VKB: కుల్కచర్ల మండల ప్రజలు ఈ నెల 28న నిర్వహించే ‘జాతీయ లోక్ అదాలత్’ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రమేష్ కుమార్ కోరారు. మైనర్ క్రిమినల్, కుటుంబ, సివిల్, ఇతర వివాదాలను రాజీమార్గంలో పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశమన్నారు. రాజీతో సమయం, వ్యయం తగ్గడమే కాక ఇరుపక్షాల మధ్య శాంతి, సఖ్యత నెలకొంటుందని తెలిపారు.