NLR: స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులు నిలబడడానికి భయపడేలా నాయకులు పనిచేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీడీపీ శ్రేణులకు సూచించారు. బుచ్చి టీడీపీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అన్ని స్థానాలు ఏకగ్రీవంగా అయ్యేలా చూడాలని సూచించారు. నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు.