హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640కి చేరింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.2,300 పెరిగి రూ.1,50,000 మార్కును తాకింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.2,90,000 వద్దే కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.