MDK: రామాయంపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి ఓఆర్ఎస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఎండలు ముదురుతున్నందున గర్భిణీలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆయన సూచించారు. వడదెబ్బ బారిన పడకుండా ఆసుపత్రికి వచ్చే రోగులు, పిల్లలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు వాడుతూ అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.