NDL: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనను మండలంలో పక్కాగా నిర్వహించాలని తహశీల్దార్ నాగమణి ఇవాళ సూచించారు. బేతంచెర్ల ఎంపీడీవో కార్యాలయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ నిర్వహించారు. శిక్షకులు నాగరాజు, మహేష్ మూడు రోజులపాటు మార్గదర్శనం చేస్తారు. క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన గణన జరిగేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.