న్యూఇయర్ సందర్భంగా JIO కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టింది. రూ.3,599తో రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు రోజూ 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100SMSలు లభిస్తాయి. రూ.35,100 విలువైన Google Gemini Pro ప్లాన్ కూడా 18 నెలలపాటు ఉచితం. 500తో 28 రోజులు 2GB, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMSలు, పలు OTT ప్లాట్ఫామ్స్ సబ్ స్క్రిప్షన్స్ ఫ్రీ. రూ.103తో 28 రోజులపాటు 5GB డేటా పొందొచ్చు.
ఆదివారం వచ్చిందంటే ముక్క లేనిదే ముద్ద దిగదు. ఈరోజు హైదరాబాద్లో స్కిన్లెస్ చికెన్ రూ.280 వరకు పలుకుతుండగా, స్కిన్తో రూ.260గా ఉంది. విజయవాడలో స్కిన్లెస్ రూ.270, స్కిన్తో రూ. 260గా ఉంది. కామారెడ్డి, నరసరావుపేటలో రూ.250గా ఉంది. ఇక కామారెడ్డిలో మటన్ రూ.800 ఉంది. గుంటూరులో రూ.240-260 మధ్యలో అమ్ముతున్నారు. మరి మీ ఏరియాలో రేట్లు ఎలా ఉన్నాయి?
ఆదివారం వచ్చిందంటే ముక్క లేనిదే ముద్ద దిగదు. ఈరోజు హైదరాబాద్లో స్కిన్లెస్ చికెన్ రూ.280 వరకు పలుకుతుండగా, స్కిన్తో రూ.260గా ఉంది. విజయవాడలో స్కిన్లెస్ రూ.270, స్కిన్తో రూ. 260గా ఉంది. కామారెడ్డి, నరసరావుపేటలో రూ.250గా ఉంది. ఇక కామారెడ్డిలో మటన్ రూ.800 ఉంది. గుంటూరులో రూ.240-260 మధ్యలో అమ్ముతున్నారు. మరి మీ ఏరియాలో రేట్లు ఎలా ఉన్నాయి?
ఏఐ వల్ల ఉద్యోగాలు పోవని మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ అభిప్రాయపడ్డారు. అయితే, ఆ సాంకేతికతను నేర్చుకోవడానికి వెనకాడితే మాత్రం భవిష్యత్తు ఉండకపోవచ్చని తెలిపారు. స్థిరమైన, దీర్ఘకాలం పాటు వృత్తి జీవితాలను కొనసాగించే చివరి తరం మనదే అవుతుందన్నారు. మనం ఇప్పుడు రోజూ పోరాటం చేయాల్సిందేనని.. కొత్త విషయాలను నేర్చుకోవాల్సిందేనని చెప్పుకొచ్చారు.
TG: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు ఉదయం నుంచి రెండుసార్లు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఉదయం నుంచి రూ.2,450 పెరిగి రూ.1,33,200కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,250 ఎగబాకి రూ.1,22,100 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,15,000గా ఉంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలున్నాయి.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను ప్రకటించింది. మిస్డ్కాల్స్కు వాయిస్ మెయిల్ సదుపాయంతో పాటు మెటా ఏఐతో ఇమేజ్ క్రియేషన్, ఫన్నీ స్టేటస్ స్టిక్కర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే, డెస్క్టాప్లో వాట్సాప్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కొత్త మీడియా ట్యాబ్ అందిస్తున్నట్లు వెల్లడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 443.41 పాయింట్ల లాభంతో 85,261.54 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 134.90 పాయింట్ల లాభంతో 26,033.45 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.07గా ఉంది.
దేశీయ కరెన్సీ రూపాయి విలువ మరింత పతనమైంది. శుక్రవారం రూపాయి విలువ మరింత తగ్గి ఆల్టైమ్ కనిష్టానికి చేరుకుంది. డాలర్తో పోలిస్తే మారకపు విలువ 20 పైసలు పతనమై రూ.90.52కు చేరుకుంది.
