• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక

TG: ఇంటర్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ముందుగా ప్రశాంతంగా ఉండాలి. హాల్ టికెట్, పెన్నులు సిద్ధం చేసుకుని 30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి, తెలిసిన సమాధానాలను ముందుగా రాయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన పాయింట్లను అండర్ లైన్ చేస్తే మంచి మార్కులు వస్తాయి. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు తప్పకుండా రాయండి. ALL THE BEST.

February 25, 2026 / 06:42 AM IST

టాప్ 20లో రెండు ఇండియన్ యాప్స్

భారత్‌లో రోజువారీ యాక్టివ్ యూజర్లు అత్యధికంగా ఉన్న టాప్ 20 యాప్స్‌లో రెండు భారతీయ యాప్స్‌ చోటు దక్కించుకున్నాయి. ఆ రెండు యాప్స్‌లో డిజిటల్ పేమెంట్స్ యాప్ ‘ఫోన్ పే’, స్ట్రీమింగ్ యాప్ ‘జియో హాట్‌స్టార్’ ఉన్నాయి. వాట్సాప్ 83.5 కోట్ల వినియోగదారులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. గూగుల్, యూట్యూబ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

February 24, 2026 / 08:16 PM IST

విద్యార్థులకు కనకమహాలక్ష్మి దర్శనం

VZM: గరివిడి మండలం శ్రీరామ్ నగర్‌లోని ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో ఉన్న సుమారు 95 మంది బధిర విద్యార్థులకు చీపురుపల్లి DSP రాఘవులు ఆధ్వర్యంలో కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం మంగళవారం కల్పించారు. దర్శనం అనంతరం ప్రసాదాలు అందించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని వారికి సూచించారు. విద్యార్థులను సురక్షితంగా తిరిగి సెంటర్‌కు చేర్చారు.

February 24, 2026 / 04:51 PM IST

BREAKING: పరీక్షల షెడ్యూల్ విడుదల

TG: టీజీపీఈ-సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 2 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మే 5 వరకు దరఖాస్తు చేసుకొవచ్చని వెల్లడించారు. మే 31 నుంచి జూన్ 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

February 24, 2026 / 04:51 PM IST

ఇంటర్, SSC విద్యార్థులకు GOOD NEWS

TG: ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్, SSC పరీక్షలకు 5 నిమిషాలు ఆలస్యంగా హాజరుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. పరీక్షలో అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

February 24, 2026 / 04:25 PM IST

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,068.74 పాయింట్లు నష్టపోయి 82225.92 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 288.35 పాయింట్ల నష్టంతో 25424.65 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.94గా ఉంది.

February 24, 2026 / 03:43 PM IST

7,600 బ్యాటరీతో ‘ఐకూ 15R’

ప్రముఖ మొబైల్ కంపెనీ ఐకూ.. ‘ఐకూ 15R’ పేరిట కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో 7,600mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్, 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 16, ఆరిజిన్ OS 6, IP68, IP69 రేటింగ్, వెనక వైపు 50MP+08MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 8GB+256GB వేరియంట్ ధరను రూ.44,999గా కంపెనీ నిర్ణయించింది.

February 24, 2026 / 02:14 PM IST

GOOD NEWS: SBI లో 116 ఉద్యోగాలు

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే నిపుణులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 116 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు జరగనున్నాయి. అర్హులైన వారు మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

February 24, 2026 / 01:22 PM IST

కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 985 పాయింట్లు పతనమై 82,308 వద్ద, నిఫ్టీ 288 పాయింట్లు నష్టపోయి 25,424 వద్ద కొనసాగుతున్నాయి. US అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ నిర్ణయాలు, ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్ల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ముఖ్యంగా AI ప్రభావం, టారిఫ్ భయాలతో ఐటీ రంగానికి చెందిన ఇన్ఫోసిస్, TCS వంటి సంస్థలు 3 శాతం మేర నష్టపోయాయి.

February 24, 2026 / 12:30 PM IST

పాఠ్యపుస్తకాల్లో అవినీతిపై పాఠం

NCERT సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 8వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేస్తూ కొత్త అంశాలను చేర్చింది. “న్యాయ వ్యవస్థ” అనే అధ్యాయంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని తొలిసారిగా పరిచయం చేసింది. విద్యార్థులకు దేశంలోని న్యాయ వ్యవస్థలో సవాళ్లు, లోపాలను కూడా వివరించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

February 24, 2026 / 11:28 AM IST

BREAKING: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.430 పెరిగి రూ.1,61,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 పెరిగి రూ.1,48,300 పలుకుతోంది. ఇక, కిలో వెండి ధర రూ.10,000 తగ్గి రూ.2,90,000కు చేరింది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

February 24, 2026 / 09:49 AM IST

భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 694.13 పాయింట్లు నష్టపోయి 82600.53 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 201.90 పాయింట్ల నష్టంతో 25511.10 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.96గా ఉంది.

February 24, 2026 / 09:39 AM IST

564 పోస్టులు.. మంత్రివర్గం ఆమోదం

TG: వైద్యారోగ్యశాఖలో 434 పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేసిన 14 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో ఒక్కోదానికి 31 చొప్పున పోస్టులున్నాయి. వైద్యారోగ్య నియామక మండలి భర్తీ చేయనుంది. వీటితో పాటు జలమండలికి 130 పోస్టులు మంజూరు చేసింది. ఇందులో మేనేజర్, ఇంజనీర్ పోస్టులున్నాయి. వీటిని TGPSC ద్వారా భర్తీ చేస్తారు.

February 24, 2026 / 09:06 AM IST

హాల్ టికెట్లు ఇవ్వకపోతే.. కఠిన చర్యలు!

TG: రేపటి నుంచి ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 30 నిమిషాల ముందే రావాలని అధికారులు సూచించారు. వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్రలపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా విద్యార్థులను పరీక్ష హాల్‌కు అనుమతించాలని తెలిపారు. విద్యార్థులకు కళాశాల మేనేజ్ మెంట్ హాల్ టికెట్లు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

February 24, 2026 / 08:59 AM IST

భారీ జీతంతో ESIC పోస్టులు.. అప్లై చేశారా?

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC)లో 40 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. 5 ప్రొఫెసర్, 15 అసోసియేట్ ప్రొఫెసర్, 20 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండగా.. MSc/MD/MS/DNB/DM/MCh/PhDలో ఉత్తీర్ణత, పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతంగా పోస్టును బట్టి రూ.1,30,797 నుంచి రూ.2,22,543 వరకు చెల్లిస్తారు.

February 24, 2026 / 06:00 AM IST