AP: ఏటా వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, పోస్టుల హేతుబద్ధీకరణకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. టీచర్ల బదిలీలకు మే 30 వరకు ఉన్న సర్వీసును పరిగణనలోకి తీసుకోనున్నారు. ఏప్రిల్ 30 వరకు పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టుల హేతుబద్ధీకరణ జరగనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,110 తగ్గి రూ.1,64,510కు చేరగా, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.2,850 తగ్గి రూ.1,50,800గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.20,000 తగ్గి రూ.2,95,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ జోరుతో భారత రూపాయి విలువ చారిత్రక కనిష్టానికి పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే రూపాయి విలువ ఏకంగా 67 పైసలు క్షీణించి, డాలర్తో పోలిస్తే 92.17 వద్ద ముగిసింది. ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఈ పతనానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. రూపాయి బలహీనపడటంతో దిగుమతులపై భారం పెరిగి, నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉంది.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) గ్రీన్ కెమికల్ విభాగంలో 4 సీనియర్ మేనేజర్, 4 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. కెమికల్ ఇంజినీరింగ్లో డిగ్రీ, పని అనుభవం గలవారు ఈ నెల 16 వరకు అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన మేనేజర్లకు రూ.90,000-2,40,000.. ఇంజినీర్లకు రూ.50,000-1,60,000 జీతం చెల్లిస్తారు.
తిరుమల తిరుపతి దేవస్థానాలు(TTD) ఆస్పత్రుల్లో 8 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఇవాళ ఇంటర్వ్యూ జరగనుంది. MBBS/MS/MDలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అర్హులు. తిరుపతిలోని సెంట్రల్ హాస్పిటల్లో ఇంటర్వ్యూ జరగనుండగా.. ఎంపికైనవారికి నెలకు రూ.53,495 జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
దేశవ్యాప్తంగా రేపటి నుంచి ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఐఏటీ)కి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. తుది గడువు ఏప్రిల్ 13తో ముగుస్తుంది. ప్రవేశ పరీక్ష జూన్ 7న నిర్వహిస్తారు. ఏపీలోని తిరుపతితో పాటు తిరువనంతపురం, కోల్కతా, భోపాల్, పూణె, మొహాలి, బెర్హంపూర్లో ఐసర్లు ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్(BS), బీటెక్తో పాటు BS-MS ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఉన్నాయి.
భారతదేశానికి సహజవాయువు సరఫరాదారుగా ఉన్న ఖతార్, ఇరాన్ దాడులతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్కు ఖతార్ LNG ఎగుమతులను 40% వరకు తగ్గించింది. ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తిదారుగా ఉంది. ఖతార్ నుంచి ఎగుమతి అవుతున్న నాచురల్ గ్యాస్ వినియోగదారుల్లో భారత్ అతిపెద్దది. భారతదేశం ఏటా సుమారు 27 మిలియన్ టన్నుల లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ను దిగుమతి చేసుకుంటుంది.
ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెను సవాళ్లను విసురుతోంది. దాదాపు 88% చమురును దిగుమతి చేసుకునే భారత్కు ఇది మరింత తీవ్ర సమస్యగా మారింది. తాజాగా, హెూర్ముజ్ జలసంధిని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో భారత్కు చమురు కొరత ఏర్పడుతుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
భారతదేశంలో ఎక్స్ వేదికపై అశ్లీల కంటెంట్పై నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనివల్ల చాలామంది వినియోగదారులు ఆ కంటెంట్ను చూడలేకపోతున్నారు. ఇది మస్క్ నిర్ణయమా, ప్రభుత్వ నిబంధనలా అనే చర్చ మొదలైంది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. దేశ డిజిటల్ చట్టాల నేపథ్యంలో ఈ కీలక మార్పు చోటుచేసుకుంది.
BDK: పినపాక మండలం తోగ్గూడెం అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in నుంచి పొందవచ్చని తెలిపింది. హాల్ టికెట్లో పేరు, రోల్ నంబర్, ఫొటో వంటి వివరాలను సరిచూసుకోవాలని.. ఏవైనా తప్పులుంటే పాఠశాల అధికారులకు తెలపాలని సూచించింది. కాగా, మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్లో బ్యారెల్ చమురు ధర 79.44 డాలర్లకు చేరుకుంది. నిన్న ఈ కాంట్రాక్టులు అత్యధికంగా 82.37 డాలర్లకు తాకినట్లు అధికారులు తెలిపారు. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.40 డాలర్లు తాకింది.
ఏపీ ఈఏపీసెట్-2026 దరఖాస్తు గడువును ఈనెల 17 వరకూ పొడిగించినట్లు సెట్ కన్వీనర్ మోహనరావు వెల్లడించారు. రూ.1,000 ఆలస్య రుసుముతో ఈనెల 21 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 3 వరకు గడువు ఉందని తెలిపారు. తప్పుల సవరణకు వచ్చే నెల 4 నుంచి 6 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు cets.apsche.ap.gov.in/eapcet వెబ్సైట్ను చూడాలని సూచించారు.
విద్యార్థులు NCERT పాఠ్యపుస్తకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలో సుమారు 90 శాతం కంటే ఎక్కువ ప్రశ్నలు వీటి నుంచే వస్తాయి. డయాగ్రమ్స్, పట్టికలు వదలకుండా నేర్చుకోవాలి. వీటిలోని సమాచారం ఆధారంగా ప్రశ్నలుండవచ్చు. బయాలజీలో స్మార్ట్ స్టడీ టెక్నిక్ను అమలు చేయాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీని కాన్సెప్టుల వారీగా చదవాలి. చదివిన అంశాలను వారం రోజులకొకసారి రివిజన్ చేసుకోవాలి.
కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL), నిరుద్యోగులకు భారీ ఊరటనిస్తూ 667 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెక్నీషియన్, మైనింగ్ సిర్దార్, సర్వేయర్ వంటి కీలక విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.