భారతీయ రైల్వేలో 22,195 గ్రూప్-డీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోన్లలోనూ ఖాళీలు ఉండగా.. SCR(సికింద్రాబాద్)లో 1012 ఉన్నాయి. పదో తరగతి, సంబంధిత ట్రేడులో ITI అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. ఫీజ్ చెల్లింపునకు ఎల్లుండి చివరి తేదీ కాగా, 5-14 తేదీల్లో అప్లికేషన్ సవరణ చేసుకోవచ్చు.