KNR: కరీంనగర్ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మరో 26 రోజుల గడువు మాత్రమే ఉన్నందున అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. పన్ను చెల్లింపుపై ప్రజలకు అవగాహన కల్పించి, రూ.30 కోట్ల డిమాండ్ పూర్తి చేయాలన్నారు.