ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ మీషోకు ఆదాయ పన్ను శాఖ రూ.1500కోట్ల పన్ను నోటీసులు పంపింది. 2023-25 మదింపు గానూ ఈ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన మీషో.. న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ నోటీసు.. తమ సంస్థ ఆర్థిక కార్యకలాపాలు, ఫైనాన్షియల్ పొజిషన్పై ప్రతికూల ప్రభావాన్ని చూపదని పేర్కొంది.