RBI పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడంతో పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు ఇవాళ ట్రేడింగ్ లో 8 శాతం కుప్పకూలాయి. NSEలో రూ.1,051.10 కనిష్టానికి చేరినప్పటికీ, తర్వాత పుంజుకుని 1 శాతం నష్టానికి పరిమితమయ్యాయి. ఈ నిర్ణయం తమ ఆర్ధిక స్థితిపై ప్రభావం చూపబోదని కంపెనీ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం షేరు రూ.1,127 వద్ద కొనసాగుతోంది.