భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) డేటా బేస్ నుంచి ఆధార్కార్డు హోల్డర్ల డేటా దుర్వినియోగం జరగలేదని కేంద్రం స్పష్టం చేసింది. అధునాతన భద్రతా చర్యల కారణంగా పౌరుల ఆధార్ డేటా సురక్షితంగా ఉందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు వెల్లడించింది. ఈ మేరకు కేంద్రమంత్రి జితిన్ ప్రసాద లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.
టాటా మోటార్స్ ఐకానిక్ SUV సియెర్రా రీఎంట్రీ భారత మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. బుకింగ్స్ నిన్న ప్రారంభమవగా.. మొదటిరోజే 70వేలకు పైగా కస్టమర్లు ఈ కారును బుక్ చేసుకున్నారు. మరో 1.35 లక్షల మంది తమకు నచ్చిన వేరియంట్లను సెలక్ట్ చేసుకున్నారు. ఈ కారు ధర(Ex.Showroom) రూ.11.49 లక్షల నుంచి 21.29 లక్షల వరకు ఉంది. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఈ కార్లు రోడ్లెక్కనున్నాయి.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సీబీటీ-2 2024(CEN 06/2024) పరీక్షల అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈనెల 20 నుంచి సీబీటీ-2 పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డులు పొందచచ్చు. మొత్తం 51,978 మంది అభ్యర్థులకు సీబీటీ-2కు ఎంపికయ్యారు.
TG: ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో ఇంటర్ బోర్డు స్వల్ప మార్పులు చేసింది. మార్చి 3న జరగాల్సిన ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను మార్చి 4న నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 3న హోలీ ఉండటంతో పరీక్షల తేదీలో మార్పు చేసినట్లు వెల్లడించింది. మిగతా పరీక్షలు యథాతథంగా నిర్వహించనున్నట్లు పేర్కొంది.
GDWL: గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని బీఆర్ఎస్ గద్వాల జిల్లా అధ్యక్షుడు బాసు హనుమంతు నాయుడు పేర్కొన్నారు. గట్టు మండలం సల్కాపురం గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన నూతన సర్పంచ్ బోయ తిమ్మప్ప, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్దే రాజ్యమని ఆయన అన్నారు.
TG: టెట్ పరీక్షల పూర్తిస్థాయి షెడ్యూల్ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. జనవరి 3 నుంచి జనవరి 20, 2026 వరకు నిర్వహించనుంది. పరీక్షలు ఆన్లైన్ మోడ్లో నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయని తెలిపింది. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహించనున్నారు.
స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. ఇప్పటికే ప్రపంచ కుబేరుడుగా కొనసాగుతున్న మస్క్ సంపదన తాజాగా మరింత పెరిగింది. స్పేస్ఎక్స్ సంస్థ IPOకు వెళ్లనున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో ఆయన సంపదను 600 బిలియన్ డాలర్లకు పెరిగింది. కేవలం ఒక్క రోజులోనే 168 బిలియన్ డాలర్లు పెరిగి.. 600 బిలియన్ డాలర్ల మార్క్ను దాటేసినట్లు ఫోర్బ్స్ పేర్కొంది.
రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో డాలరుతో రూపాయి మారకం విలువ ఆల్టైమ్ కనిష్ఠ స్థాయికి చేరింది. ఇవాళ ఇంట్రాడే ట్రేడింగ్లో రూపాయి విలువ మరో 5 పైసలు పతనమై రూ.90.83 వద్దకు చేరుకుంది. రూపాయికి ఇప్పటివరకు ఇదే కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.
ATP: ఎస్కేయూ పరిధిలో పీజీ కోర్సు ఎంబీఏ(జనరల్) మూడో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం నుంచి నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగ డైరెక్టర్ జీవీ రమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 16 వరకూ రోజుమార్చి రోజు పరీక్షలు ఉంటాయన్నారు. ఎంబీఏ (ఫైనాన్స్) మూడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 31 వరకూ ఎస్కేయూ, అనుబంధ కళాశాలల్లో నిర్వహిస్తామన్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా రవి రంజన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఎండీగా ఉన్న వినయ్ ఎమ్ టోన్సే స్థానంలో రవిరంజన్ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు రవి రంజన్ SBI డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించారు.
BSNL రూ.399కే హోమ్ బ్రాడ్ బాండ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 60 Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ పొందొచ్చు. దీనితో పాటు నెలకు 3300 జీబీ డేటా వస్తుంది. మొదటి నెల సర్వీస్ ఫ్రీగా లభిస్తుందని BSNL పేర్కొంది. మరో 3 నెలల పాటు రీఛార్జీలపై రూ.100 డిస్కౌంట్ ప్రకటించింది. 1800-4444 నంబర్కు వాట్సప్ ద్వారా ‘Hi’ అని మెసేజ్ చేయడం ద్వారా బుక్ చేసుకోవచ్చు.
బ్యాంకుల్లో, ప్రైవేటు సంస్థల్లో ‘అద్దె లేదా లీజ్’ పేరిట ఇలా బంగారాన్ని అప్పుగా ఇవ్వొచ్చు. దీనిపై ప్రైవేటు సంస్థలు అధిక వడ్డీ ఇస్తుండగా, బ్యాంకుల్లో తక్కువ వడ్డీ లభిస్తుంది. బంగారాన్ని పూచీకత్తుపై లీజ్కు ఇస్తే 2% వడ్డీ, పూచీకత్తు లేకుండా ఇస్తే 4% వడ్డీని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. SBI ఏడాదికి 0.50%, రెండేళ్ల వరకు 0.55%, మూడేళ్లకు 0.60% వడ్డీ చెల్లిస్తోంది.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) DRDO CEPTAM 11 నియామకాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా మొత్తం 764 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 01, 2026. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
దేశీయ కరెన్సీ రూపాయికి మళ్లీ దెబ్బ పడింది. డాలర్ ముందు నిలవలేక విలవిలలాడుతోంది. ఇవాళ ఇంట్రాడే ట్రేడింగ్లో ఏకంగా 26 పైసలు నష్టపోయి.. రూ.90.75 వద్ద ఆల్టైమ్ కనిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో మన కరెన్సీ పతనం కొనసాగుతూనే ఉంది. రూపాయి విలువ ఇంతలా పడిపోవడం మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
దేశీయ కరెన్సీ రూపాయికి మళ్లీ దెబ్బ పడింది. డాలర్ ముందు నిలవలేక విలవిలలాడుతోంది. ఇవాళ ఇంట్రాడే ట్రేడింగ్లో ఏకంగా 26 పైసలు నష్టపోయి.. రూ.90.75 వద్ద ఆల్టైమ్ కనిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో మన కరెన్సీ పతనం కొనసాగుతూనే ఉంది. రూపాయి విలువ ఇంతలా పడిపోవడం మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.