దేశంలో తొలి LED క్రెడిట్ కార్డు అందుబాటులోకి వచ్చింది. చెక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ట్యాప్ టూ పే సమయంలో కార్డులో అమర్చిన దీపాలు వెలుగుతాయని ఇరు సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. ఈనెల 28 నుంచి కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నగదు చెల్లింపులను స్పష్టంగా, ఆకర్షణీయంగా చేస్తుందని పేర్కొన్నారు.