• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

ALERT: రేపే లాస్ట్ డేట్

TG: టీజీఆర్‌జేసీ సెట్-2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు రేపటితో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఈ పరీక్ష ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

April 14, 2026 / 09:58 PM IST

పరీక్షల షెడ్యూల్ విడుదల

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం నిర్వహించే NTPC పరీక్ష తాత్కాలిక షెడ్యూల్‌ను RRB విడుదల చేసింది. ఈ పరీక్షలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి విడతలో మే 7, 8, 9 తేదీల్లో, రెండో విడతలో జూన్ 13, 14న.. మూడో విడతలో జూన్ 16 నుంచి జూన్ 21 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీని పరీక్షకు 10 రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

April 14, 2026 / 09:34 PM IST

ALERT: 9, 175 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) కానిస్టేబుల్ ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవచ్చు. మొత్తం 9,175 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700-రూ.69,100 జీతం అందిస్తారు. పూర్తి వివరాలకు RECT.CRPF.GOV.INను సందర్శించండి.

April 14, 2026 / 09:30 PM IST

గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి ఆరు రెట్లు పెరిగిన పెట్టుబడులు

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు సంప్రదాయ ‘సురక్షిత ఆస్తి’ బంగారంలో పెట్టుబడులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే 2026, మార్చి త్రైమాసికంలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు ఏకంగా 6 రెట్లు పెరగడమే దీనికి సాక్ష్యం. మార్చితో ముగిసిన త్రైమాసికంలో గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి మొత్తం రూ. 31,561 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

April 14, 2026 / 08:59 PM IST

162 పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం

ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 162 పోస్టులను దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాన్పూర్ ప్రధాన కార్యాలయం, వివిధ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు మే 13వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, బీటెక్/బీఈ ఎంఈడీ, ఎంసీఏ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

April 14, 2026 / 08:40 PM IST

BREAKING: రేపు ఇంటర్ ఫలితాలు

AP: రేపు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 10:31 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ‘X’ వేదికగా వెల్లడించారు. వేగంగా, సులభంగా HIT TV యాప్‌లో మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

April 14, 2026 / 07:52 PM IST

మెటాకు మరో సీఈఓ.. జుకర్‌బర్గ్‌కు పోటీగా ఏఐ..?

ప్రముఖ టెక్ సంస్థ మెటాకు మరో సీఈవో రానున్నారు. మార్క్ జుకర్‌బర్గ్‌కు పోటీగా ఈ సంస్థను నడపనున్నారు. జుకర్‌బర్గ్ హావభావాలు, గొంతు అనుకరించేలా ఏఐ జుకర్‌బర్గ్‌ను రూపొందించే పనిలో సంస్థ దృష్టి సారించినట్లు సమాచారం. దీంతో పని ప్రదేశంలో ఆయన లేకపోయినా ఉద్యోగులకు ఆ లోటు తెలియకుండా ఉండేందుకే ఈ ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.

April 14, 2026 / 07:25 PM IST

కరెన్సీ బలహీనంగా ఉండటం అంటే ఏంటి?

ఒక దేశ కరెన్సీ విలువ వేరే దేశ కరెన్సీతో పోల్చినప్పుడు మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, డాలర్ కొనడానికి తక్కువ రూపాయలు ఖర్చయితే మన రూపాయి బలంగా ఉందని అర్థం. అదే ఎక్కువ రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తే రూపాయి బలహీనపడిందని అంటారు. అంతర్జాతీయ మార్కెట్లో వస్తువుల కొనుగోలు, డిమాండ్‌ను బట్టే ఈ కరెన్సీ విలువలలో మార్పులు కనిపిస్తుంటాయి.

April 14, 2026 / 05:50 PM IST

లీటర్ పెట్రోల్‌పై రూ.18, డీజిల్‌పై రూ.35 నష్టం

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వరంగ చమురు కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ధరలు పెరిగినా దేశీయంగా ధరలు పెంచకపోవడంతో లీటర్ పెట్రోల్‌పై రూ.18, లీటర్ డీజిల్‌పై రూ.35 చొప్పున నష్టాలు చవిచూస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వరంగ చమురు సంస్థలైన IOC, BPCL, HPCL 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి.

