AP: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ పాలిసెట్-2026 ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉ.11:00 గంటల నుంచి మ.1:00 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్లను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.