నాలుగో త్రైమాసికంలో రూ.16,971 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.19,407 కోట్లతో పోలిస్తే లాభంలో 12.5 శాతం క్షీణత నమోదు కావటం గమనార్హం. 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.80,775 కోట్ల నికర లాభం వచ్చినట్లు తెలిపింది. దీంతో ఒక్కో షేరుకు రూ.6 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు అంగీకరించింది.