పీఎం జన్ ధన్ యోజన కింద ఓపెన్ చేసిన 75 కోట్ల పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ నిబంధన లేదని కేంద్రమంత్రి నిర్మలమ్మ వెల్లడించారు. కనీస బ్యాలెన్స్ లేకపోయిన వీటికి ఎలాంటి జరిమాన పడదన్నారు. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే సున్నా-నిల్వ ఖాతా సౌకర్యాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే డిపాజిట్, నగదు ఉపసంహరణ, ఏటీఎం సేవలకు కూడా ఛార్జీలు ఉండవని తెలిపారు.