HYD: నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ మెరిట్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ప్రకటించారు. దీని ద్వారా వివిధ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సులను ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. ఎంపికైన వారికి కోర్సు ఫీజులో రూ. లక్ష వరకు రాయితీ కల్పిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ...
AP హైకోర్టు 300 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సెక్షన్ ఆఫీసర్స్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్, ఆఫీస్ సబార్డినేట్ తదితర పోస్టులు ఉండగా.. ఆసక్తిగల వారు ఈ నెల 19వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థుల వయసు 18-42 మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
నిరుద్యోగులకు TCS శుభవార్త చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. డిమాండ్ను బట్టి మరింత మందిని నియమించుకునే అవకాశం ఉందని చెప్పింది. 2025-26లో 44 వేల మందికిపైగా యువతకు అవకాశం కల్పించింది. అయితే అదే ఏడాది 12 వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.
రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(RCF Ltd) 188 ఆపరేటర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. BSc(కెమిస్ట్రీ), AOCP ట్రేడ్లో ఉత్తీర్ణత లేదా కెమికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో 3 ఏళ్ల డిప్లొమా+BOAT అప్రెంటిస్షిప్ పూర్తి చేసినవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు ఈ నెల 24తో ముగియనుంది. ట్రైనీ శిక్షణ కాలంలో రూ.22 వేలు, ఆపై రూ.47,800 వేతనం చెల్లిస్తారు.
TG: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు అత్యంత వేగంగా, సులభంగా HIT TV యాప్లో ఫలితాలను ఇప్పుడే చెక్ చేసుకోండి. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోండి. SHARE IT
TG: ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 66.20 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. సెకండ్ ఇయర్లో 70.58 శాతం మంది పాసయ్యారు. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో బాలికలు 74.43 శాతం పాసవగా.. బాలురు 57.69 మంది పాసయ్యారు. రెండవ సంవత్సరంలో 81.78 శాతం బాలికలు పాసవగా.. 68.99 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు.
TG: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే విడుదల చేశారు. మీ ఫలితాలను HIT TV యాప్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోండి.
TG: ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాల ప్రక్రియను ఉన్నత విద్యామండలి ప్రారంభించింది. ఈనెల 13న డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. మూడు విడతల్లో సీట్ల భర్తీ, 15 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వారం తర్వాత నుంచి వెబ్ ఆప్షన్లు ఉంటాయని పేర్కొన్నారు.
AP: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను ఈనెల 18 లేదా 19వ తేదీన విడుదల చేయాలని ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా.. ఫలితాల విడుదలకు ప్రాసెస్ కొనసాగుతోంది. ఈనెల 16వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు. ఈనెల 18 ఎక్కువశాతం ఫలితాలు విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఫలితాలపై అధికారిక ప్రకటన రానుంది.
TG: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో అధికారులు ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఈసారి దాదాపు 9.50 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. విద్యార్థులు HIT TV యాప్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. SHARE IT
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,840గా ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల తులం ధర రూ.1,40,100 వద్ద కొనసాగుతోంది. వెండి కూడా కిలో రూ.2,65,000 వద్ద స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.
TG: సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలు, కస్తూర్బా, మోడల్ స్కూల్, గిరిజన పాఠశాలల్లోని విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ కిట్లు అందించేందుకు జారీ చేసిన 9 టెండర్లకు బిడ్ల దాఖలు గడువును ఈ నెల 17 వరకు ఎస్సీ గురుకుల సొసైటీ పొడిగించింది. సాంకేతిక బిడ్ల పరిశీలన అదే రోజు పూర్తవుతుంది. ఆర్థిక బిడ్లను ఈ నెల 20న తెరవనుంది.
ఇంటర్ ఫలితాల సందర్భంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కొత్త పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించాలని విద్యాశాఖ సన్నాహాలు చేసినా.. దానికి బ్రేక్ పడినట్లు సమాచారం. వాస్తవానికి గత విద్యాసంవత్సరంలోనే సిలబస్ మార్చాలని చూసినా.. చివరి నిమిషంలో పుస్తకాల ముద్రణకు సమయం సరిపోదని ఈ ఏడాదికి వాయిదా వేసింది. అయితే ఈ ఏడాది కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది.
JEE మెయిన్ 2026 తుది విడత పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. దాదాపు 11.23 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల కీపై అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 11:50 గంటల వరకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి అభ్యంతరానికి రూ.200 ఫీజు చెల్లించాలి. నిపుణుల కమిటీ వీటిని పరిశీలించిన తర్వాత ఏప్రిల్ 20 నాటికి తుది ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
Gmail వినియోగదారులకు గూగుల్ అదిరిపోయే శుభవార్త అందించింది. వాట్సాప్ తరహాలో ‘ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్’ ఫీచర్ను మొబైల్ యాప్లోనూ అందుబాటులోకి తెచ్చింది. దీంతో పంపేవారు, స్వీకరించేవారు తప్ప మధ్యలో మరెవరూ మెయిల్స్ చదవలేరు. ప్రస్తుతం వర్క్స్పేస్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్, వ్యక్తిగత సమాచారానికి, వ్యాపార లావాదేవీలకు భద్రతను కల్పిస్తుంది.