MNCL: భూభారతి రెవెన్యూ సదస్సులలో ప్రజలు అందించిన దరఖాస్తుల పరిష్కారం ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు.