• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

పీఎఫ్‌ ఖాతా నుంచి LIC ప్రీమియం కట్టొచ్చని తెలుసా?

ఆర్థిక కష్టాల సమయంలో పీఎఫ్ ఖాతా నుంచి బీమా ప్రీమియంను చెల్లించేందుకు EPFO వెసులుబాటు కల్పిస్తోంది. యాక్టివ్ పీఫ్ అకౌంట్ ఉన్న వారు ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చని చెప్పింది. అయితే బీమా పాలసీ చందాదారుడి పేరు మీదే ఉండాలని తెలిపింది. జీవిత భాగస్వామి లేదా పిల్లల మీద ఉంటే పాలసీ ప్రీమియంలు, ఇతర ప్రైవేటు బీమా ప్రీమియంలను చెల్లించడానికి వీలు ఉండదు.

January 5, 2026 / 04:35 PM IST

SBIలో 1146 జాబ్స్.. గడువు పెంపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు జనవరి 10 వరకు పొడిగించారు. వివిధ పోస్టులకు గానూ అభ్యర్థులకు డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. వయసు పోస్టును బట్టి 20-45 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం ఏడాదికి రూ. 6 లక్షల నుంచి రూ. 44 లక్షల వరకు ఉంటుంది. వివరాలకు అధికారిక వెబ్ సైట్ చూడండి.

January 5, 2026 / 02:10 PM IST

గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు శుభవార్త

ATP: దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ-జీకేవై) కింద గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీయువకులకు ఉచితంగా కంప్యూటర్ విద్య, స్పోకెన్ ఇంగ్లీష్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు DRDA పీడీ టి. శైలజ ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం నుంచి బుధవారం వరకు అర్హులైన వారిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.

January 5, 2026 / 09:00 AM IST

రేపు చందలూరులో మంత్రి గొట్టిపాటి పర్యటన

BPT: మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం పంగులూరు మండలం చందలూరులో పర్యటించనున్నారు. సాయంత్రం 3 గంటలకు అక్కడి జిల్లా పరిషత్ పాఠశాలలో భోజనశాలను ప్రారంభించి, అనంతరం విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. మంత్రి రాక సందర్భంగా తమ గ్రామ సమస్యలు పరిష్కారమవుతాయని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు.

January 5, 2026 / 08:02 AM IST

గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: రాప్తాడు మోడల్ స్కూల్‌లో ఖాళీగా ఉన్న పీజీటీ ఎకనామిక్స్ అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. 9వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు బోధించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇవాళ ధ్రువీకరణ పత్రాలు, రెండు సెట్ల జిరాక్స్ ప్రతులతో పాఠశాలలో స్వయంగా హాజరుకావాలని సూచించారు.

January 5, 2026 / 06:48 AM IST

నేడు ఉచిత కంటి వైద్య శిబిరం.. ఎక్కడంటే.?

KKD: సామర్లకోట పట్టణ పరిధి బ్రౌన్ పేట అంబేద్కర్ పార్కులో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నట్లు వార్డ్ కౌన్సిలర్ పిట్టా సత్యనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి వైద్యులచే కంటి  వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి, అవసరమైన వారికి కళ్లజోళ్లు అందజేస్తామన్నారు.

January 5, 2026 / 05:50 AM IST

ఈ నెలలో 14 రోజులపాటు సెలవులు

AP: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ఈ నెలలో 14 రోజులపాటు సెలవులు ఉండనున్నాయి. ఈరోజు ఆదివారం, 10-18 తేదీల్లో 9 రోజులు సంక్రాంతి సెలవులు, 23న వసంత పంచమి, 25న ఆదివారం, 26న రిపబ్లిక్ డే, అలాగే.. CBSE, ఇంటర్నేషనల్ సిలబస్ అనుసరించే పాఠశాలలు ప్రతి శనివారం సెలవు పాటిస్తాయి. దీంతో వారికి అదనంగా మరో 3 సెలవులు ఉంటాయి.

January 4, 2026 / 03:57 PM IST

6న SHG మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు: కమిషనర్

NDL: డోన్ మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 6న సఖి సురక్ష కార్యక్రమం కింద 35 ఏళ్లు పైబడిన స్వయం సహాయక సంఘ మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆదివారం కమిషనర్ ప్రసాద్ గౌడ్ తెలిపారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. రక్తపోటు, షుగర్‌, ఇతర సాధారణ వ్యాధులకు పరీక్షలు చేసి అవసరమైన వైద్య సూచనలు అందిస్తారన్నారు.

January 4, 2026 / 12:23 PM IST

మీ LIC పాలసీ లాప్స్ అయ్యిందా?

లాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించేందుకు LIC కొత్త కార్యక్రమం చేపట్టింది. ఏదైనా పాలసీపై ప్రీమియం చెల్లించడం ఆపేసిన ఐదేళ్లలోపు ఆ బాకీ ప్రీమియం చెల్లించి దాన్ని పునరుద్ధరించుకోవచ్చు. మార్చి 2 వరకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు LIC తెలిపింది. బాకీ ప్రీమియంపై 30% రాయితీ కూడా ఇస్తున్నట్లు చెప్పింది. అయితే, ఇది రూ.3 వేల నుంచి రూ.5 వేలు మించకుండా ఉంటుందని పేర్కొంది.

January 4, 2026 / 06:58 AM IST

BREAKING: తగ్గిన ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గి రూ.1,35,820కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం రూ.350 తగ్గి రూ.1,24,500 వద్ద కొనసాగుతోంది. అయితే వెండి ధర మాత్రం తగ్గింది. కిలో వెండి రూ.4000 తగ్గి రూ.2,56,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

January 3, 2026 / 09:59 AM IST

నేటి నుంచి టెట్ ఆన్‌లైన్ పరీక్షలు

TG: ఇవాళ్టి నుంచి టెట్ ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి. టెట్ పేపర్-1, పేపర్-2కి 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 18 జిల్లాల్లో 97 కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు.

January 3, 2026 / 06:25 AM IST

సీఎంను కలిసిన టీపీసీసీ అధికార ప్రతినిధి

NZB: రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. సీఎంకు ఆయన 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాల్కొండ నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసీ ముందుకు సాగాలని కోరారు.

January 2, 2026 / 07:03 PM IST

నిరర్థక ఆస్తులు మరింతగా తగ్గుతాయ్‌: ఆర్‌బీఐ

దేశ ఆర్థిక వ్యవస్థ వేగవంత వృద్ధిని నమోదు చేస్తోందని RBI తెలిపింది. ‘ఆర్థిక స్థిరత్వంపై విడుదల చేసిన అర్థ సంవత్సర నివేదిక’లో RBI పేర్కొంది. బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి మున్ముందు మరింత మెరుగవుతుందని వెల్లడించింది. 2025 సెప్టెంబరు చివరికి 46 బ్యాంకుల GNPA నిష్పత్తి దశాబ్దాల కనిష్ఠమైన 2.1శాతంగా ఉందని, 2027మార్చికి ఇది 1.9శాతానికి తగ్గుతుందని పేర్కొంది.

January 1, 2026 / 09:07 PM IST

6 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు

దేశంలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. డిసెంబర్ నెలలో సుమారు రూ.1.75 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే వసూళ్లు 6.1 శాతం పెరిగాయి. వీటితో కలిపి గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.22.08 లక్షల కోట్లకు చేరినట్లు గణాంకాలు వెల్లడించాయి.

January 1, 2026 / 03:51 PM IST

BREAKING: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

కొత్త ఏడాది వేళ వినియోగదారులకు షాక్ తగిలింది. వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.111 పెంచింది. దీంతో వాటి ధర రూ.1,619కి చేరింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.

January 1, 2026 / 01:22 PM IST