TPT: తిరుపతి భవాని నగర్లోని రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్పై వెంటనే విచారణ జరిపి సీజ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. బ్రెయిన్ స్ట్రోక్తో చికిత్స పొందుతూ మృతి చెందిన యువకుడి కుటుంబం నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, మృతదేహాన్ని ఇవ్వడానికి కూడా రూ.45 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు.