అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్లో బ్యారెల్ చమురు ధర 79.44 డాలర్లకు చేరుకుంది. నిన్న ఈ కాంట్రాక్టులు అత్యధికంగా 82.37 డాలర్లకు తాకినట్లు అధికారులు తెలిపారు. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.40 డాలర్లు తాకింది.
ఏపీ ఈఏపీసెట్-2026 దరఖాస్తు గడువును ఈనెల 17 వరకూ పొడిగించినట్లు సెట్ కన్వీనర్ మోహనరావు వెల్లడించారు. రూ.1,000 ఆలస్య రుసుముతో ఈనెల 21 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 3 వరకు గడువు ఉందని తెలిపారు. తప్పుల సవరణకు వచ్చే నెల 4 నుంచి 6 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు cets.apsche.ap.gov.in/eapcet వెబ్సైట్ను చూడాలని సూచించారు.
విద్యార్థులు NCERT పాఠ్యపుస్తకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలో సుమారు 90 శాతం కంటే ఎక్కువ ప్రశ్నలు వీటి నుంచే వస్తాయి. డయాగ్రమ్స్, పట్టికలు వదలకుండా నేర్చుకోవాలి. వీటిలోని సమాచారం ఆధారంగా ప్రశ్నలుండవచ్చు. బయాలజీలో స్మార్ట్ స్టడీ టెక్నిక్ను అమలు చేయాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీని కాన్సెప్టుల వారీగా చదవాలి. చదివిన అంశాలను వారం రోజులకొకసారి రివిజన్ చేసుకోవాలి.
కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL), నిరుద్యోగులకు భారీ ఊరటనిస్తూ 667 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెక్నీషియన్, మైనింగ్ సిర్దార్, సర్వేయర్ వంటి కీలక విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
TG: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు విద్యాశాఖ పొడిగించింది. 6వ తరగతిలో పూర్తిస్థాయి సీట్లను భర్తీ చేయనుండగా 7, 8, 9, 10వ తరగతులలో మిగిలి ఉన్న ఖాళీ సీట్లను ఈ ప్రవేశాల ద్వారా భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఆసక్తి గల విద్యార్థులు https://tgms.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
E.G: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 9న హెటిరో డ్రగ్స్, ఎంఆర్ఎఫ్ టైర్స్ సంస్థల ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య పి.ప్రసన్నశ్రీ తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చదివిన 18-25 ఏళ్ల పురుష అభ్యర్థులు వీటికి అర్హులన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఇరాన్-అమెరికా యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమన్నాయి. ముడి చమురు ధర 80 డాలర్ల పైనే ట్రేడ్ అవుతోంది. దీంతో దేశీయంగా చమురు రంగ షేర్లు పతనమయ్యాయి. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ 5 శాతం మేర కుంగింది. మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ వంటి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు హర్ముజ్ జలసంధిలో నౌకల రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో ధరలు 10 శాతం మేర పెరిగాయి.
దేశీయ స్టార్ మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 1,565.54 పాయింట్ల నష్టంతో 79,721.65 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 500 పాయింట్ల నష్టంతో 24,698.50 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్- 30లో BEL, సన్ఫార్మా, భారతీ ఎయిర్టెల్ మినహా మిగిలిన అన్ని స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UOH) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 47 ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఫ్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండగా.. PG, MPhil, PhD ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు ఈ నెల 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.1000. SC/ST/PwBDలకు మినహాయింపు కలదు. వెబ్సైట్: uohyd.ac.in
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,290 తగ్గి రూ.1,69,800కు చేరింది. అలాగే, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,000 తగ్గి రూ.1,55,650గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.10,000 తగ్గి రూ.3,15,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లపై ఇవాళ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పడింది. దీంతో ఉదయం భారీ నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1100 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. నిఫ్టీ 300 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 24 పైసలు తగ్గి రూ.91.32గా ఉంది.
భారతీయ రైల్వేలో 22,195 గ్రూప్-డీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్లలోనూ ఖాళీలు ఉండగా.. SCR(సికింద్రాబాద్)లో 1012 ఉన్నాయి. పదో తరగతి, సంబంధిత ట్రేడులో ITI అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. ఫీజ్ చెల్లింపునకు ఎల్లుండి చివరి తేదీ కాగా, 5-14 తేదీల్లో అప్లికేషన్ సవరణ చేసుకోవచ్చు.
రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1, 3 రాత పరీక్షలు మార్చి 6, 9, 10, 13 తేదీల్లో జరగనున్నాయి. అభ్యర్థులు ముందుగా తమ పరీక్షా నగరాన్ని తెలుసుకునేందుకు వీలుగా బోర్డు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులు వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయి.