గా నమోదైంది. అయితే, వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,95,000 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 79.59 పాయింట్లు లాభపడి 82355.66 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35.85 పాయింట్ల లాభంతో 25518.35 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.87గా ఉంది.
KDP: అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్లో ప్రవేశాలకు మార్చి 1న పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సమన్వయకర్త ఉదయశ్రీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతికి ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
కడప YVUలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొ.టి.శ్రీనివాస్ తెలిపారు. AP నైపుణ్యాభివృద్ధి సంస్థ, YVU ప్లేస్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. 13 కంపెనీలు విశ్వవిద్యాలయానికి వస్తున్నాయన్నారు. టెన్త్ నుంచి పీజీ చదివిన వారు అర్హులన్నారు. పూర్తి సమాచారం కోసం 6300125455, 94405 16153 నంబర్లలో సంప్రదించాలన్నారు.
KRNL: ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న తెలుగు, ఎకనామిక్స్, కంప్యూటర్ అప్లికేషన్ పోస్టులకు అతిథి అధ్యాపకుల నియామకం చేపట్టనున్నట్లు ప్రిన్సిపాల్ S.శివారెడ్డి తెలిపారు. PGలో 55% మార్కులు ఉన్నవారు అర్హులని, నెట్, సెట్, PHD ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 27 నుంచి కళాశాలలో డెమో ఇవ్వాలన్నారు.
నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో 69 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ శశికళ బుధవారం తెలిపారు. మొత్తం 132 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రిసిపల్ పేర్కొన్నారు. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని ఆమె సూచించారు.