దేశంలో కరెన్సీ మార్కెట్లో రూ.500 నోట్లతో పాటు నకిలీల బెడద పెరిగింది. గతేడాదితో పోలిస్తే నకిలీ రూ.500 నోట్లు 20% పెరిగాయని.. 1,41,907 నోట్లను గుర్తించామని RBI తెలిపింది. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీలు 5.7% పెరిగాయి. మరోవైపు, ఉపసంహరించుకున్న రూ.2 వేల నోట్లలో ఇప్పటివరకు 98.45% నోట్లు విజయవంతంగా బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు RBI తన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది.