మామిడి ధరలు రైతులకు షాక్ ఇస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టన్ను తోతాపురి ధర రూ. 1.10 లక్షల వరకు ఉండగా, ప్రస్తుతం రూ.4-7 వేలకు పడిపోయింది. అదేవిధంగా బంగినపల్లి మామిడి ధర రూ.1.75 లక్షల నుంచి రూ.50-60 వేలకు కుప్పకూలింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ధరలు అమాంతం పడిపోయాయి.
TG: టీజీఎప్ సెట్- అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ప్రవేశ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. JNTUH ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 106 సెంటర్లను అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 4న రెండు సెషన్స్, 5న ఉదయం సెషన్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 90,958 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
TG: పదోతరగతి ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలుగు మీడియం విద్యార్థుల్లో 89.14 శాతం, ఇంగ్లీష్ మీడియం 95.86 శాతం, ఉర్దూ మీడియం విద్యార్థుల్లో 86.71 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 86.18 శాతం, ZP పాఠశాలల్లో 93.53 శాతం, మోడల్ పాఠశాలల్లో 97.83 శాతం, KGVB పాఠశాల్లో 98 శాతం ఉత్తీర్ణత సాధించారు.
TG: ఇవాళ విడుదలైన పదోతరగతి ఫలితాల్లో మొత్తం95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 5,731 పాఠశాలల్లో 100 శాతం పాస్ అవగా.. 6 పాఠశాలల్లో 0 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లాలో 99.30 శాతం పాస్ అవగా.. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 89.23శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
శ్రీవేంకటేశ్వర బాలమందిరం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు TTD దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. SV అనాథాశ్రమం పేరుతో 1943లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. వివరాలను ఏఈవో, శ్రీవేంకటేశ్వర బాలమందిరం, టీటీడీ భవానీనగర్, తిరుపతి – 517501 అడ్రస్కు పంపించాలి. దరఖాస్తులను స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ మే 16. వివరాలకు 0877-2264613 సంప్రదించాలి.
TG: టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ మా HIT TV తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, ఈ విజయం మీ ఉన్నత విద్యాభ్యాసానికి, కెరీర్కు బలమైన పునాది కావాలని ఆకాంక్షిస్తున్నాం. అదే సమయంలో, ఫలితాల విషయంలో నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.
TG: పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి కేవలం గ్రేడ్లు కాకుండా సబ్జెక్టుల మార్కులను కూడా అధికారులు ప్రకటించారు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్తో పాటు HIT TV యాప్లో సులభంగా, వేగంగా చెక్ చేసుకోవచ్చు. కాగా, మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పదోతరగతి పరీక్షలు జరిగాయి.
TG: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER), చండీగఢ్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. మొత్తం 134 ఖాళీలకు మే 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 22న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరగుతుంది.
TG: రాష్ట్రంలో కాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు అధికారులు రిలీజ్ చేయనున్నారు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్తో పాటు సులభంగా, వేగంగా HIT TV యాప్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. కాగా, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదోతరగతి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది 5 లక్షల 28 వేల 239 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 415 పాయింట్లు లాభపడి 77,302 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 125 పాయింట్ల లాభంతో 24,118 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.94.78గా ఉంది.
AP: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేయనున్నారు. మంత్రి లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రాసెస్ను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే పూర్తి చేసింది. ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది పరీక్షలు రాశారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్తో పాటు సులభంగా, వేగంగా HIT TV యాప్లో ఫలితాలు తెలుసుకోవచ్చు.
SRCL: ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 సంవత్సరానికి గాను యూనిట్లకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 30వ తేదీన చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చందుర్తి ఎంపీడీవో రాధ తెలిపారు. ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయన్నారు. మండలంలో 15 యూనిట్లకు గాను 61 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె తెలిపారు.
TG: టెట్ పరీక్ష దరఖాస్తులకు ఈనెల 30వ తేదీ చివరి గడువు అని కన్వీనర్ రమేష్ తెలిపారు. అభ్యర్థులు వెంటనే రుసుము చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇందులో పేపర్-1కు 21,826, పేపర్-2కు 59,271 మంది దరఖాస్తు చేయగా.. రెండు పేపర్లకూ 12,417 మంది అప్లై చేశారు. ఇప్పటి వరకు మొత్తం 93,514 దరఖాస్తులు అందాయి.
కేంద్ర ప్రభుత్వానికి విమానయాన సంస్థలు కీలక విజ్ఞప్తి చేశాయి. విమాన ఇంధన ధరలు పెరగడం వల్ల నిర్వహణ భారంతో సతమతమవుతోన్నట్లు విమానయాన సంస్థలు వాపోతున్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని.. సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి. కేంద్రం స్పందించకపోతే నిర్వహణ అసాధ్యమవుతోందని తెలిపాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే కంపెనీలు మూసేయాల్సి వస్తుందని చెప్పాయి.
TG: రాష్ట్రంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు పదోతరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్తో పాటు సులభంగా, వేగంగా HIT TV యాప్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. కాగా, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదోతరగతి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది 5 లక్షల 28 వేల 239 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.