అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇటీవల 70 డాలర్లు ఉన్న బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఇప్పుడు 110 డాలర్లు దాటింది. దీంతో 1973 నాటి చమురు సంక్షోభాన్ని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ప్రపంచ చమురు వాణిజ్యంలో అతిపెద్ద సంక్షోభంగా 1973ని వ్యవహరిస్తారు. అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఈ పరిస్థితి నెలకొంది. అప్పట్లో ఒక్కో బ్యారెల్ 3 డాలర్లు ఉండగా ఆంక్షల ఫలితంగా 12 డాలర్లకు చేరింది.
దేశవ్యాప్తంగా IITలలో 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను మే 17వ తేదీన నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి విదేశీ విద్యార్థులు, ఏప్రిల్ 23 నుంచి భారతీయ విద్యార్థులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. మే 2న రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ. హాల్టికెట్లు మే 11 నుంచి అందుబాటులో ఉంటాయి. jeeadv.ac.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
‘టెక్ మహీంద్రాలో భారీ లేఆఫ్లు’ అంటూ జరుగుతున్న ప్రచారంపై దిగ్గజ టెక్ సంస్థ స్పందించింది. ఉద్యోగులను తొలగించబోతున్నామనే వార్తల్లో వాస్తవం లేదని, కంపెనీ వద్ద ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనలేమీ లేవని స్టాక్ ఎక్ఛేంజీ ఫైలింగ్లో స్పష్టంచేసింది. కాగా AI ప్రభావంతో సదరు టెక్ కంపెనీ 30 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అనేక కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.
AI కారణంగా గతేడాది 46 మంది కొత్త బిలియనీర్లు చేరారని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 4,020 మంది కుబేరుల్లో AI బిలియనీర్ల సంఖ్య 114కు చేరిందని, గతేడాది 700 మందికిపైగా కొత్త బిలియనీర్లు చేరారని రిపోర్టు తెలిపింది. అంటే రోజుకు ఇద్దరు చొప్పున సంపన్నులు జాబితాలో చేరారు. అత్యధికంగా NVDU ఫౌండర్ హువాంగ్ సంపద 34% పెరిగి 172 బిలియన్ డాలర్లకు చేరింది.
ముఖేష్ అంబానీ రూ.9.8 లక్షల కోట్లు, గౌతమ్ అదానీ రూ.7.5 లక్షల కోట్లు, రోష్నీ నాడార్ రూ.3.2 లక్షల కోట్లు, సైరస్ ఎస్ పూనావల్ల రూ.3.0 లక్షల కోట్లు, కుమార్ బిర్లా రూ.2.5 లక్షల కోట్లు, దిలీప్ షాంఘ్వీ రూ.2.3 లక్షల కోట్లు, అజీమ్ ప్రేమ్జీ రూ.2.3 లక్షల కోట్లు, నీరజ్ బజాజ్ రూ.2.2 లక్షల కోట్లు, అశోక్ హిందూజా రూ.2.2 లక్షల కోట్లు, రాధాకృష్ణ దమానీ రూ.1.5 లక్షల కోట్లు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై విజయం సాధించి టోర్నీని కైవసం చేసుకున్నది. కాగా, బ్రాడ్కాస్టర్ జియోస్టార్ మ్యాచ్ సమయంలో 10 సెకన్ల కమర్షియల్ యాడ్ కోసం ఏకంగా రూ.50 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు యాడ్ ఎగ్జిక్యూటివ్లు తెలిపారు. టీవీలు, డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఎక్కువమంది యూజర్లను ఆకర్షించవచ్చని కంపెనీలు భావించాయి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 2,182 పాయింట్లు పడిపోయి 76,724కి, నిఫ్టీ 659 పాయింట్లు తగ్గి 23,747 స్థాయికి చేరుకున్నాయి. బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.92.29గా ఉంది.
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపై వార్ ఎఫెక్ట్ పడింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. జపాన్ సూచీ నిక్కీ 7శాతం పతనమైంది. 1000 పాయింట్లకు పైగా డౌ ప్యూచర్స్ పడిపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్లపైనా క్రూడాయిల్ ప్రభావం పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ నష్టాలు కనిపించే అవకాశం ఉంది. కాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.
గ్యాస్ సిలిండర్ బుకింగ్లో మార్పు చేస్తూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటి వరకు ఒక సిలిండర్ తీసుకున్న 15 రోజుల తర్వాతే రెండోది బుక్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే దానిని సవరిస్తూ ప్రకటన విడుదల చేశాయి. ఒక సిలిండర్ తీసుకున్నాక మరొకటి కావాలంటే 21 రోజుల గ్యాప్ ఉండాలని గ్యాస్ ఏజెన్సీలు వెల్లడించాయి.
భారత ప్రభుత్వ రంగ సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI)లో 48 పర్ఫామెన్స్ అనలిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి ఇవాళే లాస్ట్ రోజు. న్యూట్రీషియన్, సైకాలజీ, ఫిజియాలజీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. డిగ్రీతో పాటు స్పోర్ట్స్ సైన్స్ విభాగంలో ఏడాది అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. UG/EWS/OBSలకు పరీక్ష ఫీజు రూ.2000. SC/ST/ESM/మహిళలకు రూ.1500.
SRPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు నిర్వహించిన మహిళ దినోత్సవ వేడుకల్లో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సిబ్బందిని ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని, మహిళలు అన్ని రంగాల్లో చైతన్యవంతులైన ఉన్నత విద్యను అభ్యసించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని మహిళలందరికీ ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సర్పంచ్ సునీత-రవీందర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమని, కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు సత్తా చాటుతున్నారని సర్పంచ్ పేర్కొన్నారు.
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్(IDBI) వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న 1100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, 200 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అప్లికేషన్లు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ ఇవాళే ప్రారంభం కాగా.. డిగ్రీ ఉత్తీర్ణత, కనీసం రెండేళ్ల పని అనుభవం గలవారు ఈ నెల 19 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1050. SC/ST/PwBDలకు రూ.250.