AP: విద్యార్థులకు RTC గుడ్ న్యూస్ చెప్పింది. పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లేందుకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. హాల్ టికెట్ చూపించిన ప్రతీ విద్యార్థి ఫ్రీగా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.