సిబ్బంది వస్త్రధారణ విషయంలో ఇండిగో కొత్త రూల్స్ తెచ్చిందంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. తిలకం, సింధూరం, మంగళసూత్రం వంటి వాటిపై ఆంక్షలు విధించినట్లు వార్త చక్కర్లు కొడుతుంది. వీటిపై ఇండిగో స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేసింది. తప్పుడు వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరింది. వస్త్రధారణ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది.