PLD: కోటప్పకొండలో నిర్వహిస్తున్న ఏఐవైఎఫ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ పాల్గొన్నారు. యువత సామాజిక, రాజకీయ అంశాలపై చైతన్యవంతంగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగం, యువత సమస్యలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ.. యువత పోరాట స్ఫూర్తితో ముందుకు రావాలని సూచించారు.