KKD: బాణసంచా తయారీ కేంద్రాలు పూర్తిస్థాయిలో భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ బిందుమాధవ్ స్పష్టం చేశారు. మంగళవారం కరపలోని తయారీ యూనిట్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం మూసివేసి ఉన్న కేంద్రాల యజమానులతో మాట్లాడారు. అజాగ్రత్తగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు