కేరళం కొచ్చిలోని ICARకు చెందిన సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 8వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ (కంప్యూటర్ సైన్స్) లేదా ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు పీజీడీసీఏ కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు https://cmfri.org.in/career ను సంప్రదించాలి.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ యూనిట్ అయిన ‘ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమరియా’ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 టెన్యూర్ బేస్డ్ డెంజర్ బిల్డింగ్ వర్కర్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. నెలకు రూ.19,900 ప్రాథమిక వేతనంతో పాటు కరవు భత్యం (DA) & ఇతర ప్రయోజనాలు ఉంటాయి.
AP: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2026 ఈనెల 25న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఈనెల 9వ తేదీ వరకే ఉంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా, మొదట ఈనెల 4వ తేదీతో గడువు ముగియాల్సి ఉండగా, అధికారులు 9వ తేదీ వరకు గడువు పొడిగించారు.
టోల్ గేట్ల వద్ద ఏప్రిల్ 10 నుంచి నగదు చెల్లింపులు రద్దు కానున్నాయి. FASTag లేదా UPI ద్వారానే పేమెంట్స్ చేయాలి. UPIతో చేస్తే 1.25 రెట్లు ఎక్కువ చెల్లించాలి. ఈ రెండు ఆప్షన్లు పని చేయకపోతే వాహనదారుడికి ‘ఈ-నోటీస్’ వస్తుంది. 72 గంటల్లోపు ఆన్లైన్లో చెల్లిస్తే అదనపు ఫీజు ఉండదు. ఆ తర్వాత అయితే డబుల్ టోల్ కట్టాలి. 15 రోజులు దాటితే VAHAN సిస్టమ్ ద్వారా కఠిన చర్యలు తప్పవు.
డెహ్రాదూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో 8వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే గడువు ఇవాళ్టితో ముగియనుంది. దరఖాస్తు చేసుకోని విద్యార్థులు త్వరగా అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. 2027 జనవరి నాటికి ఏడో తరగతి ఉత్తీర్ణులైన లేదా ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 02.01.2014 – 01.07.2015 మధ్య జన్మించి ఉండాలి.
AP: కడప జిల్లాలో ఖాళీగా ఉన్న 171 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు జూలై 1, 2026 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత గల వారు ఆఫ్లైన్ విధానంలో ఈనెల13న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈనెల 23న సంబంధిత RDO కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
AP: రాష్ట్రంలో త్వరలో అప్రెంటిస్షిప్తో డిగ్రీ కోర్సులు ప్రభుత్వం ప్రారంభించనుంది. ఏఈడీపీని తెచ్చేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి అమలు చేసేందుకు యోచిస్తోంది. మూడేళ్ల డిగ్రీ సబ్జెక్టులు రెండేళ్లలోనే పూర్తి అయ్యేలా ప్రణాళిక రచిస్తోంది.
పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ ఆహార ధరల సూచీ ఆరునెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి చెందిన FIO ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే ఆహార ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతర్జాతీయ ఆహార ధరలు ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో 2.4 శాతం పెరిగి, 128.5 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరాయి. వంట నూనె, చక్కెర, గోధుమల ధరలు పెరిగాయి.
భారత్లో డంకిన్ డోనట్స్ వ్యాపారం ముగియనుంది. జుబిలెంట్ ఫుడ్ వర్క్స్తో ఉన్న ఒప్పందం 2026 డిసెంబర్తో ముగియనుండటమే దీనికి కారణం. ఆశించిన లాభాలు రాకపోవడంతో ఈ బ్రాండ్ను పొడిగించేందుకు జుబిలెంట్ మొగ్గు చూపలేదు. దీంతో దశలవారీగా స్టోర్లను మూసివేయనున్నారు. డొమినోస్ వంటి ఇతర లాభదాయక బ్రాండ్లపైనే ఇకపై ఆ సంస్థ దృష్టి సారించనుంది.
TG: ట్రాఫిక్ సూపర్వైజర్, మెకానికల్ సూపర్వైజర్ పరీక్షల ప్రిలిమినరీ కీని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ప్రిలిమినరీ కీని అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యంతరాలపై ఈనెల 7వ తేదీ సా.5 గంటల వరకు సూచనలు ఇవ్వాలని కోరింది. ప్రతి అభ్యంతరానికి రూ.500 ఫీజుగా నిర్ణయించింది. కాగా గత నెల 29న పరీక్షలు నిర్వహించింది.
డెహ్రాదూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో 8వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే గడువు రేపటితో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. 2027 జనవరి నాటికి ఏడో తరగతి ఉత్తీర్ణులైన లేదా ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 02.01.2014 – 01.07.2015 మధ్య జన్మించి ఉండాలి.
IPL వేళ క్రికెట్ ఫ్యాన్స్కు జియో బిగ్ షాకిచ్చింది. తన పాపులర్ రూ.195 క్రికెట్ డేటా ప్యాక్ వ్యాలిడిటీని భారీగా తగ్గించింది. గతంలో 90 రోజులుగా ఉన్న చెల్లుబాటును ఇప్పుడు కేవలం 30 రోజులకు కుదించింది. 15GB డేటా, జియోహాట్స్టార్ ప్రయోజనాలు మారనప్పటికీ, వ్యాలిడిటీ తగ్గడం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడనుంది. తక్కువ ధరలో ఎక్కువ రోజులు వాడాలనుకునే వారికి ఇది చేదు వార్త.
IPL వేళ క్రికెట్ ఫ్యాన్స్కు జియో బిగ్ షాకిచ్చింది. తన పాపులర్ రూ.195 క్రికెట్ డేటా ప్యాక్ వ్యాలిడిటీని భారీగా తగ్గించింది. గతంలో 90 రోజులుగా ఉన్న చెల్లుబాటును ఇప్పుడు కేవలం 30 రోజులకు కుదించింది. 15GB డేటా, జియోహాట్స్టార్ ప్రయోజనాలు మారనప్పటికీ, వ్యాలిడిటీ తగ్గడం వల్ల వినియోగదారులపై అదనపు భారం పడనుంది. తక్కువ ధరలో ఎక్కువ రోజులు వాడాలనుకునే వారికి ఇది చేదు వార్త.
SRCL: గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ విశ్వాసాన్ని ప్రతిబింబించేలా “రన్ ఫర్ ఏ జీసస్” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని వేములవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వాసులు, యువత పెద్దఎత్తున పాల్గొని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ తీశారు. ప్రార్థనలు, కీర్తనలు చేస్తూ యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ ముందుకు సాగారు.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,930గా ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,38,350 వద్ద కొనసాగుతోంది. అటు కిలో వెండి ధరలో కూడా ఎలాంటి మార్పు లేకుండా రూ.2,55,000 వద్దే నిలకడగా ఉంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.