• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కాలుష్య కోరల్లో కొవ్వూరు పట్టణం

EG: కొవ్వూరు పట్టణంలో చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం ప్రజలప్రాణాలకు ముప్పుగా మారుతోందని స్థానికులు మంగళవారం ఆరోపిస్తున్నారు. 24 వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికులు సేకరించిన క్విoటాళ్ల కొద్ది తడి పొడి చెత్తను గోదావరి ఆర్చ్ బ్రిడ్జి వద్ద తగులబెట్టడం వల్ల తీవ్ర కాలుష్యం వ్యాపిస్తోంది. పట్టణ ప్రజలు రోజూ విషపూరిత పొగతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయటున్నారు స్థానికులు.

March 10, 2026 / 08:52 PM IST

సావిత్రిబాయి ఫూలేకు వైసీపీ నివాళులు

KRNL: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఇవాళ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, వైసీపీ సీనియర్ నాయకులు హాజరై ఆమె సేవలను స్మరించారు. అభివృద్ధికి సావిత్రిబాయి ఫూలే చేసిన కృషిని నేతలు గుర్తుచేశారు.

March 10, 2026 / 08:45 PM IST

మా సమస్యను పట్టించుకోండి సార్..!

CTR: పెనుమూరు మండలం, పులికల్లు పంచాయితీ పరిదిలోని గొడుగుమానిపల్లి గ్రామంలో రోడ్డు అధ్వానంగా మారింది. రాముల వారి గుడి నుంచి వినాయకుడి గుడి వరకు చెత్తా, చెదారాల వ్యర్థాలతో రోడ్డు చెత్త కుప్పలా మారింది. అటు వైపు వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది. సంబంధిత అధికారులకు తెలియజేసినా ఫలితం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

March 10, 2026 / 08:40 PM IST

ఆ హాస్పిటల్‌ను సీజ్ చేయాలి: సీపీఐ

TPT: తిరుపతి భవాని నగర్‌లోని రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌పై వెంటనే విచారణ జరిపి సీజ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతూ మృతి చెందిన యువకుడి కుటుంబం నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, మృతదేహాన్ని ఇవ్వడానికి కూడా రూ.45 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు.

March 10, 2026 / 08:37 PM IST

ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

W.G: పోడూరు మండలం కవిటంలో శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి PA మోహన్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సతీష్ కుమార్, సొసైటీ అధ్యక్షుడు ఊడిగ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

March 10, 2026 / 08:36 PM IST

ఏటి కొప్పాక ఘటనలో ఇద్దరు అరెస్ట్

AKP: ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో ఈనెల 8న నాటు తుపాకీ ప్రమాదవశాత్తు పేలి ఆడారి కౌశిక్ (12) మృతి చెందిన ఘటనలో మంగళవారం ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. లైసెన్స్ లేకుండా కె. సూరిబాబు వద్ద రెండు నాటు తుపాకులు కలిగి ఉన్నట్లు తెలిపారు. సూరిబాబు కొడుకు తన స్నేహితులను ఇంటికి తీసుకువెళ్లి నాటు తుపాకీలు చూపిస్తున్న సందర్భంగా ఒకటి మిస్ ఫైర్ అయిందని పేర్కొన్నారు.

March 10, 2026 / 08:35 PM IST

ఏపీజేఏసి నూతన కమిటీ ఏర్పాటు

VZM: కొత్తవలస ఎన్జీవో భవనంలో మంగళవారం జరిగిన 20 మందితో నూతన ఏపీజేఏసి కమిటీని ఎన్నుకొన్నారు. ఏపీజేఎసి ఛైర్మన్‌గా జే.వీ.ప్రసాదరావు ఎన్నికవ్వగా, కార్యదర్శిగా ఎం. కుమార్ నియమితులయ్యారు. నూతన కమిటీ ఏపీజేఏసి ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కొత్తవలస మేజర్ పంచాయతీ కార్యాలయంలో శానిటరీ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న MVRL ప్రసాద్ నియమితులయ్యారు.

March 10, 2026 / 08:34 PM IST

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

ప్రకాశం: కంభం మండలంలోని ఎర్రబాలెం గ్రామానికి రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన తారురోడ్డు పనులు పూర్తయ్యాయి. రోడ్డు నిర్మాణం పూర్తవడంతో గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని శాలువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

March 10, 2026 / 08:30 PM IST

‘ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం’

PPM: మున్సిపాలిటీ పరిధిలోని బహుళ అంతస్తుల భవనాల్లో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మున్సిపల్ యంత్రాంగం చిత్తశుద్ధితో ఉందని మున్సిపల్ కమిషనర్ జీ.శ్రీనివాసరాజు మంగళవారం తెలిపారు. ఓ పత్రికలో వచ్చిన కథనానికి బహుళ అంతస్తులు అందని వసతులపై ఆయన పై విధంగా స్పందించారు .ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు.

March 10, 2026 / 08:30 PM IST

కరెంట్ షాక్‌తో పూజారి మృతి

NLR: కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం పెన్నా కరకట్టపై ఉన్న శ్రీ పెన్నేశ్వర శివాలయం పూజారి దువ్వూరు కృష్ణయ్య (71) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మంగళవారం మృతి చెందారు. కోవూరు రాళ్ల మిట్టలోని తన ఇంట్లో ఫ్యాన్ వైర్లను ప్లగ్‌లో పెట్టగా కరెంట్ షాక్‌కు గురయ్యారు. గమనించిన కుమారుడు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

March 10, 2026 / 08:30 PM IST

గుత్తి కోట ఉత్సవాలపై జాయింట్ కలెక్టర్ కీలక సమీక

ATP: గుత్తి కోట ఉత్సవాలను ఈనెల 14, 15 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గుత్తి ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో రెండు రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. జిల్లా ఖ్యాతి పెరిగేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

March 10, 2026 / 08:30 PM IST

పాఠశాలకు షోకాజ్ నోటీసు

గుంటూరు సంగడిగుంటలోని శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలు 1వ తరగతి విద్యార్థిని చెంపలపై కొట్టిందన్న ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మండల విద్యా అధికారి (గుంటూరు తూర్పు) షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఘటనపై పూర్తి వివరణను ఒక రోజు లోపు సమర్పించాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 10, 2026 / 08:30 PM IST

భక్తుల క్షేమమే ప్రధాన లక్ష్యం: ఎస్పీ

KRNL: మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కర్నూలు మీదుగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులను సామర్థ్యానికి మించి ఎక్కించుకోకూడదని వాహనాల డ్రైవర్లకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం స్పష్టం చేశారు. భక్తుల క్షేమమే ప్రధాన లక్షమని తెలిపారు. లోడింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతాయన్నారు. అటువంటి వాహనాలపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.

March 10, 2026 / 08:28 PM IST

బాణసంచా కేంద్రాల్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

KKD: బాణసంచా తయారీ కేంద్రాలు పూర్తిస్థాయిలో భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ బిందుమాధవ్ స్పష్టం చేశారు. మంగళవారం కరపలోని తయారీ యూనిట్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం మూసివేసి ఉన్న కేంద్రాల యజమానులతో మాట్లాడారు. అజాగ్రత్తగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

March 10, 2026 / 08:26 PM IST

బాణసంచా కేంద్రాల్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

KKD: బాణసంచా తయారీ కేంద్రాలు పూర్తిస్థాయిలో భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ బిందుమాధవ్ స్పష్టం చేశారు. మంగళవారం కరపలోని తయారీ యూనిట్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం మూసివేసి ఉన్న కేంద్రాల యజమానులతో మాట్లాడారు. అజాగ్రత్తగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

March 10, 2026 / 08:26 PM IST