దేశీయ కరెన్సీ రూపాయి విలువ మరింత పతనమైంది. శుక్రవారం రూపాయి విలువ మరింత తగ్గి ఆల్టైమ్ కనిష్టానికి చేరుకుంది. డాలర్తో పోలిస్తే మారకపు విలువ 20 పైసలు పతనమై రూ.90.52కు చేరుకుంది.
TG: వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల పరిధిలో ప్రవేశాల కౌన్సెలింగ్ ముగిసింది. అగ్రివర్సిటీ పరిధిలో 1,800 సీట్లను భర్తీ చేశారు. మొత్తం సీట్లలో రైతు కుటుంబాల పిల్లలకు 450, రైతు కూలీల పిల్లలకు 150, NRI కోటాలో 150, ప్రత్యేక కోటాలో 400, ఐకార్ కోటాలో 120 మంది చొప్పున సీట్లు పొందినట్లు వీసీ అల్దాస్ జానయ్య వెల్లడించారు.
TCL నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చింది. రూ.1.10 లక్షల విలువైన 55 అంగుళాల 4K QLED టీవీ ఇప్పుడు ఏకంగా 66% డిస్కౌంట్తో కేవలం రూ.36,990కే అమెజాన్లో లభిస్తోంది. HDFC కార్డుతో మరో రూ.3,000 తగ్గుతుంది. 144Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ అట్మాస్ సౌండ్, గూగుల్ టీవీ వంటి హైఎండ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. తక్కువ రేటుకు బెస్ట్ టీవీ కావాలంటే ఇదే ఛాన్స్.
బంగారం ధరలు ఉదయం తగ్గి సాయంత్రానికి భగ్గుమన్నాయి. హైదరాబాద్లో గంటల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయింది. 24 క్యారెట్ల తులం బంగారం రూ.440 పెరిగి ఏకంగా రూ.1,30,750కి చేరగా, 22 క్యారెట్ల ధర రూ.1,19,850 వద్ద ఉంది. ఇక వెండి కిలో రూ.2,09,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇదే రేట్లు ఉండటంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు.
వరుసగా మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిసి ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. సెన్సెక్స్ 426.86 పాయింట్లు ఎగబాకి 84,818 వద్ద ముగియగా.. నిఫ్టీ 140.55 పాయింట్లు లాభపడి 25,899 వద్ద స్థిరపడింది. ఇన్నాళ్లు పడుతూ లేస్తూ వచ్చిన సూచీలు.. ఈరోజు కొనుగోళ్ల మద్దతుతో గ్రీన్ జోన్లో ముగిశాయి.
VSP: సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో నెలగంట ఉత్సవాన్ని ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 1:01కు శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నట్లు ఆలయ సభ్యులు తెలిపారు. ఈ ధనుర్మాసంలో ఆలయంలో 10 రోజులు పగల్ పత్తు, మరో 10రోజులు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. మరో ఐదు రోజులు దారోత్సవాలు, ధనుర్మాసం సందర్భంగా నెలరోజులు తిరుప్పావై పాశురాల పఠనం చేస్తారన్నారు.
VSP: ఫ్రీ బస్ పథకం వల్ల విశాఖలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. కాలేజీలు, ఆఫీసు టైముల్లో రద్దీ తీవ్రంగా ఉంది. మొత్తం 736 RTC బస్సుల్లో 575 బస్సులు ఫ్రీ బస్ పథకంలో నడుస్తున్నాయి. ముందుగా 60% పురుషులు, 40% మహిళలు ప్రయాణించగా ఇప్పుడు 75% మహిళలే వస్తున్నారు. మరో 170 బస్సులు పెరిగితే రద్దీ తగ్గుతుందని ఆర్ఎం బి. అప్పలనాయుడు చెప్పారు.