TG: ప్రజాసేవ చేసే అదృష్టం కలగడం గొప్ప అదృష్టమని, నిజాయితీగా ప్రజాసేవ చేస్తేనే గుర్తింపు వస్తుందని మల్కాజ్గిరి GJP ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల్లో ప్రజల మద్ధతుతో గెలిచిన అభ్యర్థులు హూందాగా వ్యవహరించాలని, గెలుపు గర్వం తలకెక్కించుకోకుండా నిజాయితీగా ప్రజాసేవ చేయాలని సూచించారు. లేదంటే రాజకీయ భవిష్యత్ ఉండదన్నారు. అధికార మదంతో BRS ఒకప్పుడు విర్రవీగిందన్నారు.