BDK: పినపాక మండలం తోగ్గూడెం అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.