April 14, 2026 / 03:05 PM IST

TG EdCETకు రేపే లాస్ట్!

తెలంగాణలోని BEd కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే EdCET-2026కు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. దరఖాస్తు ఫీజు రూ.750. SC/ST/PwBDలకు రూ.550. ఈ లోపు అప్లై చేసుకోలేకపోతే రూ.250 ఆలస్య రుసుముతో ఈ నెల 22 వరకు, రూ.500తో 27 వరకు, రూ.1000తో 30 వరకు అప్లై చేసుకోవచ్చు. చివరి అవకాశంగా రూ.5000 దరఖాస్తు ఫీజుతో మే 8-9 తేదీల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. మే 12న పరీక్ష జరగనుంది. 

April 14, 2026 / 02:12 PM IST

10 రోజుల్లో 100 బిలియన్‌ డాలర్ల విలువ

యుద్ధం కారణంగా ఒక వైపు స్టాక్ మార్కెట్లు పతనమవుతున్న ఇంటెల్ కంపెనీ షేర్ దూసుకెళ్తుంది. చివరి 8 మార్కెట్ సెషన్లలో కంపెనీ షేర్ విలువ 51 శాతం పెరిగింది. దీంతో కేవలం 10 రోజుల్లో 100 బిలయన్ డాలర్లను ఇంటెల్ ఆర్జించింది. అపోలో గ్లోబల్ మేనేజ్‌మెంట్ నుంచి కంపెనీ ప్లాంట్‌ను బైబ్యాక్ చేసి మస్క్ టెరా ఫ్యాబ్ ప్రాజెక్టులో చేరుతున్నట్లు ఇంటెల్ ప్రకటించడంతో షేర్లు జోరందుకున్నాయి.

April 14, 2026 / 12:19 PM IST

NICలో 153 పోస్టులు.. అప్లై చేశారా?

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(NIC) 153 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. 12 సైంటిస్ట్-C, 141 సైంటిస్ట్-D పోస్టులు ఉండగా.. డిగ్రీ/MSc, ME/MTech/MPhil ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు సైంటిస్ట్-Cకు రూ.67,700-2,08,700.. సైంటిస్ట్-Dకు 78,800-2,09,200 జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.800. SC/ST/PwBD/మహిళలకు ఫీజు లేదు.

April 14, 2026 / 09:32 AM IST

భారీ జీతంతో ICAI ఉద్యోగాలు.. రేపే లాస్ట్?

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI)లో 109 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. 1 డైరెక్టర్-లీగల్, 108 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు ఉండగా.. లా డిగ్రీ, CA, BE/BTech, CS, PhD ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగానుభవం గలవారు  అప్లై చేసుకోవచ్చు. డైరెక్టర్‌కు నెలకు రూ.2,05,400-2,24,400.. ఎగ్జిక్యూటివ్‌కు రూ.56,100-1,77,500 వేతనం ఉంటుంది.

April 14, 2026 / 08:53 AM IST

రేపటి నుంచి టెట్ దరఖాస్తులు

TG: నిన్న విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)-2026 తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అభ్యర్థులు రేపటి నుంచి ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పరీక్షలు జూన్ 15-30 తేదీల్లో జరగనున్నాయి. ఫలితాలు జూలై 28-31 మధ్య వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. సర్వీసులో ఉన్న టీచర్లు కూడా టెట్ రాయాల్సి ఉండటంతో ఈ సారి కనీసం 30 వేల మంది దరఖాస్తు చేసుకుంటారని అంచనా.

April 14, 2026 / 08:18 AM IST

పెరిగిన ఇంటర్ రీ-వెరిఫికేషన్ ఫీజు.. ఎంతంటే?

TG: ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోర్డు షాక్ ఇచ్చింది. జవాబుపత్రాల పునః పరిశీలన(Re-Verification) ఫీజును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఒక్కో పేపర్‌కు రూ.600గా ఉన్న రుసుమును ఏకంగా రూ.800కు పెంచింది. అంటే ప్రతి పేపర్‌కు రూ.200 అదనపు భారం పడనుంది. ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని రీ-వెరిఫికేషన్ కోరుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఈ నిర్ణయం భారంగా మారనుంది.

April 14, 2026 / 07:32 AM IST