పశ్చిమాసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో, ఎగుమతిదారులు అక్రమ లాభాలు పొందకుండా మార్చి 26న విండ్ఫాల్ ట్యాక్స్ తెచ్చారు. దీనివల్ల దేశీయంగా ఇంధన కొరత లేకుండా లభ్యత పెరిగింది. అప్పటి నుంచి మార్కెట్ ఒడిదుడుకులను బట్టి ఏప్రిల్, మే నెలల్లో పలుమార్లు ఈ పన్నులను సవరించిన కేంద్రం, తాజా సమీక్షలో వీటిని మరింత దిగువకు చేర్చింది.