ఇంధన ఎగుమతిదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం(ATF) ఎగుమతులపై విండ్ఫాల్ ట్యాక్స్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రేట్ల ప్రకారం లీటర్ పెట్రోల్పై పన్ను రూ.1.5, డీజిల్పై రూ.13.5, ఏటీఎఫ్పై రూ.9.5కు తగ్గింది. అయితే దేశీయంగా వాహనదారులకు మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు.